విజయ్ 'జననాయకుడు'కు మళ్లీ నిరాశ - సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే!
జన నాయకుడు సినిమాకు వీడని చిక్కులు- మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే- రిలీజ్ ఇంకా ఆలస్యం!

Published : January 9, 2026 at 5:43 PM IST
Jana Nayagan Censor Issue : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి జన నాయకుడు సినిమా విడుదలకు చిక్కులు వీడడం లేదు. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ముందుగా ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి శుక్రవారం ఉదయం ఉత్తర్వులు చేశారు. ఈ తీర్పును సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సెన్సార్ బోర్డు పిటిషన్పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది.
వాస్తవానికి ఈ సినిమా ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు, డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపుతూ సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదు. రీసెంట్గా సెన్సార్ సూచనలు అనుగునంగా మార్పులు చేసిన మేకర్స్ సర్టిఫికెట్ కోసం పంపించారు. అయితే సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్ట్లో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. మొదటగా యూ/ఏ సర్టిఫికేషన్కు సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ఈ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్సీకి ఆదేశాలు జారీ చేసింది.
అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సెన్సార్ బోర్డు పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ కారణంగా విడుదల ఆలస్యం అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
నిరాశలో ఫ్యాన్స్
విజయ్ దళపతి కెరీర్లో ఈ సినిమానే ఆఖరిది కానుంది. ఆయన ఇకపై పూర్తిగా రాజకీయాల్లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో 'జన నాయకుడు' తన ఆఖరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అడ్వాన్స్గా టికెట్లు కూడా భారీగా కొనుగోలు చేశారు. అయితే సెన్సార్ పరంగా ఇబ్బందులతో విడుదల చిక్కుల్లో పడడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తమ అభిమాన హీరోను థియేటర్లలో చూసేందుకు ఇంకా ఎదురుచూస్తున్నామంటూ వాపోతున్నారు.
#JanaNayaganAudioLaunch 🔥 pic.twitter.com/BWiQgsxcZi
— KVN Productions (@KvnProductions) December 28, 2025
బుకింగ్స్ ఈ రిఫండ్- హిస్టరీలో హయ్యెస్ట్
తొలుత ఈ సినిమాను జనవరి 09న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో రీసెంట్గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుకింగ్స్లో సినిమా జోరు ప్రదర్శించింది. బుధవారం వరకూ బుక్ మై షో ద్వారా 4.50 లక్షల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. తాజాగా సినిమా పోస్ట్పోన్ కావడంతో బుక్ మై షో ప్రేక్షకులకు రిఫండ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అయితే ఇప్పటివరకూ ఏ సినిమాకు కూడా ఇంత ఎక్కువ మొత్తం రిఫండ్ జరగలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'జన నాయకుడు'. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించంది. మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది.
హైకోర్టులో జననాయగన్కు ఊరట- సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశం
'జన నాయగన్' రీఫండ్ ప్రక్రియ మొదలు- సినీ చరిత్రలోనే ఇదే హెయ్యెస్ట్

