LIVE : తెలంగాణ భవన్​లో కేటీఆర్​ మీడియా సమావేశం -​ ప్రత్యక్ష ప్రసారం - KTR LIVE FROM TELANGANA BHAVAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 24, 2025 at 11:23 AM IST

Updated : May 24, 2025 at 11:29 AM IST

1 Min Read
KTR Live From Telangana Bhavan : సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ అధిష్ఠానానికి డబ్బులు కావాలంటే తెలంగాణ నుంచి తరలిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీపై పలు విమర్శలను గుప్పించారు. రాష్ట్రంలో యంగ్​ ఇండియా పేరుతో వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్​ ఆరోపిస్తున్నారు. ఈడీ ఛార్జిషీట్​లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రాహుల్​గాంధీ ఎందుకు స్పందించరని కేటీఆర్​ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్​ఆర్​ ట్యాక్స్​పై ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని కేటీఆర్​ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి దిల్లీలో ఇద్దరు బాస్​లు ఉన్నారని ఒకరు రాహుల్​ గాంధీ, మరొకరు ప్రధాని మోదీ అని కేటీఆర్​ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 
Last Updated : May 24, 2025 at 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.