ETV Bharat / entertainment

విజయ్‌ 'జననాయగన్‌'కు సెన్సార్‌ కష్టాలు- హైకోర్టుకు మూవీ టీమ్

సెన్సార్​ సర్టిఫికేట్​ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న సెన్సార్​ బోర్డ్​ - అడ్వాన్స్​ బుకింగ్స్​పై ఎఫెక్ట్​!- హైకోర్టుకు చిత్రబృందం

Jana nayakudu Movie Facing Censer Troubles
Jana nayakudu Movie Facing Censer Troubles (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 7:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Jana nayakudu Movie Facing Censer Troubles: కోలీవుడ్​ స్టార్​ విజయ్​ దళపతి, హెచ్​. వినోద్​ కాంబోలో తెరకెక్కనున్న మూవీ 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​, ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్​ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ విషయంపై మూవీ మేకర్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

'జన నాయకుడు' ఇంకొన్ని రోజుల్లో థియేటర్లోకి రానున్న వేళ కొన్ని రోజుల ముందే మూవీ టీమ్ ఈ చిత్రాన్ని సెన్సార్​ బోర్డ్​కు ​సమర్పించింది. కానీ ఇప్పటికి వరకు సెన్సార్​ బోర్డ్​ నుంచి ఎటువంటి సర్టిఫికేట్ రాలేదు. దీంతో థియేటర్లలో ఈ సినిమా కోసం అడ్వాన్స్​ బుకింగ్స్​ చేసుకోవడం కష్టంగా మారింది. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడం, విజయ్‌ టీం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించడం అభిమానులను కలవర పెడుతోంది.

మద్రాస్​ హైకోర్ట్​లో పిటిషన్
సర్టిఫికేట్​ ప్రాసెస్​ ఆలస్యం అవుతున్నందున మూవీ మేకర్స్​ మద్రాస్​ హైకోర్ట్​లో పిటిషన్​ దాఖలు చేశారు. సెన్సార్​ సర్టిఫికేట్​ను వీలైనంత తొందరగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో పొలిటికల్​ డైలాగ్స్​ ఉండటం వల్లే ఆలస్యమవుతోందని ప్రచారం సాగుతోంది. మరి దీనిపై హైకోర్టు ఏం చెబుతోంది చూడాలి.

సినిమా రిమేక్​పై క్లారిటీ
గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా 'భగవంత్ కేసరి'కి రిమేక్​ అని ప్రచారం సాగింది. ఈ విషయంపై ఇరు దర్శకులు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ దీని ట్రైలర్​ విడుదలయ్యాక బాలయ్య చిత్రానికి రీమేక్ అని క్లియర్​గా అర్ధమవుతోంది. ఆ సినిమాలోనీ కీ పాయింట్​నే దీంట్లోనూ వాడటం, ఇందులోని మమిత బైజు పాత్రకు (విజ్జి) అనే పేరు పెట్టడం ఇవాన్నీ చూస్తే ఆ సినిమాతో పోలికలు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ట్రైలర్ రిలీజైన నిమిషాల్లోనే లక్షల కొద్దీ వ్యూస్​లో ఇది ట్రెండింగ్​లోకి వచ్చేసింది. 'భగవంత్​ కేసరి'లోని కొన్ని సన్నివేశాలతో పోలికలు ఉన్నప్పటికి ఈ సినిమా సెకండ్​ పార్ట్​ను మాత్రం దర్శకుడు డిఫెరెంట్​గా రూపొందించారు. దాంట్లో మూవీని మొత్తం పొలిటికల్​గా చూపించారు. సెకండ్​ పార్ట్​లో విజయ్​ చెప్పే కొన్ని డైలాగ్స్​తో అది పొలిటికల్​ టచ్​లో ఉండనుందని క్లియర్​గా అర్థమవుతోంది.

ఆఖరి సినిమాగా జన నాయకుడు
మరోవైపు 'జన నాయకుడు' విజయ్​ కేరీర్​లోనే ఆఖరి సినిమా కానుంది. సినిమాలను పూర్తిగా విడిచిపెట్టి మొత్తం రాజకీయల్లోనే గడపనున్నారు. ఈ మేరకు మూవీమేకర్స్​ ప్రకటించారు. అయితే ఇదే లాస్ట్​ ఫిలీం కావడంతో ఆయన ఫ్యాన్స్​ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్​గా దీని ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను చాలా గ్రాండ్​గా జరిగింది. ఈ చిత్రాన్ని తమిళ్​తోపాటు తెలుగు, హిందీ భాషల్లో ట్రైలర్​ను విడుదల చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జాన్రాలో తెరకెక్కించారు.

నటీనటులు
ఇక సినిమా విషయానికొస్తే బాబీ డియోల్​ విలన్​ పాత్రలో పోషించనున్నారు. విజయ్​కు జంటగా పూజ హెగ్దే నటించనున్నారు. వీరితో పాటు గౌతమ్​ వసుదేవ్​ మీనన్​, ప్రకాశ్​ రాజ్​, సునీల్​, ప్రియమణి, నారాయణ్ సపోర్టింగ్​ రోల్స్​ ప్లే చేయనున్నారు. అంతే కాక ఈ సినిమా ఫుల్​ యాక్షన్‌ థ్రిల్లర్‌ జాన్రాలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్​పై వెంకట్‌ కె.నారాయణ నిర్మించారు.

OTTలో టాప్​ ప్లేస్​లోకి 'భగవంత్​ కేసరి'- 'జన నాయకుడి' ఎఫెక్టేనా?

'జన నాయకుడు' మూవీ ట్రైలర్ రిలీజ్- రీమేక్​ ప్రచారంపై క్లారిటీ వచ్చేసినట్లే!