ETV Bharat / entertainment

సమ్మర్​లో 'ధురంధర్'​ సీక్వెల్- 'పెద్ది', 'ప్యారడైజ్'​ సినిమాలకు పోటీ తప్పదా?

ధరంధర్ పార్ట్​ 2పై మరింత ఆసక్తి- పాన్ఇండియా సినిమాలకు పోటీ తప్పేలా లేదు- మన సినిమాలకు హిందీ వసూళ్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్!

Update On Dhurandhar part-2
Update On Dhurandhar part- 2 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : December 25, 2025 at 12:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dhurandhar Part- 2 Update : బాలీవుడ్​ లేటెస్ట్​ మూవీ 'ధురంధర్' బాక్స్​ఫీస్​ను షేక్​ చేస్తోంది. ఆదిత్య ధర్​ దర్శకత్వంలో రణ్​వీర్​ సింగ్​ హీరోగా డిసెంబర్​ 5న రిలీజైన ఈ సినిమా 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా ముగింపు ఉత్కంఠభరితంగా ఉండడంతో సీక్వెల్​పైనా అంచనాలు నెలకొన్నాయి. సెకండ్​ పార్ట్​ కూడా తొలి భాగంలాగానే స్రై యాక్షన్​ థ్రిలర్​ మరింత ఆసక్తికరంగా ఉంటుందని మూవీ మేకర్స్​ హింట్ ఇవ్వడంతో సీక్వెల్​ గురించి ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీక్వెల్​ రిలీజ్​, టాలీవుడ్​లో పలు భారీ బడ్జెట్​ సినిమాలపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది!

పార్ట్​- 2 రిలీజ్​ ఎప్పుడు?
'ధురంధర్' బ్లాక్​బస్టర్ హిట్ కావడంతో, ఇతర సినిమాల సీక్వెల్స్​​ లాగా లాంగ్​ గ్యాప్​​ తీసుకోకుండా సెకండ్​ పార్ట్​ను అతి త్వరలోనే విడుదల చేయలని మేకర్స్​ అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్​లో 2026 మార్చి 19న రిలీజ్​ చేయనున్నట్లు అనౌన్స్​ చేశారు. ఆ టైంలో రంజాన్​​ ఫెస్టివల్​ ఉన్నందున ఆ వీకెండ్​ మరింత కలిసొస్తుందని ఈ డేట్​ను ఫిక్స్​ చేసినట్టు తెెలుస్తోంది.

ఈసారి 5 భాషల్లో
అంతేకాకుండా 'ధురంధర్​- 2' ని ఫస్ట్​ పార్ట్​లా కేవలం హిందీలోనే కాకుండా సౌత్​ ఫ్యాన్స్​ను దృష్టిలో పెట్టుకుని పాన్ఇండియా భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సౌత్​లో తమిళనాడు, కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్​కు భారీ స్థాయిలో రెస్పాన్స్​ దక్కింది. అందుకే సీక్వెల్​ను పాన్ఇండియా భాషల్లో రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేస్తునట్టు సమాచారం.

ఆ సినిమాలకు గట్టి పోటీ !
పార్ట్-1కు ఫుల్​హైప్​ రావడంతో ధురంధర్​-2పైనా అంచనాలు నెలకొన్నాయి. అయితే పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న సినిమాలు కొన్ని వచ్చే ఏడాది మార్చిలోనే రిలీజ్​కు రెడీ అవుతున్నాయి. సమ్మర్ అడ్వాంటేజ్​తోనే పలు సినిమాల మేకర్స్ మార్చ్ రిలీజ్​పై కన్నేశారు! రామ్​చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్', అడవి శేష్ 'డకాయిట్', పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్​సింగ్'​తోపాటు కన్నడ హీరో యశ్ మూవీ 'టాక్సిక్'​ 2026 మార్చిలోనే వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇవన్నీ పాన్ఇండియా సినిమాలే. సౌత్​తోపాటు హిందీలోనూ భారీ వసూళ్లే టార్గెట్​గా రానున్నాయి.

ఈ క్రమంలో ధురంధర్ సీక్వెల్​ సమ్మర్​లో రానుండడంతో పాన్ఇండియా సినిమాలకు టఫ్​ కాంపిటిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు సినిమాలకు నార్త్​లో పెద్ద నగరాలలో స్క్రీన్స్ అడ్డెస్ట్​మెంట్ కూడా కష్టంగా ఉండే అవకాశం ఉంది. దీంతో మార్చిలో ధురంధర్ సీక్వెల్ వస్తే, మన తెలుగు సినిమాలకు హిందీ బెల్ట్​లో తీవ్ర పోటీ ఎదురవ్వడం ఖాయం. ఇది హిందీ కలెక్షన్లపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. మరి సమ్మర్​ బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండనుందో చూడాలి.

ఏదేమైనప్పటికి ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న 'ధురంధర్'​ సీక్వెల్​, ముందుగా అనుకున్నట్లే 2026 మార్చి 19న థియేటర్లోకి వచ్చేలా ప్లాన్​ చేస్తున్నారు. అయితే సమ్మర్​ బరిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నందున పోటీ నుంచి ఎవరైనా తప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

​ధురంధర్​ పార్ట్-1 సినిమా విషయానికొస్తే, ఈ నెలలో బాక్సాఫీ వద్ద పోటీ ఎక్కువగా లేకపోవడం దీనికి ప్లస్​ పాయింట్​గా మారింది. ఇప్పటిదాకా వరల్డ్​వైడ్​గా రూ.925 కోట్ల గ్రాస్​ వసూల్ చేసింది. దీంతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ధురంధర్ రికార్డ్ కొట్టింది. ​ఈ చిత్రంలో కీ రోల్​లో రణ్​వీర్​ సింగ్ నటించారు. అక్షయ్​ ఖన్నా, టాలెంటెడ్ యాక్టర్ ఆర్​ మాధవన్​, అర్జున్​ రాంపాల్​, సంజయ్​ దత్​, సారా అర్జున్​, రాకేష్​ బేడీ, మానవ్​ గోహిల్​ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు.

'ధురంధర్' OTT అప్డేట్ - తెలుగు వెర్షన్​ కూడా!- రిలీజ్ ఎప్పుడంటే?

'ధురంధర్' దూకుడు- వసూళ్లలో హిందీ ఇండస్ట్రీ రికార్డు బ్రేక్- ఆ రికార్డు మాత్రం బన్నీదే!