
ETV Bharat / education-and-career
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు - ఐటీఐ చేసినా సరిపోతుంది
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల - మంచి వేతనంతో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్-సీ ప్రభుత్వ ఉద్యోగాలు - పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక

Published : October 15, 2025 at 7:14 PM IST
Engineering Assistant Trainee Jobs At Bharat Electronics Limited : ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 49 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ-22, టెక్నీషియన్-సీలో 27 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యరులకు సమాచారాన్ని ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. వీరు అడ్మిట్కార్డును బెల్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సీబీటీని దిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో నిర్వహిస్తారు.
150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. పార్ట్-1లోని జనరల్ ఆప్టిట్యూడ్కు 50 మార్కులు ఉంటాయి. దీంట్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ, అనలిటికల్, కాంప్రహెన్షన్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రెటేషన్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-2లోని టెక్నికల్ ఆప్టిట్యూడ్ 100 మార్కులకు ఉంటుంది. అర్థమెటిక్, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధిత ప్రశ్నలు ఇస్తారు.
జనరల్ అభ్యరులు 35 శాతం చొప్పున, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం చొప్పున కనీసార్హతగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. సీబీటీలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి మెడికల్ టెస్టుల అనంతరం కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను నవంబరు నెలలో నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీలకు ఆరు నెలల శిక్షణ సమయం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.24 వేల చొప్పున స్టెపెండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత గ్రెడేషన్ టెస్ట్లోనూ ఎంపికైనవారిని రెగ్యులర్ ఉద్యోగులుగా నియమిస్తారు.
సన్నద్ధత
- ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ ట్రేడ్లోని చాప్టర్లను చదవాలి. ముఖ్యాంశాలను శ్రద్ధగా రివిజన్ చేసుకుంటే పార్ట్-2లో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు.
- పార్ట్-1లోని జనరల్ ఆప్టిట్యూడ్ కోసం గతంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- ఆన్లైన్ పరీక్షను నవంబరులో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే సన్నద్ధతను మొదలుపెడితే సమయం ఎక్కువగా వృథా కాకుండా ఉంటుంది. సానుకూల ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.
- నెగటివ్ మార్కులు ఇందులో లేవు. అందువల్ల ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాసి తర్వాత తెలియని ప్రశ్నల సమాధానాల కోసం ప్రయత్నించొచ్చు.
అర్హతలు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ : ఇంజినీరింగ్ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్లు కలిగి ఉండాలి.
టెక్నీషియన్-సీ : పదో తరగతి, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ ట్రేడ్తో ఐటీఐ. ఏడాది సమయంలో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాలి.
జనరల్ అభ్యరులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతంతో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఐటీఐ పాసవ్వాలి.
వయసు: 01.10.2025 నాటికి 28 సంవత్సరాల వయసు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్సీఎల్కు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.590. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు ఎటువంటి ఫీజు లేదు.
వేతన శ్రేణి : ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీలకు నెలకు రూ.24,500 నుంచి 90,000 వేతనం ఉంటుది. టెక్నీషియన్-సీ ఉద్యోగులకు నెలకు రూ.21,500 నుంచి 82,000 అందుతుంది. మూలవేతనానికి అదనంగా డీఏ, పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్స్యూరెన్స్, వైద్య సదుపాయాలు ఉంటాయి.
ముఖ్యాంశాలు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30 అక్టోబరు 2025
- ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
- సీబీటీకి హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు స్లీపర్ క్లాస్ రైలు ఛార్జీలను మొత్తం చెల్లిస్తారు.
- సీబీటీలో ఎంపికైనవారి అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు.
వెబ్సైట్: http://www.bel-india.in/
డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు - ఎంపికైతే నెలకు రూ.రూ.1,50,000 జీతం! - చివరి తేదీ ఎప్పుడంటే?

