"హైదరాబాద్ టు గోవా" - IRCTC నాలుగు రోజుల ప్యాకేజీ!
ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేసిన ఐఆర్సీటీసీ - టిక్కెట్, టూర్ వివరాలివే

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 13, 2026 at 11:06 AM IST
Goa Tour planning : అందమైన బీచ్లు, దేశ, విదేశీ పర్యటకుల సందడితో గోవా పర్యాటకం ఎంతో పేరొందింది. ఇక్కడికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు మధుర జ్ఞాపకాలతో తిరిగొస్తుంటారు. కోల్వా కాండోలిమ్, మిరామార్, అంజునా, వర్కా వంటి సముద్ర తీర బీచ్లు ఎంతో ఉత్సాహాన్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పర్యాటకుల అక్కడికి వెళ్తున్నారు. మీరు సైతం దేశంలోనే పర్యాటకపరంగా ఎంతో అభివృద్ధి చెందిన గోవా వెళ్లాలనుకుంటున్నారా? అయితే, IRCTC టూర్ ప్లాన్ చేసింది. ప్యాకేజీ, ధరలు, పూర్తి వివరాలు ఇవీ.
ఐఆర్సీటీసీ బంపరాఫర్ - రూ.16 వేలకే అయోధ్య - కాశీ పుణ్యక్షేత్ర యాత్ర!

ప్యాకేజీ : గోవా డిలైట్
- 3 రాత్రులు, 4పగళ్లు
- ప్రయాణం : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి
- ప్రయాణ తేది : సెప్టెంబర్ 9
- ఫ్లైట్ నంబర్ 6E 905 హైదరాబాద్ నుంచి ఉదయం 11.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1.05గంటలకు గోవా చేరుకుంటుంది.
- ఫ్లైట్ నంబర్ 6E 712 గోవా నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి 03.05గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

టిక్కెట్ల ధర
- కంఫర్ట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.24,640 డబల్ రూ.19,200 ట్రిపుల్ రూ.18,680, 2-11ఏళ్ల పిల్లలకు రూ.15,520 2-4ఏళ్ల పిల్లలకు రూ.9,130

పర్యటన ఇలా
తొలి రోజు : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్ణీత సమయానికి బయల్దేరాల్సి ఉంటుంది. గోవా చేరుకోగానే అక్కడ పికప్ చేసుకుని రోడ్డు మార్గంలో హోటల్కు తీసుకెళ్తారు. చెకిన్ చేశాక సాయంత్రం లోకల్ మార్కెట్ చూసుకుని తిరిగి హోటల్ చేరుకుంటారు. డిన్నర్, రాత్రి బస అక్కడే ఉంటుంది.
రెండో రోజు సౌత్ గోవా పర్యటన : హోటల్లో అల్పాహారం చేసిన తర్వాత ప్రయాణం ఉంటుంది. సౌత్ గోవా సైట్ సీయింగ్, ఓల్డ్ గోవా చర్చ్, మ్యూజియం, శ్రీమంగేషి ఆలయం, మిరామార్ బీచ్, మండోవీ నదిపై బోట్ క్రూయీజ్ పర్యటన సాయంత్రం 6నుంచి 7గంటల వరకు గంట సమయం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హోటల్ చేరుకుని డిన్నర్, బస అక్కడే ఉంటుంది.

మూడో రోజు నార్త్ గోవా పర్యటన : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత నార్త్ గోవా పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా అగోడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్, వాటర్ స్పోర్ట్స్, అంజునా బీచ్, వగాటర్ బీచ్ తర్వాత చాపోరా పోర్ట్ సందర్శిస్తారు. తిరిగి హోటల్ గదికి చేరుకుని డిన్నర్, రాత్రి బస అక్కడే ఉంటుంది.
నాలుగో రోజు : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్ చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. నిర్ణీత సమయానికి ప్రయాణించి హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీలో అంతర్భాగం : విమాన ప్రయాణ టిక్కెట్లు, హోటల్ లో ఏసీ విడిది, 3 రోజులు అల్పాహారం, డిన్నర్, అంతర్గత ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.
పూర్తి వివరాలకు సికింద్రాబాద్లోని ఐఆర్సీటీసీ జోనల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు 040 27702407, 9701360701
"యమునా పుష్కరాల స్పెషల్" - అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
"జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర" - 'IRCTC' ఫ్లైట్ జర్నీ ప్లాన్ ఇదే!

