మంగుళూర్ స్పెషల్ "బెల్లం మెంతి దోసెలు" - తియ్యతియ్యగా స్వీట్ లవర్స్ ఫుల్ ఖుష్!
పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ దోసె రెసిపీ - ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 2:35 PM IST
|Updated : January 4, 2026 at 3:18 PM IST
Bella Metthe Dosa Recipe : కమ్మగా, క్రిస్పీగా ఉండే దోసెలంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు. నార్మల్గా ఇళ్లల్లో ఎక్కువగా మినప్పిండితో ఆనియన్, మసాలా, ఎగ్ దోసె వంటివి చేస్తుంటారు. రెగ్యులర్గా ఒకే రకమైనవి తినాలంటే బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే ఈసారి కర్ణాటక స్పెషల్ బెల్లం మెంతి దోసెలు చేశారంటే అద్దిరిపోతుంది. ముఖ్యంగా ఇవి మంగళూరు ప్రాంతంలో చాలా ఫేమస్. ఈ స్టెప్స్ పాటిస్తూ చేస్తే తియ్యతియ్యగా, భలే కమ్మగా వస్తాయి. అంతేకాక పైన ప్రత్యేకమైన కారం పొడిని చల్లి తింటుంటే సూపర్ అనాల్సిందే.
దాబా స్టైల్ "పాలక్, చనా మసాలా కర్రీ" - చపాతీ, బగారారైస్ లోకి మంచి కాంబినేషన్!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - అర కిలో (500 గ్రాములు)
- మినపప్పు - 30 గ్రాములు
- అటుకులు - 30 గ్రాములు
- ఉప్పుడు బియ్యం - 30 గ్రాములు
- మెంతులు - 15 గ్రాములు
- సోంపు - 15 గ్రాములు
- బెల్లం తురుము - 50 గ్రాములు
- పసుపు - కొద్దిగా
- బటర్ - తగినంత
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- మినపప్పు - 2 స్పూన్లు
- ఎండుమిర్చి - 15
- నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ముందుగా మిక్సింగ్ బౌల్లో అర కిలో బియ్యం, 30 గ్రాముల మెంతులు, 15 గ్రాముల సోంపు, 30 గ్రాముల ఉప్పుడు బియ్యం, 30 గ్రాముల మినపప్పు వేసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరో కప్పులో 30 గ్రాముల అటుకులు, సరిపడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి.
- మూడు గంటల తర్వాత బియ్యం మిశ్రమాన్ని మరోసారి కడిగి వాటర్ వడకట్టి మిక్సీజార్లో వేయాలి. ఇందులోనే నానబెట్టిన అటుకులు, 50 గ్రాముల బెల్లం తురుము, కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ దోసెకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేయాలి.
- అనంతరం దోసె పిండిని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి కనీసం ఆరు గంటలు లేదా రాత్రంతా పులియబెట్టాలి.

- మరుసటి రోజు ఉదయం కారం పొడి కోసం స్టవ్ ఆన్ చేసి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక 30 గ్రాముల మినపప్పు, 15 ఎండుమిర్చి, మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసి ఫ్రై చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక మిక్సీజార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మరోవైపు పిండిని కొద్దిగా గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి కలపాలి.

- మరోవైపు స్టవ్ ఆన్ చేసి దోసె పాన్ పెట్టాలి. పాన్ వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న పిండిని గరిటెతో తీసుకొని పాన్పై దోసె మాదిరిగా స్ప్రెడ్ చేయాలి. అయితే వీటిని మరీ పల్చగా కాకుండా అట్టు మాదిరిగా కాస్త మందంగానే వేయాలి.
- ఇప్పుడు దోసెపై కొద్దిగా బటర్ వేసి అది పూర్తిగా కరిగి వన్ సైడ్ చక్కగా కాలే వరకు ఉంచాలి. ఆ తర్వాత మరోవైపు టర్న్ చేసి కొద్దిసేపు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి.

- అనంతరం దోసెపై ముందుగా తయారు చేసుకున్న స్పెషల్ కారం పొడి చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే తియ్య తియ్యగా నోరూరించే బెల్లం మెంతి దోసెలు రెడీ అయినట్లే!
పచ్చిమిర్చి పేస్ట్తో "ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీ" - నోటికి సరికొత్త రుచిని ఇస్తుంది!
"చేపల కర్రీ" బాగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి - మరుసటి రోజు ఘుమఘుమలాడుతుంది!

