ETV Bharat / education-and-career
పీజీఐఎంఈఆర్లో ఒప్పంద ప్రాతిపదికన జాబ్స్ - ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో ఎంపిక - 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 8:35 PM IST
PGIMER Jobs Notification: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), చండీగఢ్ ఒప్పంద ప్రాతిపదికన 59 గ్రూప్- ఏ, బీ, సీ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూలతో నియామకాలు జరుగుతాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) భారతదేశంలోని చండీగఢ్లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం. ఇది జాతీయ ప్రాధాన్యత సంస్థగా గుర్తింపు పొందింది, దీన్ని 1962లో స్థాపించారు. ఈ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య, పరిశోధనలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఖాళీలున్న పోస్టుల వివరాలు
పోస్టు: జూనియర్ ఇంజినీర్ (సివిల్)
ఖాళీలు: 4
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా.
వేతన శ్రేణి: నెలకు రూ.35,400-1,12,400.
పోస్టు: స్టోర్ కీపర్
ఖాళీలు: 6
అర్హతలు: మ్యాథ్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ స్టాటిస్టిక్స్తో డిగ్రీ. మ్యాథ్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ స్టాటిస్టిక్స్/ ఫైనాన్స్తో ఎంబీఏ.
వేతన శ్రేణి: నెలకు రూ.35,400-1,12,400.
పోస్టు: డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్-3
ఖాళీలు: 5
అర్హతలు: పదో తరగతి, ఏడాది వ్యవధి ఉన్న రేడియోగ్రఫీ డిప్లొమా/ సర్టిఫికెట్. ఏడాది ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వేతన శ్రేణి: నెలకు రూ.19,900-63,200.
పోస్టు: టెక్నీషియన్ గ్రేడ్-1 (లాండ్రీ)
ఖాళీలు: 11
అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, రెండేళ్ల అనుభవం.
వేతన శ్రేణి: నెలకు రూ.18,000-56,900.
ఎంపిక విధానం:
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)తో ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్లో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. సీబీటీలో జనరల్/ ఈడబ్ల్యూఎస్లు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ 35 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి.
ప్రశ్నపత్రం డిగ్రీ/ డిప్లొమా స్థాయిలోనే ఉంటుంది. సీబీటీలో అర్హత మార్కులు పొందిన వారిని పోస్టుకు ఐదుగురు చొప్పున స్కిల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీ, వివరాలను అడ్మిట్ కార్డ్లో తెలియజేస్తారు. దీన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 13 కేంద్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో రాత పరీక్ష నిర్వహిస్తారు
దరఖాస్తు దారులకు కావలసిన సమాచారం:
వయసు: 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీకి ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.800. దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.02.2026
వెబ్సైట్:https://www.pgimer.edu.in/
పీజీఐఎంఈఆర్ గురించి: పీజీఐఎంఈఆర్ను 1960లో స్థాపించాలనుకున్నారు. కానీ 1962లో ప్రారంభించారు. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి సర్దార్ ప్రతాప్ సింగ్ కైరాన్, భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మద్దతుతో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ లక్ష్యాలలో వైద్య రంగంలో ఉన్నత విద్యను అందించడం, నిపుణులను తయారు చేయడం, పరిశోధనలు జరపడం వంటివి ఉన్నాయి. పీజీఐఎంఈఆర్ని ప్రధానంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసమే స్థాపించారు.
ఇక్కడ డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో మాస్టర్ ఆఫ్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సర్జరీ లాంటి కోర్సులు ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే పీహెచ్డీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ నర్సింగ్తో పాటు పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. అడ్మిషన్లు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ఆధారంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఇందులో సీటు కోసం పోటీ పడతారు. పీజీఐఎంఈఆర్ 2024 ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోని వైద్య కాలేజీలలో 2వ స్థానంలో ఉంది. ఇది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది. ఇందులో అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలలో శిక్షణ, పరిశోధన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
నిరుద్యోగులకు శుభవార్త - ఎంఓఐఎల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

