ETV Bharat / sports

'విరాట్ స్ఫూర్తి వల్లే సెన్సేషనల్ విక్టరీ- ఆయన నాకు అండగా నిలిచారు'- PV సింధు

జపాన్ ఓపెన్ విజయంపై పీవీ సింధు కీలక వ్యాఖ్యలు - క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాలే విజయానికి దోహదం చేశాయంటూ కామెంట్స్

PV Sindhu _ Virat
PV Sindhu _ Virat (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : July 21, 2026 at 2:13 PM IST

1 Min Read
Choose ETV Bharat

PV Sindhu on Virat Kohli : 2026 జపాన్ ఓపెన్ విన్నర్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా టీమ్ఇండియా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి కష్టల్లో ఉన్నప్పుడు తనకు విరాట్ అండగా నిలిచాడని పేర్కొంది. కెరీర్​లో కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను విరాట్​ను కలిశానని, ఆ సమయంలో అతడి మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయని చెప్పింది. ఈ మేరకు తాజాగా సింధు వ్యాఖ్యలు చేసింది.

"నేను విరాట్ భాయ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటా. నా కెరీర్‌లో కష్టాలు ఎదుర్కొంటున్న దశలో విరాట్​ను నేను కలిశాను. వరుసగా గాయాలపాలవ్వడం, ఫామ్ కోల్పోయి అనుకూల ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైమ్​లో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలని అనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను విరాట్ భాయ్‌కి ఫోన్ చేశాను. ఆయన కూడా తొందరగా స్పందించారు. ఆ తర్వాతి రోజే ఆయనను కలిశా. అప్పుడు కోహ్లీ నాను అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు నా కమ్​బ్యాక్​కు ఉపయోగపడ్డాయి. విరాట్ భాయ్ చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి సలహా నా మనసులోనూ, నా భర్త దత్ మనసులోనూ బలంగా నాటుకుపోయాయి. ఏ వ్యక్తి ఆలోచనా విధానాన్నైనా పూర్తిగా మార్చగల శక్తి కొందరికి ఉంటుందని అంటుంటారు. అందుకు విరాట్ భాయ్ మాటలే నిదర్శనం" అని విరాట్ తనకు ఇచ్చిన సలహాలు, మద్దతును సింధు గుర్తు చేసుకుంది. ఈ మేరకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపింది.

కాగా, సింధు గత వారం జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి అకనే యమగుచిని ఓడించి సింధు విజేతగా నిలిచింది. ఆమె వరుసగా రెండు గేమ్​లలో 21-17, 21-17 తేడాతో ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారతీయ తొలి షట్లర్​గా సింధు రికార్డు సృష్టించింది.