ETV Bharat / sports

భారత్ ఘోర ఓటమి- 185 పరుగుల భారీ తేడాతో ఆసీస్ విజయం- వన్డే సిరీస్​ క్లీన్​ స్వీప్

ఆసీస్​పై భారత్ ఘోర ఓటమి- 3-0తో సిరీస్​ క్లీన్​స్వీప్- సెంచరీలతో రాణించిన హీలీ, మూనీ

Australia Women vs India Women
Australia Women vs India Women (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : March 1, 2026 at 4:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Australia Women vs India Women : ఆస్ట్రేలియా పర్యటనలో మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఆసీస్​తో ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమ్ఇండియా, తాజాగా మూడో మ్యాచ్​లోనూ ఓడి 3-0తో సిరీస్​లో వైట్​వాష్​కు గురైంది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్ రానా (44 పరుగులు) జెమీమా రోడ్రిగ్స్ (42 పరుగులు) ఇద్దరే రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలనా కింగ్ 4, జార్జియా వేర్​హామ్ 2, నికోల కేరీ, అనబెల్ సదర్లాండ్, అష్లీ గార్డ్​నర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (158 పరుగులు, 98 బంతుల్లో, 27 ఫోర్లు, 2 సిక్స్​లు) భారీ శతకంతో రప్ఫాడించగా, బెత్ మూనీ (106 పరుగులు) సెంచరీతో రాణించింది. జార్జియా వోల్ (62 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించింది. చివర్లో నికోల కేరీ (34 పరుగులు నాటౌట్, 15 బంతుల్లో) మెరుపులు మెరపించడంతో ఆసీస్ స్కోర్ 400 దాటింది. భారత్ బౌలర్లలో శ్రీ చరణి, స్నేహ్ రానా చెరో 2, రేణుకా సింగ్ ఠాకూర్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

తాజా ఓటమితో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ పర్యటనలో ఇరుజట్లు ఏకైక టెస్టులో తలపడనున్నాయి. మార్చి 06న టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు పెర్త్ స్టేడియం వేదిక కానుంది.

గతేడాది వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత భారత్ ఆడిన వన్డే సిరీస్​ ఇదే. ఈ క్రమంలోనే భారీ అంచనాలతో టీమ్ఇండియా ఆసీస్ పర్యటనలో అడుగుపెట్టింది. టీ20 సిరీస్​లో ఆ అంచనాలకు తగ్గట్లే ఆడింది. తొలి, మూడో మ్యాచ్​ల్లో విజయం సాధించి టీ20 సిరీస్​ పట్టేసింది. అదే జోరు వన్డే సిరీస్​లోనూ కొనసాగాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఇక్కడ భారత్​కు ఘోర పరాభవమే మిగిలింది. వన్డే వరల్డ్​కప్ నెగ్గిన తర్వాత ఆడిన తొలి సిరీస్​నే క్లీన్​ స్వీప్ అవ్వడం ఫ్యాన్స్​ను నిరాశ పరుస్తుంది.

20ఏళ్ల రికార్డ్ బ్రేక్
ఈ మ్యాచ్​లో భారీ సెంచరీతో రఫ్పాడించిన హీలీ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంటర్నేషనల్ వన్డే సిరీస్​లో భారత్​​​పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ బాదిన క్రికెటర్​గా హీలీ రికార్డ్ సృష్టించింది. ఇదివరకు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ క్లైర్ టైలర్ (Claire Taylor) పేరిట ఉండేది. ఆమె 2006లో ఇంగ్లాండ్​పై జరిగిన వన్డేలో 156 రన్స్ చేసింది. తాజా మ్యాచ్​తో హీలీ 20ఏళ్ల రికార్డ్ బద్దలుకొట్టింది. అలాగే వన్డే హిస్టరీలో ఇప్పటిదాకా ఈ ఇద్దరే మహిళల భారత్ జట్టు​పై 150+ స్కోర్లు చేసిన క్రికెటర్లుగా నిలిచారు.

భారత్ తుది జట్టు - స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, కాష్వీ గౌతమ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రానా

ఆస్ట్రేలియా తుది జట్టు - అలిస్సా హీలీ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, బెత్ మూనీ (వికెట్ కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్‌హామ్, నికోలా కారీ, అలానా కింగ్, లూసీ హామిల్టన్

భారత్​పై ఆస్ట్రేలియా విజయం- సెంచరీతో రాణించిన జార్జియా వోల్

చరిత్ర సృష్టించిన భారత్- ఆసీస్ గడ్డ​పై తొలి సిరీస్ కైవసం