LIVE: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU NAIDU VISIT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : April 11, 2025 at 12:38 PM IST
|Updated : April 11, 2025 at 2:29 PM IST
1 Min Read
CM Chandrababu Naidu Visit: ఏలూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. జ్యోతిబా ఫులే జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. బీసీ లబ్ధిదారులకు ఉపాధి రాయితీ రుణపత్రాలు చంద్రబాబు అందించనున్నారు. రూ.80 కోట్ల రాయితీని, మరో రూ.80 కోట్ల రుణాన్ని విడుదల చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులకు రూ.40 కోట్ల రాయితీ రుణపత్రాలు అందించనున్నారు. అదే విధంగా ఆదరణ పథకం కింద అందించే కులవృత్తి పరికరాలు పరిశీలించనున్నారు. అనంతరం నూజివీడులో ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం చేపట్టనున్నారు. మధ్యాహ్నం నూజివీడు నియోజవర్గ టీడీపీ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారు. నూజివీడు పర్యటన ముగిశాక గన్నవరం నుంచి కడప వెళ్లనున్నారు. సాయంత్రం ఒంటిమిట్ట టీటీడీ అతిథిగృహానికి చేరుకోనున్నారు. సీఎం దంపతులు ఒంటిమిట్ట కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణంలో పాల్గొననున్నారు. రాత్రికి ఒంటిమిట్టలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు.
Last Updated : April 11, 2025 at 2:29 PM IST