ETV Bharat / entertainment

రూ.200 కోట్ల క్లబ్​లో ఇరుముడి- రవితేజ కెరీర్​లోనే హైయ్యెస్ట్ గ్రాసర్​ మూవీ

బాక్సాఫీస్ వద్ద ఇరుముడి ర్యాంపేజ్ - రూ.200 కోట్ల క్లబ్​లో చేరిన మూవీ- రవితేజ కెరీర్​లోనే హైయ్యెస్ట్ గ్రాసర్​గా రికార్డ్

Irumudi Collections
ఇరుముడి సినిమా కలెక్షన్లు (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 3:38 PM IST

|

Updated : September 2, 2026 at 3:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Irumudi Collections : రవితేజ ఇరుముడి మరో అరుదైన ఘనత సాధించింది. సూపర్ హిట్​ టాక్​తో దూసుకుపోతున్న ఈ సినిమా తాజాగా రూ.200 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అన్ని థియేటర్లలో ఇరుముడి సంబరాలు కొనసాగుతున్నాయని, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ సినిమాను ఆదరిస్తున్నారని మేకర్స్ రాసుకొచ్చారు. దీనిని జనరేషనల్ బ్లాక్​బస్టర్​గా పేర్కొన్నారు. ఈ క్రమంలో మేకర్స్ సక్సెస్ సంబరాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు.

సీక్వెల్​లో రామ్​చరణ్ ఉంటారా?
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​లో ఇప్పటిదాకా సీక్వెల్ రాలేదు. ఒకవేళ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తే, ఇందులో రామ్​చరణ్​ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అని నిర్మాతలకు మీడియా ప్రశ్న అడిగింది. దీనికి జవాబుగా 'చరణ్ మాతో సినిమా చేస్తా అంటే అంతకన్నా ఆనందం మాకు ఇంకేం ఉంటుంది? అయినా దీనికి ఆన్సర్ మా డైరెక్టర్ శివ ఇస్తారు' అని ప్రొడ్యూసర్ రవి శంకర్ అన్నారు. 'ఏదైనా నేచురల్​గా జరిగితే బాగుంటుంది. ఆయనను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని మాకు ఎలాంటి ఐడియా రాలేదు. అలాంటిది జరిగితే నిజంగా అద్భుతమే. కానీ అలా జరగలేదు. ఫాదర్ అండ్ డాటర్ అనే చిన్న స్టోరీ లైన్​తో ఈ సినిమా మొదలైంది. ఇప్పటికైతే సీక్వెల్ అనుకోలేదు' అని దర్శకుడు చెప్పారు.

పోస్టర్ బ్యాక్​గ్రౌండ్ స్టోరీ
అలాగే కలెక్షన్ల గురించి తెలుపుతూ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్​ వెనుకున్న కథను నివనిర్వాణ షేర్ చేసుకున్నారు. సినిమా అనౌన్స్​ చేసిన తర్వాత చేసిన తొలి షాట్​ ఇదే అని చెప్పారు. బేబి నక్షత్రకు అయ్యప్ప స్వామి గెటప్ వేసి, రవితేజ- ప్రియా భవానితో కలిసి తీసిన తొలి షాట్ అని తెలిపారు. ఇది సినిమాలో రాకపోయినా, మూవీ సక్సెస్ అయ్యాక ఈ ఫొటో రివీల్ చేద్దామని తాను అప్పుడే అనుకున్నట్లు పేర్కొన్నారు.

శివనిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 21న వరల్డ్​వైడ్​గా రిలీజైంది. తొలి షో నుంచే దీనికి బ్లాక్​బస్టర్ టాక్ వచ్చింది. అలా గత 12 రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటిదాకా రూ.200 కోట్ల పైచిలుకు వరల్డ్​వైడ్ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ప్రియ భవాని శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది.

కెరీర్​లో హైయ్యెస్ట్
ఈ సినిమాతో హీరో రవితేజ కూడా అరుదైన ఘనత సాధించారు. తన సుదీర్ఘ కెరీర్​లో తొలిసారి రూ.200 కోట్ల క్లబ్​లో చేరారు. ఇంతకుముందు 2022లో వచ్చిన ధమాకా సినిమానే రవితేజ కెరీర్​లో కమర్షియల్​గా భారీ హిట్. ఇప్పుడు ఆ రికార్డులను తుడిచిపెడుతూ ఇరుముడి సరికొత్త మార్క్​ సెట్ చేసింది. దీంతో ఆయన కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమానూ నిలిచింది.

'ఆజాద్ హింద్ ఫౌజ్'- OG యూనివర్స్​ నుంచి గ్లింప్స్ ఔట్

పవర్ స్టార్ నుంచి పవర్​లోకి- రాజకీయాలతో పాటు సినిమాలు! పవన్ కల్యాణ్​ ప్రయాణం సాగిందిలా

Last Updated : September 2, 2026 at 3:44 PM IST