LIVE : భారత్ సమ్మిట్ - సెషన్​లో రాహుల్ గాంధీ - ప్రత్యక్షప్రసారం - BHARAT SUMMIT PLENARY SESSION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : April 26, 2025 at 3:56 PM IST

Updated : April 26, 2025 at 4:50 PM IST

1 Min Read
BHARAT SUMMIT PLENARY LIVE : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హెచ్​ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ - ప్లీనరీ సెషన్​కు హాజరయ్యారు. దేశంలో తాజా పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలు, పెట్టుబడిదారి విధానాలపై వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో ఆయన ప్రసంగిస్తున్నారు. హెచ్​ఐసీసీలో రెండు రోజులుగా జరుగుతున్న ఈ సదస్సు నేడు ముగియనుంది. ఈ సదస్సుకు వంద దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు హాజరయ్యారని అధికారులు అంచనావేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పట్టాలు తప్పుతున్న తరుణం, వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు జరుగుతున్న సమయం, క్రోనీ క్యాపిటలిజంతో అసమానతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వేళ ఈ భారత్‌ సమ్మిట్‌ కీలకం కానుందని అంచనా. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌ బాబు కూడా హాజరయ్యారు. ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో 'భారత్ సమ్మిట్-2025' ఈ అంతర్జాతీయ రాజకీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.  
Last Updated : April 26, 2025 at 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.