నకిలీ ప్రారంభోత్సవాలు వైఎస్సార్సీపీకే సొంతం: మంత్రి లోకేశ్
వెలిగొండ తన ఘనతంటూ జగన్ పోస్టు - 2024లోనే గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభించిన వీడియో - నీళ్లు లేని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం ఏంటని ఎద్దేవా చేసిన లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 31, 2026 at 2:32 PM IST
Nara Lokesh Counter Attack to Jagans Post : వెలిగొండ తన ఘనతంటూ జగన్ చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2024లో నీళ్లు లేకుండానే వెలిగొండ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. జగన్ పోస్టులోని విజువల్స్ను నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని, నీరు లేని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి చరిత్ర సృష్టించారని విమర్శించారు. ఇది నకిలీ ప్రారంభోత్సవమని, ఇలాంటి ఘనత వైఎస్సార్సీపీకి మాత్రమే దక్కుతుందని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు.
నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక… pic.twitter.com/nDineOXzWb
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2026
వెలిగొండ రాజశేఖర్ రెడ్డి కళ అన్న జగన్: వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. ఈ ప్రాజెక్ట్ ఘనతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "కాజేయడానికి" ప్రయత్నిస్తున్నారని జగన్ 'ఎక్స్' వేదికగా ఆరోపించడంతో ఈ రాజకీయ వివాదం ముదిరింది. 1996లో చంద్రబాబు కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారని, కానీ దీని వెనుక ఉన్న అసలు దార్శనికత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని, అలాగే కీలకమైన జంట సొరంగ మార్గాల నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలోనే పూర్తయిందని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ట్రయల్ రన్, సంబరాలను ఆయన కేవలం "ప్రచార ఆర్భాటాలు"గా కొట్టిపారేశారు.
Look closely at the visuals..
— Lokesh Nara (@naralokesh) August 31, 2026
In 2024, @ysjagan created history… He “inaugurated” an irrigation project… without any water in it. 😂
A fake inauguration - only @YSRCParty could pull this off!#PsychoFekuJagan #VeligondaProject #CBNfulfillsVeligondaDream https://t.co/xXEplfnkf5
నారా లోకేశ్ ఎదురుదాడి: జగన్ ఆరోపణలకు 'ఎక్స్' వేదికగా నేరుగా స్పందించిన నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి తన హయాంలో "నకిలీ ప్రారంభోత్సవం" చేశారని ఎండగట్టారు. "నీళ్లు లేని ప్రారంభోత్సవం"పై ఎద్దేవా చేశారు. 2024 నాటి దృశ్యాలను నిశితంగా గమనించాలని ప్రజలను లోకేశ్ కోరారు. "2024లో జగన్ చరిత్ర సృష్టించారు. నీళ్లు లేని సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించారు. ఒక నకిలీ ప్రారంభోత్సవం - ఇది కేవలం వైఎస్సార్సీపీకే సాధ్యం". తన స్పందనతో పాటు కొన్ని హ్యాష్ట్యాగ్లను కూడా పోస్టు కింద జత చేశారు. అందులో 'ఫేక్ జగన్', 'డ్రీమ్ వెలిగొండ ప్రాజెక్ట్' వంటివి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్గా మారాయి.
30 ఏళ్ల కల సాకారం: దశాబ్దాల నిరీక్షణ తర్వాత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హయాంలో వెలిగొండ సొరంగం గుండా కృష్ణా జలాలు మొదటిసారిగా ప్రవహించాయని లోకేశ్ నొక్కి చెప్పారు. కరువు పీడిత ప్రాంతానికి ఇది చారిత్రాత్మక జీవనాడి అని ఆయన అభివర్ణించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదని, ప్రస్తుత ప్రభుత్వ దృఢమైన విధానమని ఆయన స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం - జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు
కరువు నేలకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రులు

