ETV Bharat / international

ఇరాన్​ 'గుండెకాయ' లక్ష్యం​- టెహ్రాన్​పై ఇజ్రాయెల్ భీకరదాడులు

అమెరికా స్థావరాలపై ప్రతిదాడులకు దిగిన ఇరాన్​- దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

Massive Explosion Hits Tehran
Massive Explosion Hits Tehran (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 3:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Massive Explosion Hits Tehran : ఇరాన్​ రాజధాని టెహ్రాన్​ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం ఇజ్రాయెల్, అమెరికాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ పేలుళ్ల ధాటికి భారీగా పొగలు రావడమే కాదు, భూమి కూడా కంపించింది. ఇరాన్​ రాజధానికి గుండెకాయ లాంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే తాము టెహ్రాన్​ వెళ్లే మార్గాన్ని క్లియర్ చేసుకున్నామని, రెండో రోజున సెంట్రల్ టెహ్రాన్​పై దాడులు చేస్తున్నామని పేర్కొంది. అయితే కచ్చితమైన లక్ష్యం ఏంటనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇరాన్​ పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ టెలివిజన్​ ఆఫీస్​లు ఉన్న పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్​పై తమ దాడులు ఇంకా భీకరంగా కొనసాగుతాయని ఆదివారం స్పష్టం చేశారు.

"రానున్న రోజుల్లో మేము ఇరాన్​లోని ఉగ్రవాద పాలకులకు చెందిన వేలాది లక్ష్యాలపై విరుచుకుపడతాం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమను తాము, ఈ క్రూరమైన నిరంకుశ సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన పరిస్థితులను మేము సృష్టిస్తాం. అందుకే నేను మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరాన్ పౌరులారా ఈ గొప్ప అవకాశాన్ని చేజారనివ్వకండి. ఇలాంటి అవకాశం తరానికి ఒక్కసారే వస్తుంది."
- నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని

అమెరికా స్థావరాలపై ఇరాన్​ కౌంటర్​ ఎటాక్​
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో ఆదేశం ప్రతీకార దాడులకు దిగింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇజ్రాయెల్​లోని టెల్​ నోప్​ ఎయిర్​వేస్​, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యాలతోపాటు రక్షణ రంగ ఫ్యాక్టరీలు కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్​పీ షిప్​పై 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్​'లో భాగంగా, 4 డ్రోన్లతో దాడి చేసినట్లు టెహ్రాన్​ వెల్లడించింది.

ఖమేనీని ఖతం చేశాం: ఐడీఎఫ్ ప్రకటన
టెహ్రాన్​లోని ఉగ్రవాద కూటమి (టెర్రర్​ యాక్సెస్​) నేత అయతొల్లా అలీ ఖమేనీని 'అత్యంత కచ్చితమైన, భారీ ఆపరేషన్'​ చేపట్టి అంతం చేశామని ఇజ్రాయెల్​ రక్షణ దళం (ఐడీఎఫ్​) ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఉనికికి ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించే లక్ష్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. 1989 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్​ సుప్రీం లీడర్​గా ఉన్న ఖమేనీ అనేక సంవత్సరాలుగా ఇరాన్​ పౌరులను హింసాత్మకంగా అణిచివేస్తున్నాడని, అందుకే అతను దానికి ప్రత్యక్ష బాధ్యుడని పేర్కొంది.

"ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసే ప్రణాళికకు ఖమేనీ రూపశిల్పి. పశ్చిమాసియా అంతటా, ఇజ్రాయెల్ సరిహద్దుల వరకు విస్తరించిన 'ఇరాన్​ ఆక్టోపస్​'కు ఆయన తలకాయ లాంటివాడు. లెబనాన్​కు చెందిన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఇందులో ప్రధానమైనది. ఇజ్రాయెల్​పై జరిగిన ఉగ్రదాడులకు అతనే బాధ్యుడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పౌరుల రక్తం ఆయన చేతులకు అంటి ఉంది. ఈ ఉగ్రనేత నిర్మూలనతో ఒక దశాబ్దకాలం నాటి సుదీర్ఘ అధ్యాయం ముగిసింది."
- ఐడీఎఫ్​

తీవ్ర ఆందోళనలు
ఇజ్రాయెల్​, అమెరికా దళాలు చేసిన దాడుల్లో ఇరాన్​ అధినేత ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో బాగ్దాద్​లోని గ్రీన్​ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్​లోనూ ఖమేనీ మృతి చెందారన్న వార్తలో ఉద్రిక్త పరిస్థితు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద పోలీసులు- నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. దీనితో దాదాపు 9 మంది మరణించగా, అనేక మంది క్షతగాత్రులైనట్లు తెలుస్తోంది.

వామ్మో! ఖమేనీకి అంత సంపద ఉందా? ట్రంప్, నెతన్యాహూల కంటే సంపన్నుడా?

ఖమేనీ మృతి వేళ పాకిస్థాన్​లో ఉద్రిక్తతలు- 9మంది నిరసనకారులు మృతి