స్పెషల్ టెట్ షెడ్యూల్ ఇదే - నేటి నుంచే దరఖాస్తులు స్వీకరణ
ఇన్సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల - నోటిఫికేషన్ వివరాలు ఎక్స్లో షేర్ చేసిన మంత్రి లోకేశ్ - టీచర్లు టెట్ అర్హత పూర్తి చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 7:33 AM IST
TET Exam: సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించింది. హాల్టికెట్లను అక్టోబర్ 5 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలు రెండు విడతలుగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయి. ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 24న విడుదల చేస్తారు. నవంబర్ 1 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10న తుది కీ విడుదల చేస్తారు. టెట్ ఫలితాలను నవంబరు 15న వెల్లడిస్తామని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయుల వినతుల మేరకు ప్రభుత్వం ఈ ప్రకటన ఇచ్చింది.
ప్రత్యక్ష నియామకాలకు ప్రత్యేక టెట్ పనికిరాదు : ప్రత్యేక టెట్లో అర్హత సాధించినవారు భవిష్యత్తులో నిర్వహించే ఏ ప్రత్యక్ష నియామక ప్రక్రియకు హాజరుకాకూడదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.‘డీఈడీ, బీఈడీ అర్హతలతో నియమితులైన ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ, భాషా పండితులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు సంబంధిత సబ్జెక్టులో పేపర్-2 పరీక్ష రాయాలి. టెట్ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పుల్లేవు’ అని తెలిపింది.
Special TET for In-Service Teachers
— Lokesh Nara (@naralokesh) August 24, 2026
It gives me immense pleasure to announce the Special Teacher Eligibility Test (Special TET) for In-Service Teachers by the Government of Andhra Pradesh.
This is a significant opportunity for our dedicated teachers to fulfil the TET…
ఎక్స్లో షేర్ చేసిన మంత్రి లోకేశ్: స్పెషల్ టెట్ నోటిఫికేషన్ వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలతో సహా పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పటివరకు టెట్ రాయనటువంటి లేదా రాసినా అర్హత సాధించని ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబర్ 11-21 మధ్య పరీక్షలు : విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' నిర్వహిస్తుండటం పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించి, ఆత్మవిశ్వాసంతో తమ వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.
అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు : అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మాక్ టెస్ట్ల ద్వారా పరీక్షకు సిద్ధం కావాలని మంత్రి లోకేశ్ కోరారు. ఈ స్పెషల్ టెట్కి సంబంధించిన మరిన్ని వివరాలు, మార్గదర్శకాల కోసం https://cse.ap.gov.in, https://tet2dsc.apcfss.in అనే అధికారిక వెబ్సైట్లను సందర్శించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయులను శక్తివంతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన విద్యకు బలమైన పునాది వేయడానికి అందరూ కలిసి పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
జగన్కు ఏపీపీఎస్సీ-డీఎస్సీ అర్థం కాదు - రెండూ ఒకటే అనుకుంటున్నారు: మంత్రి లోకేశ్
మెగా డీఎస్సీపై సభకు వచ్చి చర్చించాలి - జగన్కు మంత్రి లోకేశ్ సవాల్

