ETV Bharat / technology

పెట్రోల్​లో కలిపే ఇథనాల్ 30శాతానికి పెంపు?- క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం - INDIA ETHANOL DRIVE

పెట్రోల్​లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడంపై స్పందించిన ప్రభుత్వం- లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం

India's Ethanol Drive (Symbolic Image)
India's Ethanol Drive (Symbolic Image) (Photo Credit- Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : April 18, 2025 at 12:00 PM IST

4 Min Read

India's Ethanol Drive: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్​లో కలిపే ఇథనాల్ 30శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. చాలా మీడియా కథనాలు కూడా E30 పెట్రోల్‌ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే తాజాగా దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఇప్పటివరకూ ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి ఆదివారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

కాగా ఇంతకుముందు 2030 నాటికి పెట్రోల్‌తో 20% ఇథనాల్‌ను కలపడం లక్ష్యంగా ఉండగా ఆ టార్గెట్​ను ఇప్పుడు 30శాతానికి పెంచుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీన్ని పూర్తిగా ఖండించిన ప్రభుత్వం దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది. గతంలో 2030 నాటికి E30 పెట్రోల్‌ టార్గెట్​ ఉండగా దాన్ని ఇథనాల్ సప్లై ఇయర్ (ESY) 2025-26 నాటికి E20గా మార్చినట్లు పేర్కొంది. పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తూ దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడటాన్ని మరింత తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏంటీ ఇథనాల్?: ఇది చెరకు ప్రాసెసింగ్​లో బైప్రొడక్ట్. దీన్ని పెట్రోల్‌తో కలపొచ్చు. ఇది శిలాజ ఇంధన వినియోగంతోపాటు హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ప్రైమరీ జీవ ఇంధనాలలో ఒకటైన ఇథనాల్ సహజంగా ఈస్ట్‌లతో చక్కెరల కిణ్వ ప్రక్రియ ద్వారా లేదా ఇథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రాసెస్​ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మాత్రమే కాకుండా వివిధ పరిశ్రమలలో రసాయన ద్రావణిగా, సేంద్రీయ సమ్మేళనాల సంశ్లేషణలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇథనాల్ ఒక క్రిమినాశక, క్రిమిసంహారక మందుగా కూడా పనిచేస్తుంది.

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్: భారతదేశంలో పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపడం 2001లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) జూన్ 2022లో 10% ఇథనాల్ కలపే లక్ష్యాన్ని సాధించాయి. ఇది మార్చి 2025 నాటికి 20%కి పెరిగింది. మన దేశంలోని చాలామంది ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) ఇప్పటికే E20 ఫ్యూయెల్-కంప్లైంట్ ఇంజిన్‌లతో తమ వాహనాలను అప్డేట్ చేశారు.

ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం కింద ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి E20 ఫ్యూయెల్-ట్యూన్డ్ ఇంజిన్‌లతో వాహనాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెట్రోల్‌తో పోలిస్తే E20 ఫ్యూయెల్​తో నడిచే వాహనాలు కాస్త తక్కువ మైలేజీని ఇస్తాయి. కానీ ఇంజిన్ హార్డ్‌వేర్, ట్యూనింగ్‌లో మార్పులతో మిశ్రమ ఇంధనం వల్ల కలిగే సామర్థ్య నష్టాన్ని తగ్గించవచ్చని SIAM (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు) ఇంటర్-మినిస్టీరియల్ కమిటీకి తెలియజేసింది. E20 ఫ్యూయెల్ అంటే పెట్రోల్​లో 20% ఇథనాల్​ను కలపడం.

EBP కార్యక్రమం కింద 2030 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలనే ఇండికేటివ్ టార్గెట్​ను మొదట నిర్ణయించారు. అయితే 2020లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఈ లక్ష్యాన్ని 2025కి మార్చింది.

గత పదేళ్లలో (డిసెంబర్ 31, 2024 నాటికి) ప్రభుత్వ రంగ OMCలు పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల దాదాపు 193 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయం జరిగింది. దీంతో సుమారు రూ. 1,13,007 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని జనవరి 29, 2025 నాటి ఒక ప్రకటనలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ వెల్లడించింది.

