బోల్తా పడి 10 పల్టీలు కొట్టిన కారు - CAR ACCIDENT VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video


Published : April 3, 2025 at 8:54 AM IST
Car Accident Viral Video : కర్ణాటకలోని చిత్రదుర్గలో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ తర్వాత రోడ్డుపై ఆగకుండా 10 పల్టీలు కొట్టింది. దీంతో అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే?
యాదగిరి జిల్లాకు చెందిన బాధిత కుటుంబం బెంగళూరు నుంచి తమ స్వస్థలానికి కారులో బుధవారం బయలుదేరింది. మార్గమధ్యలో నియంత్రణ కోల్పోయిన కారు డ్రైవర్ డివైడర్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు బోల్తా పడి పది పల్టీలు కొట్టింది. దీంతో కారును నడుపుతున్న మౌలా అబ్దుల్(35) తోపాటు ఆయన ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మరణించారు.
అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేల్చారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.