ETV Bharat / entertainment

విజయ్ 'జననాయకుడు'కు మళ్లీ నిరాశ - సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే!

జన నాయకుడు సినిమాకు వీడని చిక్కులు- మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై డివిజన్‌ బెంచ్‌ స్టే- రిలీజ్​ ఇంకా ఆలస్యం!

Jana Nayagan
Jana Nayagan (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 5:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Jana Nayagan Censor Issue : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి జన నాయకుడు సినిమా విడుదలకు చిక్కులు వీడడం లేదు. మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. ముందుగా ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్‌ జడ్జి శుక్రవారం ఉదయం ఉత్తర్వులు చేశారు. ఈ తీర్పును సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్​లో సవాల్ చేసింది. సెన్సార్‌ బోర్డు పిటిషన్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది.

వాస్తవానికి ఈ సినిమా ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు, డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపుతూ సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదు. రీసెంట్​గా సెన్సార్​ సూచనలు అనుగునంగా మార్పులు చేసిన మేకర్స్ సర్టిఫికెట్ కోసం పంపించారు. అయితే సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీఎన్​ ప్రొడక్షన్స్ మద్రాస్​ హైకోర్ట్​లో అత్యవసర పిటిషన్​ దాఖలు చేసింది. మొదటగా యూ/ఏ సర్టిఫికేషన్‌కు సిఫార్సు చేసిన సెన్సార్‌ బోర్డు ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్​ ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సీబీఎఫ్‌సీకి ఆదేశాలు జారీ చేసింది.

అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్​లో సవాల్ చేసింది. సెన్సార్‌ బోర్డు పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్​, సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ కారణంగా విడుదల ఆలస్యం అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

నిరాశలో ఫ్యాన్స్
విజయ్ దళపతి కెరీర్​లో ఈ సినిమానే ఆఖరిది కానుంది. ఆయన ఇకపై పూర్తిగా రాజకీయాల్లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో 'జన నాయకుడు' తన ఆఖరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్​ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అడ్వాన్స్​గా టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేశారు. అయితే సెన్సార్ పరంగా ఇబ్బందులతో విడుదల చిక్కుల్లో పడడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తమ అభిమాన హీరోను థియేటర్లలో చూసేందుకు ఇంకా ఎదురుచూస్తున్నామంటూ వాపోతున్నారు.

బుకింగ్స్​ ఈ రిఫండ్- హిస్టరీలో హయ్యెస్ట్
తొలుత ఈ సినిమాను జనవరి 09న రిలీజ్​ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో రీసెంట్​గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుకింగ్స్​లో సినిమా జోరు ప్రదర్శించింది. బుధవారం వరకూ బుక్​ మై షో ద్వారా 4.50 లక్షల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. తాజాగా సినిమా పోస్ట్​పోన్ కావడంతో బుక్​ మై షో ప్రేక్షకులకు రిఫండ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అయితే ఇప్పటివరకూ ఏ సినిమాకు కూడా ఇంత ఎక్కువ మొత్తం రిఫండ్ జరగలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హెచ్ వినోద్​ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'జన నాయకుడు'. విజయ్​ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించంది. మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ప్రకాశ్ రాజ్‌, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్‌ కీలక ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మించింది.

హైకోర్టులో జననాయగన్​కు ఊరట- సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశం

'జన నాయగన్​' రీఫండ్ ప్రక్రియ మొదలు​- సినీ చరిత్రలోనే ఇదే హెయ్యెస్ట్