పెట్రోల్​లో ఇథనాల్ కలపడం వల్ల ఏం జరుగుతుంది?: ఇథనాల్-పెట్రోల్ మిశ్రమం రైతులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. కార్ల నుంచి టెయిల్-పైప్ ఉద్గారాలను తగ్గిస్తుంది. వీటితోపాటు భారతదేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అయితే పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణం పెరిగితే ముఖ్యంగా 25 శాతం మించితే ఇంజిన్ పవర్ అవుట్‌పుట్, ఇంధన సామర్థ్యం ప్రభావితం కావచ్చు. ఇలాంటి సమయంలో E20-కంప్లైంట్ లేని పాత పెట్రోల్ కార్లు ఎక్కువ రిస్క్​లో ఉంటాయి.

అయితే ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అన్ని పెట్రోల్ కార్లు E20 ఇంధనానికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఇథనాల్ కూడా తినివేయు స్వభావం కలిగి ఉంటుంది. ఇది వాతావరణంలోని తేమను గ్రహిస్తుంది. కొన్ని పదార్థాలతో చర్య జరిపి వాటిని బలహీనపరచడం, విచ్ఛిన్నం చేయడం లేదా తుప్పు పట్టేలా చేస్తుంది. వాహనాల్లో ఇథనాల్ ఎక్కువసేపు విడుదలైతే ఫ్యూయెల్ ట్యాంకులు, సీల్స్, గాస్కెట్లు, ఇంధన లైన్లు వంటి రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు దెబ్బతింటాయి. కానీ ప్రస్తుతం ఉన్న E20 ఇంధనంతో వాహన పనితీరు, ఇంజిన్ భాగాలు అరిగిపోవడం లేదా ఇంజిన్ ఆయిల్ క్షీణించడం వంటి వాటిలో ఎటువంటి ప్రధాన సమస్యలు ఇప్పటివరకూ గమనించలేదని కమిటీ నివేదిక హైలైట్ చేసింది.

లగ్జరీ ఫీచర్లు, అద్దిరిపోయే డిజైన్​లో స్కోడా కోడియాక్‌- కొత్తగా కారు కొనేవారు దీన్ని ట్రై చేయండి!

బిగ్ బ్యాటరీ, అద్భుతమైన డిస్​ప్లేతో 'రియల్​మీ 14T 5G'- లాంఛ్ ఎప్పుడంటే?

వాట్సాప్​లో కొత్త ఫీచర్- ఇకపై స్టేటస్​లో 90సెకన్ల వీడియోలు అప్లోడ్ చేయొచ్చు!

India's Ethanol Drive: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్​లో కలిపే ఇథనాల్ 30శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. చాలా మీడియా కథనాలు కూడా E30 పెట్రోల్‌ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే తాజాగా దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఇప్పటివరకూ ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి ఆదివారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

కాగా ఇంతకుముందు 2030 నాటికి పెట్రోల్‌తో 20% ఇథనాల్‌ను కలపడం లక్ష్యంగా ఉండగా ఆ టార్గెట్​ను ఇప్పుడు 30శాతానికి పెంచుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీన్ని పూర్తిగా ఖండించిన ప్రభుత్వం దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది. గతంలో 2030 నాటికి E30 పెట్రోల్‌ టార్గెట్​ ఉండగా దాన్ని ఇథనాల్ సప్లై ఇయర్ (ESY) 2025-26 నాటికి E20గా మార్చినట్లు పేర్కొంది. పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తూ దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడటాన్ని మరింత తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏంటీ ఇథనాల్?: ఇది చెరకు ప్రాసెసింగ్​లో బైప్రొడక్ట్. దీన్ని పెట్రోల్‌తో కలపొచ్చు. ఇది శిలాజ ఇంధన వినియోగంతోపాటు హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ప్రైమరీ జీవ ఇంధనాలలో ఒకటైన ఇథనాల్ సహజంగా ఈస్ట్‌లతో చక్కెరల కిణ్వ ప్రక్రియ ద్వారా లేదా ఇథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రాసెస్​ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మాత్రమే కాకుండా వివిధ పరిశ్రమలలో రసాయన ద్రావణిగా, సేంద్రీయ సమ్మేళనాల సంశ్లేషణలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇథనాల్ ఒక క్రిమినాశక, క్రిమిసంహారక మందుగా కూడా పనిచేస్తుంది.

