ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రెండు బోగీల్లో చెలరేగిన మంటలు - ఒకరు సజీవ దహనం

Fire Broke Out in Ernakulam Express: విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. ప్రయాణికులు భయాందోళనకు గురై స్టేషన్లోకి పరుగులు తీశారు. రైలు ఆగిపోవడంతో రాత్రంతా పడిగాపులు కాశారు.
(Eenadu)

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 2:11 PM IST

