ETV Bharat / sports

టీమ్ఇండియా ఫ్యాన్స్​కు బిగ్ షాక్- ఆ వన్డే సిరీస్​కు 'రో-కో' డౌటే!

భారత్ పర్యనటకు అఫ్గానిస్థాన్- ఒక టెస్టు, మూడు మ్యాచ్​ల్లో ఆతిథ్య జట్టుతో అఫ్గాన్​ ఢీ- టీమ్ఇండియా ఫ్యాన్స్​కు నిరాశ​

26845170_thumbnail_16x9_ROKO
26845170_thumbnail_16x9_ROKO (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : June 4, 2026 at 3:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ind vs Afg ODI 2026 : ఐపీఎల్ ముగియడంతో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతారా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే సొంతగడ్డపై ఇదే నెలలో జూన్ 13 నుంచి అఫ్గానిస్థాన్​తో భారత్ వన్డే సిరీస్ ఆడాల్సి​ ఉంది. ఈ సిరీస్​కు సీనియర్లు రోహిత్, విరాట్ కూడా ఎంపికయ్యారు. దీంతో త్వరలోనే తమ అభిమాన స్టార్లను మైదానంలో చూడొచ్చని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అయితే అలా సంబరపడిపోతున్న అభిమానులకు నిరాశ మిగిలేలాగా కనిపిస్తుంది.

షరతులతోనే ఎంపిక!
ఇటీవల ముగిసిన ఐపీఎల్​లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో పలు మ్యాచ్​లకు దూరమయ్యాడు. దీంతో అతడిని ఈ సిరీస్​కు రోహిత్​ను సెలక్టర్లు షరతులతో ఎంపిక చేశారు. సిరీస్ ప్రారంభానికి ముందు అతడు ఫిట్​నెస్ టెస్టులో పాస్ అవ్వడంపైనే జట్టులో చోటు ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు తెలిపారు. అయితే ఐపీఎల్​లో రీ ఎంట్రీ ఇవ్వడం, వచ్చీ రాగానే హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ఫిట్​నెస్ క్లియర్ చేయడం పక్కా అని అభిమానులు అనుకున్నారు. కానీ తాజా పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంకా కండరాలగాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లో రిపోర్ట్ చేయలేదని తెలుస్తోంది.

విరాట్ కూడా!
మరోవైపు, ఈ ఐపీల్​లో 600+ పరుగులతో అదరగొట్టిన విరాట్​ కూడా ఈ సిరీస్​కు దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్​తో ఫైనల్​ మ్యాచ్ సమయంలో విరాట్​ కూడా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తుండగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్​లో చివరిదాకా విరాట్ క్రీజులో ఉండి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే విరాట్​ ప్రస్తుతానికి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు ​ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లో ఇంకా రిపోర్ట్ చేయలేదని తెలిసింది. దీంతో విరాట్ కూడా అఫ్గాన్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాని తెలుస్తోంది. ఏదేమైనా టీమ్ఇండియాకు ఇది బిగ్ బ్లో అని చెప్పవచ్చు!

ఇద్దరు దూరం!
అలా కండరాల గాయంతో జట్టులోని స్టార్ ప్లేయర్లు ఇద్దరు కూడా అఫ్గాన్​తో సిరీస్​కు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్లు లేకపోవడం టీమ్ఇండియాకు కూడా గట్టి ఎదురుదెబ్బే! అటు అభిమానులు ఈ వార్తతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. యువ టీమ్ఇండియాకు ఇదొక ఛాలెంజ్​గా మారనుంది. సీనియర్ల స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారు? రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్​గా ఎవరు వస్తారు? అనే విషయాల్లో ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.

ఈ పర్యటనలో అఫ్గాన్​ షెడ్యూల్

  • ఏకైక టెస్టు మ్యాచ్ - జూన్ 06 - 10 - ముల్లాన్​పుర్
  • తొలి వన్డే - జూన్ 13- ధర్మశాల
  • రెండో వన్డే- జూన్ 17 - ఎకానా స్టేడియం, లఖ్​నవూ
  • మూడో వన్డే - జూన్ 20, చిదంబరం స్టేడియం, చెన్నై

వచ్చే నెలలోనైనా!
ఇక అఫ్గాన్​తో సిరీస్​ తప్పితే టీమ్ఇండియా మళ్లీ వచ్చే నెలలో వన్డేలు ఆడనుంది. జులైలో టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్​లో ఐదు టీ20, మూడు వన్డే సిరీస్​లు ఆడాల్సి ఉంది. జులై 14 తొలి వన్డే ఉండనుంది. ఈ సిరీస్​లోపు అయినా రో-తో ద్వయం ఫుల్ ఫిట్​నెస్ సాధిస్తుందా? అనేది వేచి చూడాలి!

'ప్రపంచంలోనే సూపర్​స్టార్ అవుతాడు- కానీ అలా ఉంటేనే!'- వైభవ్​​పై లలిత్ మోదీ ప్రశంసలు!

శశిథరూర్‌కు అండగా సోనియా గాంధీ- ఆ స్కామ్ వెనుక కాంగ్రెస్ పెద్దలు : కొచ్చి టస్కర్స్ వివాదంపై లలిత్ మోదీ