ETV Bharat / sports

'IPL​లో క్రికెట్ ఉండదు- అది బాలీవుడ్ సినిమా!'- RCB మాజీ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్

IPL క్రికెట్ కాదు, బాలీవుడ్ హంగామా- PSLలో ఇంట్రెస్టింగ్ మ్యాచ్​లంటూ ఫారిన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

IPL
IPL (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : April 11, 2026 at 3:46 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rilee Rossouw On IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్​పై సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రొసో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్​లో పాకిస్థాన్ సూపర్ లీగ్​తో పోలుస్తూ ఐపీఎల్ టోర్నమెంట్ బాలీవుడ్ సినిమాలాంటిది అని అన్నాడు. ఇక్కడ క్రికెట్ కంటే ఎక్కువ బాలీవుడ్ హంగామానే ఉంటుందని అని చెప్పాడు. అలాగే ఐపీఎల్ సుదీర్ఘంగా సాగే టోర్నమెంట్ అని, అదే పీఎస్​ఎల్ తొందరగా ముగిసిపోయే లీగ్ అని పేర్కొన్నాడు.

IPL లాంగ్ ప్రాసెస్​
ప్రస్తుతం రొసొ పీఎస్​ఎల్​లో ఆడుతున్నాడు. ఇందులో క్వెట్టా గ్లాడియెటర్స్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్​గా రావల్పిండి మ్యాచ్​తో సమయంలో పీఎస్​ఎల్- ఐపీఎల్​ మధ్య తేడా గురించి ప్రశ్నించగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఆడటం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, అదే పాకిస్థాన్​ టోర్నమెంట్‌ త్వరగా ముగుస్తుందని అన్నాడు. దీంతో పీఎస్​ఎల్​లో పోటీపడటం వల్ల జట్ల మధ్య ఉత్కంఠ మ్యాచ్​లు జరుగుతాయని రొసో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఐపీఎల్​లో పలు ఫ్రాంచైజీల మేనేజ్​మెంట్​లల్లో చాలామంది బాలీవుడ్ రంగానికి చెందినవారేనని, అందుకే ఈ లీగ్ నిజమైన క్రికెట్ ఆటలా కాకుండా, ఒక సినిమా మాదిరిగా కనిపిస్తుందని రొసో అభిప్రాయపడ్డాడు.

'ఐపీఎల్ టోర్నమెంట్ చాలా లాంగ్ ప్రాసెస్. అంతేకాకుండా అందులో ఓనర్లు బాలీవుడ్​కు చెందినవారు ఉంటారు. అందుకే అది క్రికెట్ టోర్నీలాగా కాకుండా బాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ డిఫరెంట్​. ఇది తొందరగా ముగుస్తుంది. ఇందులో పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది' అని రొసొ చెప్పుకొచ్చాడు.

ఫ్యాన్స్ ఫైర్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారడంతో దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్​లో ఛాన్స్ దొరకని ఆటగాళ్లే పీఎస్​ఎల్​లోకి వెళ్తుంటారని, అతడికి కూడా ఐపీఎల్​లో అవకాశం రాకపోవడం వల్లే పీఎస్​ఎల్​లో ఆడుతున్నాడని చురకలు అంటిస్తున్నారు. అలాగే ఐపీఎల్ అనేది గ్లోబల్ లెవెల్ లీగ్ అని, కానీ పీఎస్​ఎల్​ను కేవలం పాకిస్థానీయులే చూస్తారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ మేరకు రొసొపై మండిపడతూ కామెంట్లు చేస్తున్నారు.

రొసొ ఐపీఎల్​ కెరీర్​
2014లో రొసొ ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. తొలి సీజన్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున కూడా ఆడాడు. ఇక 2024లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్​ ఆడాడు. అయితే అతడు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఓవరాల్​గా ఐపీఎల్​లో 22 మ్యాచ్​ల్లో 473 పరుగులు మాత్రమే చేశాడు.

PSLలో ఫర్వాలేదు!
కానీ, పీఎస్​ఎల్​లో మాత్రం రొసొ గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ టోర్నీలో అతడు 99 మ్యాచ్​లు ఆడాడు. ఇందులో 3 సెంచరీలు సహా 2366 పరుగులు ఉన్నాయి. అయితే ఐపీఎల్ కంటే పీఎస్​ఎల్​లోనే ఎక్కువగా అవకాశాలు రావడం, అక్కడే రాణించడంతో అతడు ఐపీఎల్​పై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ప్రస్తుత సీజన్​లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్​ల్లో అతడు చేసింది 79 పరుగులే.