రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ - ఒకే టికెట్తో వేర్వేరు తీర్థయాత్రలు - అదీ 25 శాతం తక్కువ ఛార్జీలకే
సాధారణ ఛార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువకే - తీర్థయాత్రలు వెళ్లేవారికి రైల్వే విభాగం సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ సదుపాయం - ఆ సర్క్యులేటింగ్ ప్రయాణాలు ఇవే!

Published : February 28, 2026 at 12:47 PM IST
Circular Journey Ticket for Visit for Pilgrims : హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక ప్రదేశాలు, తీర్థయాత్రలు వెళ్లి రావాలనుకునే వారికి రైల్వే విభాగం సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ టికెట్ సాధారణ ప్రయాణ ఛార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువ ఖర్చుతో అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి మొత్తం 19 యాత్రలు అందుబాటులో ఉన్నాయి.
ఆ సర్క్యులేటింగ్ ప్రయాణాలు ఇవే! :
- కాచిగూడ - ఔరంగాబాద్ - ఉజ్జయినీ - భద్రాచలం రోడ్ - తిరుపతి - చెన్నై సెంట్రల్ - బెంగళూరు సిటీ - మైసూర్ - హుబ్లీ - సికింద్రాబాద్
- మంత్రాలయం - తిరుపతి - బెంగళూరు సిటీ - చెన్నై సెంట్రల్ - భద్రాచలం - నాంపల్లి హైదరాబాద్
- భద్రాచలం రోడ్ - హైదరాబాద్ - ముంబయి - పూరి - వారణాసి - ఫైజాబాద్- హౌరా - రిషికేష్ - దిల్లీ
- సికింద్రాబాద్ - బీజాపూర్ - కొల్హాపూర్ - వాస్కోడిగామా - మైసూరు - తిరుపతి - చెన్నై సెంట్రల్ - భద్రాచలం రోడ్ - హైదరాబాద్
వీటితో పాటు మరో పదిహేను ప్రయాణాలకు ఈ సదుపాయం ఉంది. వివరాలకు ఇండియన్ రైల్వే వెబ్సైట్ను సందర్శించవచ్చు.
నిబంధనలు ఏంటంటే :
- ఒక టికెట్లో గరిష్ఠంగా 8 బ్రేక్ ప్రయాణాలు చేయడానికి అనుమతి 56 రోజుల వరకు గడువు ఉంటుంది. (అయితే ఇది ప్రయాణ దూరానికి తగ్గినట్టుగా మారుతుంది)
- వృద్ధులకు అదనపు రాయితీలు (పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం) ఉంటుంది.
- వేర్వేరు రైళ్లు మారొచ్చు.
ఎలా బుక్ చేసుకోవాలంటే :
- ముందుగా సిక్రింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ ఆఫీస్కి వెళ్లి సంప్రదించాలి.
- ఎంపిక చేసిన ప్రయాణానికి వాటికి సంబంధించి ఛార్జీలు లెక్కించి ఫారం అందిస్తారు.
- ఆ ఫారంతో బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు.
- టికెట్ తీసుకున్న తర్వాత విడివిడిగా రిజర్వేషన్ చేయించుకోవాలి.
- అలా చేస్తే రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే బెర్త్ వస్తుంది.
- అలా కాకపోతే ఆర్ఏసీ లేదా అన్రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణం చేయొచ్చు.
- 60 రోజుల ముందుగా, నాన్ సీజన్ సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
అమృత్ భారత్ 2.0 ఎక్స్ప్రెస్లో ఆ టికెట్లు ఉండవు : చర్లపల్లి తిరువనంతపురం అమృత్ భారత్ 2.0 ఎక్స్ప్రెస్లో పలు ప్రత్యేకతలు కలగనున్నాయి. సాధారణంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ టికెట్ అయిపోయాక కూడా ఆర్ఏసీ టికెట్లు, ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఇస్తారు. కానీ అమృత్ భారత్లో ఆర్ఏసీ టికెట్లు ఉండవని రైల్వే బోర్డు ఇటీవల తెలిపింది. అంటే ఇందులో బెర్తుల వరకే టికెట్లు ఇస్తారు. కానీ వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు రిజర్వేషన్ ఉన్న వారిని పక్కన కూర్చుని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉండదు.
సామాన్య ప్రయాణికులకు ప్రయోజనకరం : అమృత్ భారత్లో ట్రైన్లో ఏసీ కోచ్లు ఉండవు. కేవలం అందులో జనరల్, స్లీపర్ బోగిలు మాత్రమే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల సామాన్య ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 11 జనరల్ సెకండ్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ కోచ్లు, 8 స్లీపర్ కోచ్లు, అలాగే దివ్యాంగుల ఫ్రెండ్లీ, 1 ప్యాంట్రీ కార్ ఉంటాయి. ఇది జనవరి 27వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే అమృత్ భారత్ ఛార్జీలే అమృత్ భారత్ 2.0 రైల్లోనూ అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? ఫుల్ క్లారిటీ ఇదిగో!
సర్వ పాపాలను పోగొట్టే మహిమాన్విత దివ్యక్షేత్రం! కపిల తీర్థం దర్శిస్తే సకల దుఃఖాలు దూరం!!

