LIVE : శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌ - ప్రత్యక్ష ప్రసారం - MISS WORLD CONTESTANTS VISIT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 22, 2025 at 8:39 AM IST

Updated : May 22, 2025 at 10:52 AM IST

1 Min Read
Miss World Contestants Visits Shilparamam Live : ప్రపంచ సుందరీమణులు శిల్పారామాన్ని సందర్శిస్తున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలు మే10వ తేదీన ప్రారంభమవ్వగా మే31 వరకు జరగనున్నాయి. ప్రపంచానికి తెలంగాణ పర్యాటకాన్ని పరిచయం చేయడం కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పలు సందర్శనీయ ప్రాంతాలకు సుందరీమణులు వెళ్తున్నారు. దీనికి తెలంగాణ జరూర్​ ఆనా ట్యాగ్​లైన్ పెట్టారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదగిరి గుట్ట, రామోజీ ఫిల్మ్​సిటీ, భూదాన్ పోచంపల్లి, పిల్లలమర్రి, ఏఐజీ హాస్పిటల్​ వంటి ప్రముఖ ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఇవాళ పలు దేశాలకు చెందిన సుందరీమణులు శిల్పారామంలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం నిన్నరాత్రే జరగాల్సి ఉంది కానీ వర్షం వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. మిస్​ వరల్డ్​ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అందగత్తెల పర్యటనను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.  
Last Updated : May 22, 2025 at 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.