Vodafone Idea 5G: వోడాఫోన్ ఐడియా (Vi) తన 5G సర్వీస్ను విస్తరించడం ప్రారంభించింది. కంపెనీ ఇటీవలే తన హైస్పీడ్ 5G నెట్వర్క్ను లాంఛ్ చేసింది. తొలుత ముంబయిలో ఈ సేవలను ప్రారంభించింది. తాజాగా ఇప్పుడు ముంబయి పరిధిని దాటి మరో రెండు నగరాల్లో 5G సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
వోడాఫోన్ ఐడియా 5G సర్వీస్: వీఐ సోమవారం తన 5G సేవను శాంసంగ్ భాగస్వామ్యంతో పంజాబ్ రాజధాని చండీగఢ్, బీహార్ రాజధాని పాట్నాలో ప్రారంభించింది. ఈ క్రమంలో వచ్చే నెలలో దేశంలోని మరికొన్ని ప్రధాన నగరాల్లో 5G నెట్వర్క్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. నెట్వర్క్ ఆప్టిమైజేషన్ కోసం కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగిస్తోంది.
Vi 5G రోల్అవుట్: ఏప్రిల్ 28 నుంచి చండీగఢ్, పాట్నాలోని Vi వినియోగదారులు తమ హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ను పొందొచ్చని వీఐ తెలిపింది. కంపెనీ తన వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు శాంసంగ్ భాగస్వామ్యంతో vRan టెక్నాలజీని అమలు చేసింది. దీనితో పాటు తన 5G నెట్వర్క్ పనితీరును మెరుగుపరచడానికి AI ఆధారిత సెల్ఫ్-ఆర్గనైజింగ్ నెట్వర్క్ (SON) వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ నెట్వర్క్ను స్వీయచాలకంగా పర్యవేక్షిస్తుంది. తద్వారా కనెక్టివిటీని ఆటోమేటిక్గా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో వినియోగదారులు మెరుగైన, స్థిరమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ను పొందగలరు.
Vi 5G సర్వీస్: భారతదేశంలో 5G సేవలు ప్రారంభించినప్పటి నుంచి VIకి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. వీఐ ప్రకారం.. అర్హత కలిగిన వినియోగదారులలో 70 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పుడు VI 5G సర్వీస్ను ఉపయోగిస్తున్నారు. ఇది కంపెనీ మొత్తం నెట్వర్క్లో 20 శాతం. ఇది కాకుండా వీఐ.. IPL 2025 సీజన్లో దేశవ్యాప్తంగా 11 ప్రధాన క్రికెట్ స్టేడియాల్లో కూడా 5G సేవలను అందిస్తోంది. ముంబయి, చండీగఢ్, పాట్నా తర్వాత ఇప్పుడు బెంగళూరు, దిల్లీ వంటి పెద్ద నగరాల్లో తన 5G సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. భారతదేశంలోని వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ 5G సర్వీసులను రోల్అవుట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
D2M టెక్నాలజీతో చౌకైన స్మార్ట్ఫోన్- ఇకపై ఇంటర్నెట్ లేకుండానే OTT, లైవ్ టీవీ కంటెంట్!
నింగిలోకి దూసుకెళ్లిన ప్రాజెక్ట్ 'కైపర్' ఉపగ్రహాలు- ఇవి స్టార్లింక్కు గట్టి పోటీని ఇస్తాయా?
నాన్స్టాప్ గేమింగ్ పెర్ఫార్మెన్స్తో 'రియల్మీ GT 7'- గేమర్లకు ఇక పండగే!