రూ.15వేల కోట్లకు రాజస్థాన్ రాయల్స్ విక్రయం- కొత్త ఓనర్లు ఎవరంటే?
IPL మధ్యలో రాజస్థాన్ రాయల్స్ విక్రయం- IPLతోపాటు ఆ రెండు లీగ్ల్లోని జట్లు కూడా- భారీ ధరకు డీల్ క్లోజ్!

Published : May 3, 2026 at 4:05 PM IST
Rajasthan Royals Sold : 2026 ఐపీఎల్ మధ్యలోనే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేతులు మారింది. ప్రస్తుత మేనేజ్మెంట్ మనోజ్ బాదలే నుంచి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ మిత్తల్ - ఆదర్ పూనావాలాలు సంయుక్తంగా మెజార్టీ వాటాను 1.65 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,600 కోట్లు) కొనుగోలు చేశారు. ఈ మేరకు డీల్ కుదిరినట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
93 శాతం వాటా ఆ ఇద్దరిదే
స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని అదర్ పూనావాలా ఈ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిసి మొత్తం 93 శాతం వాటా ఉంటుంది. ఇందులో మిట్టల్ కుటుంబానికి 75 శాతం, పూనావాలాకు 18 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 7 శాతం వాటాను ప్రస్తుత యజమాని మనోజ్ బదాలేతోపాటు ఇన్వెస్టర్లు కలిగి ఉంటారు. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐతోపాటు బోర్డు పాలక మండలి నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. అందుకే 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
వీళ్లంతా ఓనర్లే!
ఈ ఒప్పందంతో, బాదల్తో పాటు మిత్తల్ కుటుంబ సభ్యులు లక్ష్మీ మిత్తల్, ఆదిత్య మిత్తల్, వనిషా మిత్తల్ భాటియా, అండ్ ఆదర్ పూనావాలా రాజస్థాన్ రాయల్స్ బోర్డులో చేరనున్నారు. కాగా, మిట్టల్ కుటుంబం రాజస్థాన్ చురు జిల్లాలోని సదుల్పుర్కు చెందినది.
🚨 RAJASTHAN ROYALS GOES TO THE MITTAL FAMILY AND ADAR POONAWALA. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 3, 2026
- RR has been sold for 15,660cr with 75% stake goes to ArcelorMittal, 18% stake to Adar Poonawala and 7% remains with the existing owner including Manoj Badale. pic.twitter.com/TDGmi4qr5l
ఆ రెండు జట్లు కూడా
కాగా, ఈ డీల్తో IPL జట్టుతో పాటు, మిత్తల్ ఫ్యామిలీ అండ్ ఆదార్ పూనావాలాకు సౌతాఫ్రికా (SAT20) లీగ్లోని 'పార్ల్ రాయల్స్', కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 'బార్బడోస్ రాయల్స్' జట్టుకు కూడా యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ఇలా ఈ మూడు వేర్వేరు లీగుల్లోని మూడు జట్లను కలిపి 1.65 బిలియన్ డాలర్లకు విక్రయించారు.
రాయల్స్ పాత డీల్ ఫెయిల్
అయితే రాజస్థాన్ విక్రయానికి ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు మార్చి నెలలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు విక్రయం పూర్తైనట్లు కథనాలు వచ్చాయి. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సొమానీకు చెందిన కన్సార్షియం రూ.15,300 కోట్ల ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుంది. కానీ కల్ సొమానీ నిర్ణీత సమయంలో నిధులు సేకరించడంలో విఫలమైంది. దీంతో అనూహ్యంగా డీల్ నుంచి తప్పుకుంది. దీంతో మిత్తల్ గ్రూప్, పూనావాలా రేస్లోకి వచ్చారు. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా హక్కులు దక్కించుకున్నాయి.
ఆర్సీబీ సేల్
ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్ముడైంది. డియాజియో గ్రూప్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్ కన్సార్టియం కంపెనీలు ఆర్సీబీని రూ.16,000 కోట్లకు కొనుగోలు దక్కించుకున్నాయి. అలా ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్ముడవ్వగా, తాజాగా రాజస్థాన్ రాయల్స్ విక్రయం పూర్తైంది.
రాజస్థాన్ రాయల్స్ 2026
ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ మెరుగ్గానే రాణిస్తోంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్లు ఆడగా అందులో ఆరింట నెగ్గింది. నాలుగు మ్యాచ్ల్లో ఓడి ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగింట మూడు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ఈజీగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించవచ్చు. ఇక మే 09న రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఢీ కొట్టనుంది.
RR ఫ్రాంచైజీలో షేన్ వార్న్ వాటా- మాజీ క్రికెటర్ ఫ్యామిలీకి రూ.460 కోట్లు! ఎలాగంటే?
'RCB ఫర్ సేల్'- లలిత్ మోదీ సంచలన పోస్ట్- కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్!

