ETV Bharat / sports

15ఏళ్లకే కెప్టెన్​గా వైభవ్ సూర్యవంశీ - చిన్నోడి ఖాతాలో మరో రికార్డ్

పురుషుల సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ - సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

Vaibhav Sooryavanshi
వైభవ్ సూర్యవంశీ (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : August 30, 2026 at 3:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vaibhav Sooryavanshi : గత రెండేళ్లుగా క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. ఐపీఎల్​తో ఆడిన ఏడాదికే అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన ఈ చిచ్చరపిడుగు, ఇప్పుడు కెరీర్​లో మరో కీలక ఘనత సాధించాడు. కేవలం 15ఏళ్లకే ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్​లో హేమాహేమీ ఆటగాళ్లున్న జట్టుకు సారథ్యం వహించాడు. దీంతో ఈ టోర్నీ హిస్టరీలోనే అరుదైన దృశ్యం కనిపించింది.

వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్​గా!
ఈ దులీప్ ట్రోఫీలో వైభవ్ ఈస్ట్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టీమ్​కు అతడు వైస్ కెప్టెన్​గా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈస్ట్ జోన్ - సెంట్రల్ జోన్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అకస్మాత్తుగా గాయపడి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో 15 ఏళ్ల వయసున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి జట్టు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయన్నమాట! అలా సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వైభవ్ కెప్టెన్​గా జట్టును నడిపించాడు.

డీఆర్​ఎస్ సక్సెస్
సెంట్రల్ జోన్ బ్యాటింగ్​లో 39.1 ఓవర్ వద్ద జుయల్ క్రీజులో ఉన్నాడు. ముకేశ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో బంతి కీపర్ చేతిలో పడింది. దీనిని ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచౌట్​కు అప్పీల్ చేయగా అంపైర్ ఇవ్వలేదు. దీంకో స్టాండ్ ఇన్ కెప్టెన్​గా ఉన్న వైభవ్ రివ్యూ తీసుకున్నాడు. రీప్లైలో బ్యాటుకు బంతి తగిలినట్లు తేలడంతో జుయల్​ను అంపైర్ ఔట్​గా ప్రకటించాడు. అలా కెప్టెన్​గా తీసుకున్న తొలి రివ్యూకే వైభవ్ సక్సెస్ అయ్యాడు.

సీనియర్లకు హెడ్​గా!
వైభవ్ సారథ్యం వహిస్తున్న జట్టులో టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్ లాంటి టాప్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లను వైభవ్ ముందుండి నడిపిస్తున్నాడు.

గాయం ఇలా!
ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్​కు వికెట్ కీపింగ్ చేస్తుండగా బంతి వేగంగా వచ్చి అతడి కుడి చేతికి బంతి బలంగా తగలింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలల్లాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఇషాన్​కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇషాన్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో వైభవ్​కు నాయకుడిగా జట్టును నడిపించే అవకాశం దక్కింది.

మ్యాచ్ విషయానికొస్తే, ఈస్ట్ జోన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సెంట్రల్ జోన్ బ్యాటింగ్​కు దిగింది. తొలిరోజు 69 ఓవర్లకు ఆ జట్టు 214-8 స్కోర్​తో నిలిచింది. రింకు సింగ్ (60 పరుగులు) టాప్ స్కోరర్. ఆర్యన్ జుయల్ (46 పరుగులు) రాణించాడు. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 3, అభిజిత్ కే సర్కార్ 2, కొనైన్ ఖురేషీ 2 వికెట్లు దక్కించుకొని సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైనప్​ను దెబ్బకొట్టారు.

మొదటిసారి సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా
కాగా, వైభవ్ సూర్యవంశీ సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. 2024లో అతడు రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అతడికి ఫస్ట్ క్లాస్ కెరీర్​లో ఇది 10వ మ్యాచ్ మాత్రమే. ఇక దులీప్ ట్రోఫీలో కేవలం రెండోదే. అప్పుడే ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఓ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఈ నెల ప్రారంభంలో ఈస్ట్ జోన్ జట్టును ఎంపిక చేసేటప్పుడే సెలక్టర్లు వైభవ్​ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

ప్రస్తుత దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఈస్ట్ జోన్‌ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌పై భారీ విజయం సాధించింది. కానీ ఆ మ్యాచ్​లో ఒకే ఇన్నింగ్స్​లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్ చేసింది. అందులో అతడు 8 పరుగులకే పెవిలియన్​కు చేరాడు. కానీ బౌలింగ్​లో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి సర్​ప్రైజ్ ఇచ్చాడు.

ఈ ఛాంపియన్స్ జట్టుకు ట్రూజన్ సోలార్ సన్మానం - హాజరైన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్‌

'ఏజ్ జస్ట్ నెంబరే బాస్'- 51ఏళ్ల వయసులో వరల్డ్ క్రికెట్​లో రేర్ రికార్డ్