LIVE: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం - ప్రత్యక్షప్రసారం - VONTIMITTA SITARAMA KALYANAM LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : April 11, 2025 at 6:28 PM IST
|Updated : April 11, 2025 at 8:55 PM IST
1 Min Read
Vontimitta Sitarama Kalyanam Live : ఒంటిమిట్ట రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణాన్ని వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీల్లోని 60,000ల మంది భక్తులు వీక్షిస్తున్నారు. ప్రతి గ్యాలరీలో పోలీసులు, పారామెడికల్, శ్రీవారి సేవకులు ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. కల్యాణ వేదిక వద్ద తలంబ్రాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తలంబ్రాలు, కంకణం, లడ్డూ, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అలాగే కాలినడకన వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అదేవిధంగా షెడ్ల వద్ద చలివేంద్రం, పానకం, మజ్జిగ, కూలర్లు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ఆలయ సమీపంలో క్యూలైన్లలో వెళ్లే భక్తుల కోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. సీతారాముల కల్యాణోత్సవం వీక్షించేలా 23 ఎల్ఈడీ స్క్రీన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 2,500 మంది పోలీసులు, 400 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఆలయ పరిసరాల్లో 7 డ్రోన్లు, 130 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం లైవ్లో చూద్దాం.
Last Updated : April 11, 2025 at 8:55 PM IST