ETV Bharat / politics

త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదో? - కిరీటం దక్కేది ఎవరికో?

మరికొన్ని గంటల్లో తేలనున్న జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ఫలితం - త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదో - ధీమాగా ఉన్న ప్రధాన పార్టీలు

Etv Bharat
Etv Bharat (ETV Bharat (GFX))
author img

By ETV Bharat Telangana Team

Published : November 14, 2025 at 8:03 AM IST

|

Updated : November 14, 2025 at 8:09 AM IST

2 Min Read
Choose ETV Bharat

Jubilee Hills bypoll Result : జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో ఈ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఫలితం రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాలకు కీలకం కానుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రచారంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు తమదైన ముద్రను వేసి ప్రచారం చేశాయి. నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో మూడు పార్టీలు దూకుడును ప్రదర్శించాయి.

పార్టీల నేతలంతా రంగంలోకి దిగగా, అయితే రెండు పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. ఆ పార్టీల అగ్రనాయకులు ఇది తమ ప్రతిష్ఠకు భంగం కలిగేటట్లు ఉందని వ్యక్తిగతంగా తీసుకుని ప్రచారం చేశారు. కాంగ్రెస్​ నుంచి సీఎం రేవంత్​రెడ్డి స్వయంగా వ్యూహాలు రచించారు. బీఆర్​ఎస్​ నుంచి కేటీఆర్​ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు ఎంతో పకడ్బందీగా పోల్​ మేనేజ్​మెంట్​ చేసినా పోలింగ్​ 48.49 శాతానికే పరిమితం అయింది. మరోవైపు బీజేపీకి అన్నీ తానై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఓటర్లలో నిరాసక్తత అనేది కనిపించింది. జాబితా కూడా తప్పుల తడకగా ఉండటం పోలింగ్​ శాతం తగ్గడానికి మరో కారణంగా చెప్పవచ్చు.

మంత్రుల పనితీరు విశ్లేషించే అవకాశం : రాబోయే ఫలితాలు మంత్రుల పనితీరుపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్​ వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికలో అధికార పార్టీ పోల్​ మేనేజ్​మెంట్​లో పై చేయిగా కనిపించింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఇన్​ఛార్జిలుగా ఉన్న డివిజన్లలో ఆధిక్యాలపై చర్చ జరుగుతోంది. బీఆర్​ఎస్​లో కూడా ఇన్​ఛార్జిల పనితీరు మదింపు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఈ ఉపఎన్నికను మంత్రులు కూడా చాలా సీరియస్​గా తీసుకున్నారు.

ఏ గంటకు ఏం జరుగుతుందంటే :

  • ఉదయం 5 గంటలకు - లెక్కింపు కేంద్రాలకు అధికారులు, సిబ్బంది
  • ఉదయం 7 గంటలకు - టేబుళ్ల వద్ద పని మొదలు
  • ఉదయం 8 గంటలకు - బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8.30 గంటలకు - బ్యాలెట్​ ఓట్ల ఫలితం
  • ఉదయం 9 గంటలకు - ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలు
  • ఉదయం 10 గంటలకు - మొదటి రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం

అప్పటినుంచి ప్రతి 30-40 నిమిషాలకు రౌండ్ల వారీగా ఫలితం వెల్లడికానుంది.

ఆధిక్యాలపైనే పందేలు : జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక ఫలితాలపై భారీగా పందేలు కాసినట్లు ప్రచారం అనేది జరుగుతోంది. ఓ సీనియర్​ కాంగ్రెస్​ నేత పార్టీ అభ్యర్థికి 20 వేల ఆధిక్యం రాదని రూ.10 లక్షలు బెట్టింగ్​ కాసినట్లు వార్త హల్​చల్​ చేస్తోంది. మరో కాంగ్రెస్​ నేత 12 వేల లోపు ఆధిక్యం ఉంటుందని పందెం వేశారు. గెలుపు ఓటముల కంటే ఆధిక్యాలపైనే ఎక్కువగా పందెలు కాసినట్లు తెలుస్తోంది. ఏపీలోనూ ఈ ఉపఎన్నికపై జోరుగా పందెలు కాస్తున్నారు. వందల కోట్ల బెట్టింగ్​లు జరుగుతున్నట్లు సమాచారం.

జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక​ : కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం - మధ్యాహ్నానికి తేలనున్న రిజల్ట్​!

జూబ్లీహిల్స్ : ఆ కేంద్రాల్లో 60 శాతం దాటిన పోలింగ్ - విన్నర్​ను డిసైడ్​ చేసేవి ఇవే!

Last Updated : November 14, 2025 at 8:09 AM IST