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్: భారతదేశంలో పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపడం 2001లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) జూన్ 2022లో 10% ఇథనాల్ కలపే లక్ష్యాన్ని సాధించాయి. ఇది మార్చి 2025 నాటికి 20%కి పెరిగింది. మన దేశంలోని చాలామంది ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) ఇప్పటికే E20 ఫ్యూయెల్-కంప్లైంట్ ఇంజిన్‌లతో తమ వాహనాలను అప్డేట్ చేశారు.

ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం కింద ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుంచి E20 ఫ్యూయెల్-ట్యూన్డ్ ఇంజిన్‌లతో వాహనాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెట్రోల్‌తో పోలిస్తే E20 ఫ్యూయెల్​తో నడిచే వాహనాలు కాస్త తక్కువ మైలేజీని ఇస్తాయి. కానీ ఇంజిన్ హార్డ్‌వేర్, ట్యూనింగ్‌లో మార్పులతో మిశ్రమ ఇంధనం వల్ల కలిగే సామర్థ్య నష్టాన్ని తగ్గించవచ్చని SIAM (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు) ఇంటర్-మినిస్టీరియల్ కమిటీకి తెలియజేసింది. E20 ఫ్యూయెల్ అంటే పెట్రోల్​లో 20% ఇథనాల్​ను కలపడం.

EBP కార్యక్రమం కింద 2030 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలనే ఇండికేటివ్ టార్గెట్​ను మొదట నిర్ణయించారు. అయితే 2020లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఈ లక్ష్యాన్ని 2025కి మార్చింది.

గత పదేళ్లలో (డిసెంబర్ 31, 2024 నాటికి) ప్రభుత్వ రంగ OMCలు పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల దాదాపు 193 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయం జరిగింది. దీంతో సుమారు రూ. 1,13,007 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని జనవరి 29, 2025 నాటి ఒక ప్రకటనలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ వెల్లడించింది.

పెట్రోల్​లో ఇథనాల్ కలపడం వల్ల ఏం జరుగుతుంది?: ఇథనాల్-పెట్రోల్ మిశ్రమం రైతులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. కార్ల నుంచి టెయిల్-పైప్ ఉద్గారాలను తగ్గిస్తుంది. వీటితోపాటు భారతదేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అయితే పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణం పెరిగితే ముఖ్యంగా 25 శాతం మించితే ఇంజిన్ పవర్ అవుట్‌పుట్, ఇంధన సామర్థ్యం ప్రభావితం కావచ్చు. ఇలాంటి సమయంలో E20-కంప్లైంట్ లేని పాత పెట్రోల్ కార్లు ఎక్కువ రిస్క్​లో ఉంటాయి.

అయితే ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అన్ని పెట్రోల్ కార్లు E20 ఇంధనానికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఇథనాల్ కూడా తినివేయు స్వభావం కలిగి ఉంటుంది. ఇది వాతావరణంలోని తేమను గ్రహిస్తుంది. కొన్ని పదార్థాలతో చర్య జరిపి వాటిని బలహీనపరచడం, విచ్ఛిన్నం చేయడం లేదా తుప్పు పట్టేలా చేస్తుంది. వాహనాల్లో ఇథనాల్ ఎక్కువసేపు విడుదలైతే ఫ్యూయెల్ ట్యాంకులు, సీల్స్, గాస్కెట్లు, ఇంధన లైన్లు వంటి రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు దెబ్బతింటాయి. కానీ ప్రస్తుతం ఉన్న E20 ఇంధనంతో వాహన పనితీరు, ఇంజిన్ భాగాలు అరిగిపోవడం లేదా ఇంజిన్ ఆయిల్ క్షీణించడం వంటి వాటిలో ఎటువంటి ప్రధాన సమస్యలు ఇప్పటివరకూ గమనించలేదని కమిటీ నివేదిక హైలైట్ చేసింది.

లగ్జరీ ఫీచర్లు, అద్దిరిపోయే డిజైన్​లో స్కోడా కోడియాక్‌- కొత్తగా కారు కొనేవారు దీన్ని ట్రై చేయండి!

బిగ్ బ్యాటరీ, అద్భుతమైన డిస్​ప్లేతో 'రియల్​మీ 14T 5G'- లాంఛ్ ఎప్పుడంటే?

వాట్సాప్​లో కొత్త ఫీచర్- ఇకపై స్టేటస్​లో 90సెకన్ల వీడియోలు అప్లోడ్ చేయొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.