'కేరళ స్టోరీ 2' రిలీజ్పై స్టే విధించిన హైకోర్టు - విడుదలకు ఒక్క రోజు ముందు షాక్
Kerala Story 2 Release : కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్పై స్టే విధించిన హైకోర్టు- ఫిర్యాదులను సెన్సార్ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని సూచన

Published : February 26, 2026 at 3:10 PM IST
Kerala Story 2 Release Date : 'ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్' సినిమా విడుదల పై ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. సినిమా విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కురియన్ థామస్ రిలీజ్పై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమాను సర్టిఫై చేసే క్రమంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయకుండా చూసుకునే మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పాటించనట్లు కనిపిస్తోందని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. 15 రోజులపాటు ఈ తీర్పు అమలులో ఉండనుంది. అయితే థియేటర్లలోకి వచ్చే ఒక్క రోజు ముందు కోర్టు తీర్పు మేకర్స్కు షాక్ ఇచ్చినట్లైంది!
కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ రిలీజైంది. అయితే ఇందులో పలు సీన్లు వివాదానికి దారితీశాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు కేరళ సంప్రదాయం, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ట్రైలర్ తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని, ఇందులోని సన్నివేశాలు కేరళను భిన్నంగా చూపిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం విచారించిన ధర్మాసనం, రిలీజ్పై స్టే విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. సినిమాకు సర్టిఫికేషన్ జారీ చేయడాన్ని మరోసారి పరిశీలించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. దీంతో రేపు ఈ సినిమా విడుదల కావడం లేదు.
ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై స్పందించారు. ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ట్రైలర్లోని సన్నివేశాలు కేరళ సంప్రదాయం, మతసామరస్యం, లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వివాదాస్పద సినిమాలకు సెన్సార్స్ క్లియరెన్స్ ఎలా ఇస్తారని బోర్డుపై మండిపడ్డారు. కేరళపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, తమ రాష్ట్ర లౌకిక సంప్రదాయాన్ని అవమానించడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందిందని సీఎం విమర్శించారు. లౌకిక పునాదులపై ఏర్పడ్డ కేరళ సంప్రదాయాన్ని ఇలాంటి అవాస్తవమైన ప్రచారాలతో నాశనం చేయలేరని నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని అన్నారు. ఈ మేరకు ఇటీవల ఆయన ఎక్స్లో ఓ పోస్టు షేర్ చేశారు.
U/A సర్టిఫికెట్
అయితే ఈ సినిమాకు గత గురువారమే సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేషన్ జారీ చేసింది. దీనిపై మూవీటీమ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమాకు సెన్సార్ రావడం విజయంగా భావిస్తున్నట్లు మూవీటీమ్ పేర్కొంది. 'సెన్సార్ నుంచి యూ/ఏ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా తెరకెక్కించడం వెనుక ఉన్న మా ఉద్దేశం దేశ పౌరులందకీ చేరుతుంది. కొన్ని విషయాల్లో మహిళలకు అవగాహన తీసుకురావడమే మా లక్ష్యం. ఇక్కడితో ఆగిపోకుండా తదుపరి తరానికి కూడా మా మెసెజ్ వెళ్లాలనే ఉద్దేశంతోనే సినిమా తెరకెక్కించాం' అని మూవీటీమ్ తెలిపింది. అయితే ఈ సర్టిఫికేషన్ను మరోసారి పరిశీలించాలని కోర్టు సీబీఎఫ్సీకి సూచించింది.
కామాఖ్యా నారాయణ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఉల్క గుప్తా, ఐశ్వర్యా ఓజా, అదితి భాటియా కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజై మంచి విజయం అందుకున్న 'ది కేరళ స్టోరీ' సినిమాకు సీక్వెల్గా పార్ట్ 2 తెరకెక్కింది. అయితే ఈ ట్రైలర్ రిలీజైన తర్వాత కాంట్రవర్సీ షురూ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్కు ఎప్పుడు చిక్కులు వీడుతాయో చూాడాలి!
'ది కేరళ స్టోరీ 2'కు సెన్సార్ క్లియర్- థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

