"యమునా పుష్కరాల స్పెషల్" - అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
10రోజుల ప్రయాణం - అతి తక్కువ ధరలో IRCTC ప్యాకేజీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 2, 2026 at 12:34 PM IST
yamuna pushkaralu 2026 : యమునా నది పుష్కరాలు పురస్కరించుకుని IRCTC అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్ లో ప్రయాణం సాగించవచ్చు. మొత్తం పది రోజుల ఈ యాత్రలో ఆరు ప్రధాన క్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. ఇందులో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ దర్శించుకోవచ్చు అని IRCTC వెల్లడించింది.
"జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర" - 'IRCTC' ఫ్లైట్ జర్నీ ప్లాన్ ఇదే!
యాత్రలో ప్రధానాంశాలు
- యాత్ర పేరు అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్
- వ్యవధి 9 రాత్రులు, 10 రోజులు
- యాత్ర ప్రారంభం : జూన్ 3
- దర్శనీయ ప్రాంతాలు : పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్
- బోర్డింగ్ స్టేషన్లు : కాజీపేట జంక్షన్, వరంగల్, ఖమ్మ, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల కోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం.
టికెట్ ధరలు (అన్ని పన్నులు కలిపి)
- ఎకానమీ స్లీపర్ : పెద్దలకు రూ.16,700, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.15,600
- స్టాండర్డ్ 3 ఏసీ : పెద్దలకు రూ.26,100, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.24,800
- కంఫర్ట్ 2 ఏసీ : పెద్దలకు రూ.34,100, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.32,500
దర్శించుకునే ఆలయాలు
- పూరీ : జగన్నాథ్ టెంపుల్, కోణార్క్ సూర్య దేవాలయం
- బైద్యనాథ్ ధామ్ : బాబా బైద్యనాథ్ ఆలయం
- వారణాసి : కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయాలు, గంగాహారతి
- అయోధ్య : రామజన్మ భూమి, హనుమాన్గరి
- ప్రయాగరాజ్ : త్రివేణి సంగమం (యమునా పుష్కరాలు)
యాత్ర ఇలా
- మొదటి రోజు ఉదయం 9గంటలకు సికింద్రాబాద్లో రైలు బయల్దేరుతుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు పూరీ చేరుకుని జగన్నాథ దర్శనం చేసుకుంటారు.
- మూడో రోజు ఉదయం కోణార్క్ సూర్యదేవాలయం చేరుకుంటారు.
- నాలుగో రోజున బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుమది.
- ఐదో రోజు బనారస్ చేరుకుని అక్కడ నైట్ స్టే ఉంటుంది.
- ఆరో రోజు కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు. అదే రోజు సాయంత్రం గంగాహారతి వీక్షించి అక్కడే రాత్రి బస చేస్తారు.
- ఏడో రోజున రామ జన్మభూమి అయోధ్య సందర్శిస్తారు.
- ఎనిమిదో రోజున పవిత్ర యమునా నదిలో పుష్కర స్నానం ఉంటుంది. సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుంది.
- తొమ్మిదో రోజున అర్ధరాత్రి లోగా గుడి వాడ చేరుకుంటారు.
- పదో రోజున ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
పూర్తి వివరాలకు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ - 9701360701, విజయవాడ - 9281030714, తిరుపతి, విశాఖపట్నంలోని కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.
"హైదరాబాద్ టు విశాఖ, అరకు" - బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో IRCTC టూర్ ప్యాకేజీ

