ETV Bharat / technology

UPI సర్వీసులు వచ్చేశాయోచ్- కొన్ని గంటల అంతరాయం అనంతరం రిటర్న్! - UPI SERVICES DOWN

శనివారం నిలిచిపోయిన UPI సర్వీసులు- నెట్టింట ఫిర్యాదుల వెల్లువ!- NPCI ఏమందంటే?

UPI Services Down
UPI Services Down (Photo Credit- ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : April 12, 2025 at 12:18 PM IST

Updated : April 12, 2025 at 12:42 PM IST

2 Min Read

UPI Services Down: దేశంలో నిలిచిపోయిన UPI సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై సోషల్​ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తగా NPCI స్పందించి కొన్ని గంటల్లో సమస్యను పరిష్కరించింది.

అసలేం జరిగిందంటే?: భారతదేశంలో శనివారం UPI సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులు UPI లావాదేవీల్లో పెద్ద అంతరాయాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్యతో SBI, Google Pay, Paytm వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఫండ్స్ ట్రాన్స్​ఫర్, పేమెంట్స్​, యాప్ యాక్టివిటీలో సమస్యలు శనివారం మధ్యాహ్నం నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయలేకపోయినట్లు యూజర్లు అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో దీనిపై ETV భారత్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రజలతో మాట్లాడి సమస్య విస్తృతంగా ఉందని నిర్ధారించింది. QR కోడ్ స్కానింగ్ ద్వారా లేదా UPI-లింక్డ్ ఫోన్​ నంబర్లు లేదా UPI IDలకు నేరుగా పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రర్ అని వచ్చింది. UPI యాప్‌లు, బ్యాంక్ అకౌంట్​లలో ఎర్రర్ విస్తరించి ఉండటం వల్ల ఈ సమస్య UPI సర్వర్‌లకు లింక్ అయినట్లుగా కన్పిస్తోంది. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు కొన్ని బ్యాంకుల్లో వారి అకౌంట్​ బ్యాలెన్స్‌ను చెక్​ చేసుకోగలిగారు. అయితే శనివారం రోజు పేమెంట్స్​ మాత్రం అందరికీ అందుబాటులో లేవు.

మరోవైపు గత 24 గంటల నుంచి యూపీఐ సేవలు డౌన్ అయినట్లు సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ డౌన్​డిటెక్టర్ నివేదించింది. శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎక్కువ మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. పేమెంట్స్ ప్రాసెస్ చేస్తున్న 58శాతం మంది, ఫండ్స్ ట్రాన్స్​ఫర్​లో 42శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు నివేదించింది.

సోషల్ మీడియాలో ఫిర్యాదులు: వినియోగదారులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీనిపై UPI కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా కొంతమంది వినియోగదారుల UPI ట్రాన్సాక్షన్స్​ తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించింది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించింది. ఎట్టకేలకూ కొన్ని గంటల తర్వాత UPI సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

UPI అనేది రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్. దీని సహాయంతో వినియోగదారులు ఎక్కడ ఉన్నా సరే స్మార్ట్​ఫోన్​ ద్వారా తమ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదును వేగంగా బదిలీ చేయొచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. దీంతో ఈ సేవలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇది దేశంలో నగదు డిజిటల్‌ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో UPI సర్వీసులతో డిజిటల్‌ పేమెంట్స్​ను​ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగంలో పెద్ద మార్పులు వచ్చాయనే చెప్పొచ్చు.

మనిషిలా ఆలోచించే 'మివి AI'- మీ క్లోజ్ ఫ్రెండ్​లా ముచ్చట పెట్టుకోవచ్చు!

యువతకు పిచ్చెక్కించే హయబుసా ఇప్పుడు సరికొత్తగా!- దీనిలో ఏం ఫీచర్లు ఉన్నాయంటే?

7300mAh బ్యాటరీ, కిర్రాక్ ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్ సిరీస్‌- బడ్జెట్ ధరలోనే లాంఛ్!

UPI Services Down: దేశంలో నిలిచిపోయిన UPI సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై సోషల్​ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తగా NPCI స్పందించి కొన్ని గంటల్లో సమస్యను పరిష్కరించింది.

అసలేం జరిగిందంటే?: భారతదేశంలో శనివారం UPI సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులు UPI లావాదేవీల్లో పెద్ద అంతరాయాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్యతో SBI, Google Pay, Paytm వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఫండ్స్ ట్రాన్స్​ఫర్, పేమెంట్స్​, యాప్ యాక్టివిటీలో సమస్యలు శనివారం మధ్యాహ్నం నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయలేకపోయినట్లు యూజర్లు అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో దీనిపై ETV భారత్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రజలతో మాట్లాడి సమస్య విస్తృతంగా ఉందని నిర్ధారించింది. QR కోడ్ స్కానింగ్ ద్వారా లేదా UPI-లింక్డ్ ఫోన్​ నంబర్లు లేదా UPI IDలకు నేరుగా పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రర్ అని వచ్చింది. UPI యాప్‌లు, బ్యాంక్ అకౌంట్​లలో ఎర్రర్ విస్తరించి ఉండటం వల్ల ఈ సమస్య UPI సర్వర్‌లకు లింక్ అయినట్లుగా కన్పిస్తోంది. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు కొన్ని బ్యాంకుల్లో వారి అకౌంట్​ బ్యాలెన్స్‌ను చెక్​ చేసుకోగలిగారు. అయితే శనివారం రోజు పేమెంట్స్​ మాత్రం అందరికీ అందుబాటులో లేవు.

మరోవైపు గత 24 గంటల నుంచి యూపీఐ సేవలు డౌన్ అయినట్లు సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ డౌన్​డిటెక్టర్ నివేదించింది. శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎక్కువ మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపింది. పేమెంట్స్ ప్రాసెస్ చేస్తున్న 58శాతం మంది, ఫండ్స్ ట్రాన్స్​ఫర్​లో 42శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు నివేదించింది.

సోషల్ మీడియాలో ఫిర్యాదులు: వినియోగదారులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీనిపై UPI కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా కొంతమంది వినియోగదారుల UPI ట్రాన్సాక్షన్స్​ తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించింది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించింది. ఎట్టకేలకూ కొన్ని గంటల తర్వాత UPI సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

UPI అనేది రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్. దీని సహాయంతో వినియోగదారులు ఎక్కడ ఉన్నా సరే స్మార్ట్​ఫోన్​ ద్వారా తమ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదును వేగంగా బదిలీ చేయొచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. దీంతో ఈ సేవలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇది దేశంలో నగదు డిజిటల్‌ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ నేపథ్యంలో UPI సర్వీసులతో డిజిటల్‌ పేమెంట్స్​ను​ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగంలో పెద్ద మార్పులు వచ్చాయనే చెప్పొచ్చు.

మనిషిలా ఆలోచించే 'మివి AI'- మీ క్లోజ్ ఫ్రెండ్​లా ముచ్చట పెట్టుకోవచ్చు!

యువతకు పిచ్చెక్కించే హయబుసా ఇప్పుడు సరికొత్తగా!- దీనిలో ఏం ఫీచర్లు ఉన్నాయంటే?

7300mAh బ్యాటరీ, కిర్రాక్ ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్ సిరీస్‌- బడ్జెట్ ధరలోనే లాంఛ్!

Last Updated : April 12, 2025 at 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.