గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ : వాళ్లకు నో ఎంట్రీ- రాజమౌళి స్పెషల్ వీడియో
గ్లోబ్ట్రాటర్ ఈవెంట్పై జక్కన్న స్పెషల్ వీడియో- అందరూ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

Published : November 13, 2025 at 1:52 PM IST
Globetrotter Event : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ భారీ ఈవెంట్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో వీడియో గ్లింప్స్, సినిమా టైటిల్, మహేశ్ పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రెండు రోజుల్లో ఈవెంట్ ఉండగా, దర్శకుడు రాజమౌళి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవెంట్కు వచ్చే అభిమానులు పాటించాల్సిన రూల్స్ గురించి చెప్పారు.
ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం!
ఈ గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ కాదని, ఫిజికల్ పాస్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని చెప్పారు. సోషల్ మీడియాలో పాస్లు అమ్ముతున్నారని వస్తున్న ప్రచారం అబద్ధం అని, ఫేక్ న్యూస్లు నమ్మవద్దని చెప్పారు. అందరి భద్రత దృష్యా అభిమానులు పోలీసులకు సహకరించాలని, పాస్ తమవెంట తెచ్చుకోవడం మాత్రం తప్పనిసరి అన్నారు. చిన్న చిన్న తప్పుల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని జక్కన్న చెప్పారు.
ఎలా రావాలంటే?
ఈవెంట్కు ఎలా రావాలో కూడా రాజమౌళి వివరంగా చెప్పారు. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుందని అన్నారు. అందుకే విజయవాడ నుంచి వచ్చే వాళ్లు ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్కు ముందే లెఫ్ట్ తీసుకుని ఈవెంట్కు చేరుకోవచ్చని, ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్లు అనాజ్పుర్, సాంఘీ నహర్ మీదుగా రావొచ్చని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పాస్పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ చూపిస్తుందని, అది ఫాలో అయ్యి ఈవెంట్ వద్దకు చేరుకోవచ్చని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఈవెంట్కు రావొచ్చని చెప్పారు.
Very excited to see you all at the #Globetrotter event on November 15.
— rajamouli ss (@ssrajamouli) November 13, 2025
The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8
వాళ్లకు ఎంట్రీ లేదు!
అలాగే ఈ ఈవెంట్కు 18ఏళ్ల లోపున్న వాళ్లకు, సీనియర్ సిటిజన్లకు ఎంట్రీ లేదని చెప్పేశారు. వాళ్లు వచ్చేందుకు పోలీసులు అనుమత నిరాకరించారని, ఇది గమనించి అందరూ సహకరించాలని కోరారు. అలాంటి వాళ్లు ఇంటి దగ్గర్నుంచే ఈవెంట్ను లైవ్ స్ట్రీమింగ్లో చూడాలని అన్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోస్టార్లో ఇది లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
రెండు పోస్టర్లు రిలీజ్
ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే రెండు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. కీలక పాత్రలు పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ', ప్రియాంకా చోప్రా 'మందాకిని' పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ పోస్టర్ను రెండు రోజుల్లో వదులుతారా? లేదా ఈవెంట్లోనే బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి!
And now she arrives…
— Mahesh Babu (@urstrulyMahesh) November 12, 2025
Meet MANDAKINI 💥💥💥@priyankachopra#GlobeTrotter @ssrajamouli @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @tseries pic.twitter.com/8XhqsdFL1R
గ్లోబ్ట్రాటర్ అప్డేట్లు- ఇక మిగిలింది 'బాబు' పోస్టరే
'బిజ్జలదేవ నుంచి కుంభ దాకా'- టాలీవుడ్లో కొత్త ట్రెండ్- ఈ విలన్లు మోస్ట్ పవర్ఫుల్ బాబోయ్!

