మహారాణిగా నయనతార- బాలయ్య సరసన నాలుగోసారి- మరో హిట్ పక్కానా?
నాలుగోసారి బాలయ్యతో వర్క్ చేయనున్న నయనతార

Published : November 18, 2025 at 12:27 PM IST
|Updated : November 18, 2025 at 12:54 PM IST
Nayanatara In NBK 111 Project : సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో NBK 111 నుంచి రానుస్తున్న మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఆమె బర్త్డే సందర్భంగా మూవీ టీమ్ ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. అందులో బాలయ్యకు జంటగా నటిస్తున్న నయన్కు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్ను విడుదల చేశారు.
రాణిలా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది
ఈ స్పెషల్ గ్లింప్స్లో నయన్ మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది. అందులో హీరోయిన్ లుక్ ఎలా ఉందంటే సముద్రమంత ప్రశాంతత, తుపాను అంత బీభత్సం తనలో మోసే రాణిలా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుందంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మూవీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల కోసం రిలీజ్ చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. అలానే 2025 నవంబర్ 26న సినిమా పూజా కార్యాక్రమాలతో మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
The Queen enters the Empire 👸🏼
— Nayanthara✨ (@NayantharaU) November 18, 2025
world of #NBK111
GOD OF MASSES #NandamuriBalaKrishn pic.twitter.com/7xxBR6BGyh
వీరిద్దరి నాలుగో కాంబో
ఇప్పటికే బాలకృష్ణ - నయనతార కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఇవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇది వీరిద్దరి నాలుగో కాంబో. దీనిపై ఇద్దరి ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకుంటున్నారు. అయితే బాలయ్య, నయన్ ఇప్పటికే చేసిన 'సింహా', 'జైసింహా', 'శ్రీరామరాజ్యం'లా ఉండనుందా, లేదా ఫుల్ కమర్షియల్గా ఉండనుందా అంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చిత్రంపై భారీ ఆసక్తి
ఇక డైరెక్టర్ గోపీచంద్- బాలయ్య కాంబోలో 'వీరసింహారెడ్డి' వచ్చి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ను అందుకుంది. ఇప్పుడు ఆ ముగ్గురి కలయిక ఈ చిత్రంపై భారీ ఆసక్తిని నెలకొల్పుతున్నాయి. అయితే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో శక్తిమంతమైన యాక్షన్ డ్రామాలో బాలయ్య రెండు డిఫరెంట్ యాంగిల్స్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
నయనతార బిజీ షెడ్యూల్ ఎలా ఉందంటే?
- టాక్సిక్: ఇది యశ్ సరసన నయనతార నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ గ్యాంగ్స్టర్ చిత్రం. ఈ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది.
- మూకుత్తి అమ్మన్ 2: 2020లో విడుదలైన విజయవంతమైన 'మూకుత్తి అమ్మన్' చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
- డియర్ స్టూడెంట్స్: ఇది మలయాళ చిత్రం, ఇందులో నివిన్ పౌలీతో పాటు నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
- రక్కయ్యీ: ఈ చిత్రం 2025లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు.
- మన్నాంగాట్టి సిన్స్ 1960: ఈ పీరియడ్ డ్రామాలో యోగి బాబుతో పాటు నయనతార కీలక పాత్రలో నటిస్తున్నారు.
- మన శంకరవరప్రసాద్ గారు: మెగాస్టార్ చిరంజీవి- నయనతార కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ టీమ్ అనౌన్స్చేసింది. ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
నయనతార డివోర్స్ రూమర్స్- పోస్ట్తో హీరోయిన్ క్లారిటీ!
సినిమాల్లోనే కాదు.. ఈ బ్యూటీలు బిజినెస్లోనూ టాపే.. సూపర్ లాభాలతో..

