ETV Bharat / bharat

హిజాబ్​, బుర్ఖాలను ధరిస్తే గోల్డ్​ షాపుల్లోకి నో ఎంట్రీ- ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ కొత్త రూల్​

దొంగతనాలను అరికట్టడానికే ఈ కొత్త రూల్​- తనిఖీ జరిగాకే షాప్​లోకి అనుమతి - ఈ నియమం మహిళలతోపాటు పురుషులకు వర్తింపు

Hijabs Banned In Jewelry Store
Hijabs Banned In Jewelry Store (ANI, Getty images)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 6:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hijabs Banned In Jewelry Store: బిహార్​లో జ్వువెలరీ షాపుల్లో దొంగతనాలకు చెక్​ పెట్టడానికి ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ ఓ కొత్త రూల్​ను తీసుకొచ్చింది. బిహార్​లో ఏ మహిళ అయిన హిజాబ్​ లేదా బుర్ఖాను​ ధరించి గోల్డ్​ కొనడానికి వస్తే వాళ్లని షాప్​లోకి అనుమతించకూడదనే నియమాన్ని తీసుకొచ్చింది.

పురుషులకు సైతం వర్తిస్తుంది: ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ ఆదేశాల ప్రకారం మహిళలతో పాటు పురుషులకు సైతం ఈ నియమం వర్తిస్తుందని తెలిపారు. ఏ పురుషుడైన వారి ముఖాన్ని స్కార్ఫ్​ లేదా హెల్మేట్​తో కవర్​ చేసుకుని వస్తే వారిని కూడా దుకాణం లోపలికి అనుమతించకూడదని తెలిపారు. వారి ముఖాన్ని తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొనడానికి అనుమతినివ్వాలని కోరారు.

బుర్ఖాలను ధరించి నేరాలు: అయితే ఇలాంటి కొత్త రూల్​ను మొట్టమొదటి సారిగా బిహార్​లోనే అమలు చేశారు. బంగారం దుకాణాల్లో తరచూ జరుగుతున్న చోరిలా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడైన ఆశోక్​ కుమార్​ వర్మ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో దొంగలు బుర్ఖాను ధరించి జ్యూవెలరీ షాప్స్​లో నేరాలు చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో దుకాణదారులను కూడా కాల్చుతున్నారని అందుకే ఈ నిబంధలను తీసుకొచ్చామని ఆశోక్​ కుమార్​ వర్మ వెల్లడించారు.

ముఖాలను చూపించాకే ఎంట్రీ: ఈ నిర్ణయంతో మొత్తం బుర్ఖాలనే బ్యాన్ చేయలనేది తన ఉద్దేశం కాదన్నారు. దానికి బదులుగా ఎవరైతే హిజాబ్​ గాని బుర్ఖాను ధరించి గోల్డ్​ షాప్​కు వస్తే వారి ముఖాలను తప్పక చూపించాలని అంతే కాక ఈ నిర్ణయాన్ని ప్రజలంతా సమ్మతించి వారికి సహాకరించాలని కోరారు. భద్రతా దృష్ట్యా ఈ నియమాన్ని తీసుకుని వచ్చమన్నారు. ఇది మహిళలతో పాటుగా పురుషులకు కూడా వర్తిస్తుందని ఆశోక్​ కుమార్​ వర్మ అన్నారు.

ముస్లిం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ బుర్ఖాకు నేను వ్యతిరేకం కానని, ఇలా చేయడంతో కస్టమర్​ అలాగే షాప్​కీపర్​ మధ్య మంచి సంబంధాలు ఏర్పాడతాయని అన్నారు. ఈ రూల్​ ప్రత్యేకంగా ఒక్క కమ్యూనిటీకే కాకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపారు. "నేను పాట్నా సెంట్రల్​ ఎస్​పీతో మాట్లాడాను. ఆయన ఈ నిర్ణయానికి సరే అన్నారు. ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడంలో బిహార్​ మొదటి రాష్ట్రంగా నిలిచింది. అయితే ఈ రూల్​ అనేక రాష్ట్రాల్లోని జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా అమలులో ఉంది". అని ఆశోక్​ కుమార్​ వెల్లడించారు.

ఎలాంటి వివాదానికి తావు లేదు: అయితే ఈ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నందున ఆశోక్​ వర్మ ఈ విషయంపై మాట్లాడారు. " ఈ విషయంలో వ్యతిరేకత అంటూ ఏమి లేదు. మా సిబ్బందిలోని మహిళలు, పురుషులు కూడా హిజాబ్​ను తీస్తారు. అలా చేయమని మేము వారిని అభ్యర్థిస్తామన్నారు. కేవలం భద్రతా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని దీంట్లో ఎలాంటి వివాదానికి తావు లేదని ఆశోక్​ వర్మ తెలిపారు.

ఆ ఘటన జరిగిన తర్వాత: డిసెంబర్​ 15న పాట్నాలో బిహార్​ ముఖ్యమంత్రి నీతిశ్​​ కుమార్​ ఆయుష్​ డాక్టర్లకు లెటర్లను అందిస్తున్న సమయంలో హిజబ్​ ధరించి ఉన్న ఓ ముస్లిం మహిళ మొహంపై హిజాబ్​ను తొలగించాడు. ఇది రాష్ట్రంలో వివాదంగా చేలరేగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ మారింది. సోషల్ మీడియాలో ఈ విషయంపై దేశామంతటా చర్చలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత రాష్ట్రంలో ఈ రూల్​ని తీసుకుని వచ్చారు.

ఉత్తరప్రదేశ్​లోనూ సేమ్​ రూల్​: ఉత్తర్​ప్రదేశ్​లోని సిప్రి బజార్ ప్రాంతంలో కూడా బంగారు షాపుల్లో తరచూ దొంగతనాల బెడద పెరుగుతున్నందున అక్కడి దుకాణదారులు ఇదే తరహా నియమాన్ని తీసుకొచ్చారు. ముఖాన్ని కవర్​ చేసుకున్న వారిని షాప్​లోకి అనుమతించమని దీనికి సంబంధించిన బోర్డ్​లను వారి షాప్​ లోపల పెట్టుకున్నారు.

చోరీకి వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్​ రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగ

రూ.4 నగదు, కర్చీఫ్​ దొంగతనం కేసు- 51ఏళ్లుగా పరారీలో నిందితుడు- నిర్దోషిగా కోర్టు తీర్పు