ETV Bharat / sports

క్రికెటర్‌ రింకు సింగ్‌ కుటుంబంలో విషాదం- క్యాన్సర్​తో పోరాడుతూ తండ్రి మృతి

రింకు తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్‌ అనారోగ్యంతో మృతి - తన ప్రార్థనలు ఎల్లప్పుడూ రింకు కుటుంబంతో ఉంటాయన్న భారత మాజీ స్పిన్నర్

rinku singh father death
rinku singh father death ((Source: Getty Images (Left), ETV Bharat (Right)))
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 8:42 AM IST

3 Min Read
Choose ETV Bharat

Rinku Singh Father Death : టీమ్‌ ఇండియా క్రికెటర్‌ రింకు సింగ్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్‌ అనారోగ్యంతో మృతిచెందారు. స్టేజ్-4 కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ, శుక్రవారం తెల్లవారుజామున నొయిడాలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. తండ్రి అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన చికిత్స పోందుతున్న నోయిడాలోని ఆస్పత్రికి రింకూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి జరిగిన జింబాబ్వే మ్యాచ్​కు రింకూ దూరమయ్యారు.

రింకు ప్లేస్​లో శాంసన్​
ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రింకు ఆడలేదు. తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కారణంగా జట్టు నుంచి బయటికి వెళ్లిన రింకు, తండ్రి మరణంతో మళ్లీ జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడి స్థానంలో సంజు శాంసన్​ను తీసుకున్నారు. దీంతో అతడు జింబాంబ్వేతో ఆడాల్సిన మ్యాచ్​లో స్థానం కోల్పోయాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ను ఆ మ్యాచ్​లో ఓపెనింగ్ చేశాడు.

కుటుంబం కోసం తండ్రి కృషి
రింకు తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి, తన పిల్లలకు మంచి జీవితం అందించడానికి చాలా కృషి చేశారు. గ్యాస్​ డెలివరీ మ్యాన్​గా పనిచేస్తూ కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ రింకుకు క్రికెటర్​పై ఉన్న ఆసక్తి గమనించి అతడి కలలు నెరవేర్చేందుకు మద్దతుగా నిలిచాడు.

మరోవైపు రింకూ సింగ్ తండ్రి మరణంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు. రింకు తన క్రికెట్ బాధ్యతలకు కట్టుబడి ఉన్నప్పటికీ, ఈ సమయంలో అతని కుటుంబానికి ఇది చాలా కష్టమైన సమయం అని తెలిపారు. రింకు తండ్రి మరణం వార్త విని ఆయన చాలా బాధపడ్డారని, తన ప్రార్థనలు ఎల్లప్పుడూ రింకు కుటుంబంతో ఉంటాయని పేర్కొన్నారు.

స్పందించిన మాజీ కోచ్​
ఇటీవల ఈ విషయంపై రింకు మాజీ కోచ్​ మసూద్ అమిని స్పందిస్తూ ఖాన్చంద్ సింగ్ అడ్వాన్స్​డ్​ స్టేజ్ లివర్ క్యాన్సర్​తో పోరాడుతున్నాడని, అనారోగ్యం చివరి దశలో ఉందని చెప్పారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కాలేయ క్యాన్సర్​తో బాధపడుతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఆయన వెంటిలేటర్పై ఉన్నారు" అని అమిని అప్పట్లో చెప్పారు.

సమాజ్​ వాది పార్టీ ప్రియ సరోజ్​తో నిశ్చితార్థం
కాగా, గతేడాది జూన్​ 8న రింకు సింగ్ సమాజ్​ వాది పార్టీ ప్రియ సరోజ్​తో నిశ్చితార్థం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే లోక్​సభకు ఎంపీగా ఎన్నికైన వారిలో పిరయా సరోజ్​ ఒకరిగా నిలిచారు. అయితే వీరి వివాహం మూడు నెలల్లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం 2026 జూన్​లో జరిగే అవకాశం ఉందని తెలిపారు.

కానీ ఇదే సమయంలో రింకు తండ్రి అనారోగ్యంతో మరణించడంతో పెళ్లి మరింత వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రింకు కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో రింకు దృఢంగా నిలవాలని కోరుకుంటున్నారు. పరిస్థితులు అన్నీ సర్దుమణిగిన త్వరగా జట్టు​తో కలిసి మరిన్ని మ్యాచ్​లు ఆడాల్సిందిగా సోషల్​ మీడియాలో కామెంట్స్​ ద్వారా తెలుపుతున్నారు.

రింకు స్ట్రైక్​ రేట్​
రింకు వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్ విషయంలో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లో మొత్తం 24 పరుగులు మాత్రమే చేశారు, అందులో రెండు సార్లు ఔట్ కాకుండా నిలిచాడు. ప్రస్తుతం గణంకాల ప్రకారం రింకు సింగ్​ భారత టీ20 జట్టులో కీలక ఆటగాడుగా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​లో 45 మ్యాచ్​లు, 665 పరుగులు, 155.74 స్ట్రైక్ రేట్​ను సంపాదించాడు. ఐపీఎల్​ ఫార్మాట్​లో 59 మ్యాచ్లు, 1099 పరుగులు, 145.18 స్ట్రైక్​ రేట్​ సంపాదించాడు.

జింబాబ్వేపై భారత్ ఘన విజయం- సెమీస్ ఆశలు సజీవం

విధ్వంసం సృష్టించిన భారత్ - జింబాబ్వే ముంగిట భారీ టార్గెట్!