యాదాద్రి దివ్యక్షేత్రంలో కామ దహనం - రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం వసంతోత్సవం (హోలీకోత్సవం) సందర్భంగా సోమవారం రోజు రాత్రి హోలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవంలో ఆలయ ప్రధానార్చకులు కాండురి వెంకటచార్యులు పాల్గొని వసంతోత్సవ వేడుక విశిష్ఠతను భక్తులకు వివరించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు.
(ETV Bharat)

Published : March 3, 2026 at 8:22 AM IST

