ETV Bharat / sports

ఐపీఎల్​ షెడ్యూల్​లో మార్పులు- వచ్చే ఏడాది మార్చి 15 నుంచే టోర్నీ?

ఐపీఎల్ షెడ్యూల్​:​​ ఇకపై మార్చి 15 నుంచి మే 15 వరకు!- మ్యాచ్​ల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉందా?

IPL
IPL (PTI (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : June 2, 2026 at 4:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

IPL Schedule To Change : వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్​ షెడ్యూల్​ మారనుందా? మార్చి 15 నుంచే టోర్నో మొదలుకానుందా? మ్యాచ్​ల సంఖ్య కూడా భారీగా పెరగనుందా? మీడియాలో వస్తున్న ఈ వార్తలపై బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్​ సైకియా తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఐపీఎల్​ విండో మార్పు గురించి పెద్దగా ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్​ మ్యాచ్​లకు, ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తున్న వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంపై మాత్రమే దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండలు, వర్షాల వల్ల మ్యాచ్​లకు అంతరాయం కలగకుండా వచ్చే సీజన్​ నుంచి టోర్నమెంట్​ను రెండు వారాల ముందే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ఏడాది (2026) ఐపీఎల్​ మార్చి 28న ప్రారంభం కాగా, కొన్ని మ్యాచ్​లపై వర్షం ప్రభావం పడింది. ముఖ్యంగా కోల్​కతా నైట్​ రైడర్స్​ వర్సెస్​ పంజాబ్​ కింగ్స్​ మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే​ వర్షార్పణం అయ్యింది. మరోవైపు వేసవి ఎండల తీవ్రత వల్ల మైదానంలోని ఆటగాళ్లు, స్టేడియంలోని ప్రేక్షకులు చాలా ఇబ్బందులు పడ్డారు. టోర్నమెంట్ జరిగే సమయంలో ఇలా వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది.

మ్యాచ్​ల సంఖ్య పెంచుతారా?
ఓ ప్రముఖ మీడియాతో బీసీసీఐ బోర్డు మెంబర్​ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్​ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచుతారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. "బీసీసీఐ ఈ అంశాన్ని అంత సీరియస్​గా తీసుకోవడం లేదు. ఎందుకంటే, గతంలో లాగానే ఈ ఏడాది కూడా ఐపీఎల్ రెండు నెలల కంటే ఎక్కువ కాలం సాగింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఈ ఏడాది 2 నెలల 2 రోజులపాటు టోర్నమెంట్​ జరిగింది. అయితే ప్రస్తుతం బీసీసీఐ బోర్డు మ్యాచ్​ల సంఖ్య కంటే, వాతావరణ పరిస్థితులపైనే ప్రధానంగా దృష్టి సారించింది" అని దేవజిత్ సైకియా పేర్కొన్నారు.

'గతేడాది ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత,​ మధ్యలో ఒక వారం పాటు టోర్నమింట్​ను నిలిపివేశారు. దీనితో లీగ్​ కొద్దిగా పొడిగించబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాకు ఉన్న ఆందోళన ఏమిటంటే, టోర్నమెంట్​ మే 31 వరకు సాగితే, వర్షాల వల్ల కొన్ని మ్యాచ్​లపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరికొన్ని మ్యాచ్​లపై ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్సుంది' అని ​ దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు.

టోర్నీని ముందుకు జరుపుతారా?
తీవ్రమైన ఎండలు, ముందస్తు వర్షాల (ప్రీ-మాన్​సూన్) ప్రభావం పడకుండా ఉండడం కోసం ఐపీఎల్​ షెడ్యూల్​ను కాస్త ముందుకు జరిపి, మే నెల మధ్య నాటికే టోర్నమెంట్​ను ముగించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందని సైకియా స్పష్టం చేశారు.

"మేము ఐపీఎల్​ను మరో 15 రోజులు ముందుకు తీసుకువచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాం. ఈ ఏడాది మేము మార్చి 28న టోర్నీని ప్రారంభించాం. కానీ వచ్చే సీజన్​ నుంచి కాస్త ముందుగా, అంటే బహుశా మార్చి 15 నాటికే ఐపీఎల్​ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించాం. మే 15 కల్లా టోర్నమెంట్​ను ముగించాలని చూస్తున్నాం. దీని వల్ల వేడి వాతావరణం లేదా వర్షాల ప్రభావం అటు ఆటగాళ్లపై, ఇటు స్టేడియానికి వచ్చే వీక్షకులపై, అభిమానులపై పడకుండా ఉంటుంది" అని సైజికా పేర్కొన్నారు.

భవిష్యత్తులో మ్యాచ్​లు పెంచే ఛాన్స్​ ఉందా?
భవిష్యత్తులో ఐపీఎల్​ మ్యాచ్​ల సంఖ్య పెంచుతారా, లేదా? అనే ప్రశ్నకు సైకియా తనదైన రీతిలో సమాధానం చెప్పారు. ఐపీఎల్​ మ్యాచ్​ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా, అది పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్​, ఫ్యూచర్​ టూర్స్ ప్రోగ్రామ్​ (ఎఫ్​టీపీ) నిబంధనలపై ఆధారపడి ఉంటుందని సైకియా స్పష్టం చేశారు.

"కాబట్టి మేము దీనిపై పని చేస్తున్నాం. కానీ మ్యాచ్​లను 74 నుంచి 94కి పెంచే విషయాన్ని ప్రస్తుతానికి అంత సీరియస్​గా తీసుకుంటున్నామని చెప్పలేను. ఎందుకంటే ఇందులో అనేక ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. ఐసీసీ నిర్వహించే వివిధ ఎఫ్​టీపీలు, ద్వైపాక్షిక సిరీస్​లు, మల్టీనేషనల్​ టోర్నమెంట్​లను కూడా మేము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మ్యాచ్​లు పెంచడంపై ప్రస్తుతానికి ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడం లేదు. అయితే 2027 తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చూద్దాం. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది" అని దేవజిత్ సైకియా అన్నారు.

2026 IPL : ఈ సీజన్​లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

17ఏళ్లు నో టైటిల్- ఏడాది గ్యాప్​లో రెండుసార్లు ఛాంపియన్​- ట్రోల్స్​కు చెక్ పెట్టిన ఆర్సీబీ ​బాయ్స్!