తెలంగాణ టూరిజం "సూపర్ ప్యాకేజీ" - తక్కువ ధరకే ఐదు రోజులు ఫుల్ చిల్ అవ్వొచ్చు!
-ఫ్యామిలీతో మంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మీకోసమే అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది తెలంగాణ టూరిజం!

Published : February 27, 2026 at 4:25 PM IST
Araku Tour from Hyderabad : వేసవి వస్తుందంటేనే చాలు చాలా మంది ఇప్పటి నుంచే టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. తమ బడ్జెట్కు తగ్గట్టు నచ్చిన ప్రాంతాలను చుట్టేసి రావాలనుకుంటారు. మరి మీరు కూడా ఈ సమ్మర్లో ఒక మంచి పర్యాటక ప్రాంతాన్ని వీక్షించాలనుకుంటున్నారా? అలాంటి వారికోసం తెలంగాణ టూరిజం ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే ఒక వైపు దర్శనీయ ప్రదేశాలు, మరో వైపు బీచ్ అందాలు, ప్రకృతి సోయగాలను వీక్షించే మంచి అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఆ టూర్ ప్యాకేజీ ఏంటి? ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి? టికెట్ ధరలు ఎంత? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ టూరిజం "Hyderabad - Vizag - Araku " పేరుతో ఈ టూర్ను ఆపరేట్ చేస్తోంది. ఈ పర్యటన మొత్తం నాలుగు రాత్రులు, ఐదు రోజులుగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరకు టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.

ఈ టూర్ కొనసాగనుందిలా..
డే 1 :
మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో IRO పర్యాటక భవన్ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది. 6.30 గంటలకు CRO బషీర్బాగ్ చేరుకుని అక్కడి నుంచి తిరిగి జర్నీ కంటిన్యూ అవుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది. మార్గమధ్యలో భోజనం ఉంటుంది.
డే 2 :
రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు వైజాగ్ రీచ్ అవుతారు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్లో ఫ్రెషప్ అవుతారు. ఆ తర్వాత టిఫెన్ తిని సైట్ విజిటింగ్కి వెళ్తారు. కైలాసగిరి, సింహాచలం దేవాలయాలు సందర్శిస్తారు. ఆపై రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం చూస్తారు. ఇక సాయంత్రం వైజాగ్ బీచ్కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తారు. అనంతరం తిరిగి హోటల్కు చేరుకుంటారు. ఆ రాత్రి భోజనం తర్వాత వైజాగ్ హోటల్లోనే స్టే చేస్తారు.
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
డే - 3 :
మూడో రోజు ఉదయం టిఫెన్ చేశాక రోడ్డు మార్గంలో అరకు టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడకి చేరుకున్న తర్వాత ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రా గుహలు విజిట్ చేస్తారు. రాత్రికి ధింసా డ్యాన్స్ వీక్షిస్తారు. ఆ రోజు రాత్రికి అరకులోనే బస చేస్తారు.
డే - 4 :
నాలుగో రోజు మార్నింగ్ అరకు నుంచి అన్నవరానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ సత్యనారాయణ టెంపుల్ సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు రిటర్న్ జర్నీ ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
డే - 5 :
ఐదో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ రీచ్ అవ్వడంతో మీ అరకు పర్యటన కంప్లీట్ అవుతుంది.
టికెట్ ధరలు చూస్తే..
తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న హైదరాబాద్ - వైజాగ్ - అరకు టూర్ ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.7,500గా నిర్ణయించారు. అదే, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ.600 చెల్లించాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే :
- నాన్ ఏసీ వెహికల్లో జర్నీ ఉంటుంది.
- వైజాగ్లో ఏసీ హోటల్లో, అరకులో నాన్ ఏసీ హోటల్లో వసతి సౌకర్యం ఉంటుంది.
- వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కూడా కవర్ అవుతాయి.
- ఫుడ్, ఎంట్రీ టికెట్స్, దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు వంటివి మాత్రం టూర్ ప్యాకేజీలో ఉండవని గుర్తుంచుకోవాలి. అంటే, వీటిని ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అరకు టూర్ ప్యాకేజీ మార్చి 5వ తేదీన అందుబాటులో ఉంది.
- అది మిస్ అయితే మార్చి 12, 19, 26, ఏప్రిల్ 2వ తేదీల్లోనూ పర్యాటకులకు అందుబాటులో ఉంది.
- ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన టికెట్ల బుకింగ్, మరిన్ని వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
"డబ్బులు ఊరికే రావు" ఇలా చేశారంటే మీ టూర్ ప్లాన్ సక్సెస్ - నిపుణులు సూచిస్తున్న చిట్కాలివే!
"అరుణాచలం" వెళ్లాలనుకుంటున్నారా? - తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ!

