HMD And Lava To Launch D2M Phones: ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్ అనివార్యం అయిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని పంచుకోవడం, కమ్యూనికేట్ చేయడం, ఎంటర్టైన్మెంట్లో సహాయపడుతుంది. ఇలాంటి తరుణంలో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యం. అయితే ఇకపై ఇంటర్నెట్తో పనిలేకుండానే OTT, లైవ్ టీవీ, వీడియో, ఆడియోతో పాటు టెక్స్ట్ మెసెజ్లను ఆస్వాదించవచ్చు. ఏంటీ నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్ లేకుండా ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అదే D2M మ్యాజిక్.
ఇది మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ఒక పెద్ద రివల్యూషన్గా మారబోతోంది. ఈ తరహా పరిజ్ఞానంతో HMD గ్లోబల్ అండ్ లావా ఇంటర్నేషనల్ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో ఇకపై మీరు ఎలాంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంటర్నెట్ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
భారతదేశంలో డైరెక్ట్-టు-మొబైల్ (D2M) టెక్నాలజీ కోసం పెద్ద ఎత్తున ఫీల్డ్ ట్రయల్స్ జరగుతున్నాయి. ఈ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్స్ను విడుదల చేసేందుకు HMD గ్లోబల్ అండ్ లావా ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి కసరత్తు చేస్తున్నాయి. వీటిని ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025లో ప్రదర్శించనున్నట్లు ప్రకటించాయి. మే 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఈ ఈవెంట్లో ఈ ఫోన్ల లాంఛ్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
D2M అంటే ఏంటి?: D2M అనేది ఒక విప్లవాత్మకమైన నెక్స్ట్- జనరేషన్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ. ఇది Wi-Fi లేదా ఇంటర్నెట్ సర్వీస్ అవసరం లేకుండానే OTT, లైవ్ టీవీ, వీడియో, ఆడియో అండ్ టెక్స్ట్ మెసెజ్లను నేరుగా మొబైల్ ఫోన్లకు అందిస్తుంది. ఈ టెక్నాలజీ అమలుతో భారత యూజర్లు ఎంటర్ట్టైన్మెంట్, స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఎమర్జెన్సీ అలెర్ట్స్ వంటి వాటిని మొబైల్ పరికరాల్లో నేరుగా టెరెస్ట్రియల్ TV బ్రాడ్కాస్ట్ ఎయిర్వైవ్స్ ద్వారా పొందగలుగుతారు.
సింపుల్గా చెప్పాలంటే D2M అనేది టెలివిజన్ బ్రాడ్కాస్ట్ ద్వారా మొబైల్ ఫోన్లకు డైరెక్ట్గా వీడియోలు, ఆడియోలు, టెక్స్ట్ మెసేజ్లను అందించే ఒక టెక్నాలజీ. ఈ సాంకేతికతతో ఫోన్కు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ప్రజలు వినోదం, విద్య, అత్యవసర హెచ్చరికలను పొందగలరు. ఈ నెక్స్ట్- జనరేషన్ బ్రాడ్కాస్టింగ్ D2M టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ప్రసార భారతి.. IIT కాన్పూర్, తేజస్ నెట్వర్క్ల సహకారంతో చాలా కాలంగా లైవ్ నెట్వర్క్లలో విస్తృతంగా పరీక్షిస్తోంది. అయితే దీని లార్జ్-స్కేల్ ఫీల్డ్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు.
D2M ఫోన్లను విడుదల చేయనున్న HMD అండ్ లావా: ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, తేజస్ నెట్వర్క్స్, సాంఖ్య ల్యాబ్స్ వంటి భాగస్వాముల సహకారంతో భారత్లో D2M టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చేందుకు HMD అండ్ లావా సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే WAVES 2025 ఈవెంట్లో HMD అండ్ Lava తమ D2M ఫోన్లను ఆవిష్కరించేందుకు రెడీ అయ్యాయి. ఈ ఫోన్లు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని, ఇవి 'మేక్ ఇన్ ఇండియా', 'డిజైన్ ఇన్ ఇండియా'కు సపోర్ట్ చేస్తాయని HMD తెలిపింది.

D2M ఫోన్ల తయారీలో HMD నాయకత్వం వహిస్తుండగా, తేజస్ నెట్వర్క్స్ ఈ సాంకేతికతను అందిస్తాయి. సాంఖ్య ల్యాబ్స్ ఫోన్లలో D2Mని ప్రారంభించడానికి SL-3000 చిప్ను అందిస్తాయి. లావా తమ ఇన్-హౌస్ R&D టీమ్, తేజస్ నెట్వర్స్ సంస్థ సాంఖ్య SL-3000 చిప్తో ఇంటిగ్రేట్ అయిన ఫీచర్ ఫోన్ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఇది మీడియాటెక్ MT6261 చిప్తో నడుస్తుందని తెలిపింది. ఇది టీవీ రిసెప్షన్ కోసం UHF యాంటెన్నా, వాయిస్ కాల్స్ కోసం GSM, 2.8-అంగుళాల QVGA డిస్ప్లే, 2,200mAh బ్యాటరీతో వస్తుంది.
D2M టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?: ఈ సాంకేతికత టెలివిజన్ బ్రాడ్కాస్ట్ ద్వారా సిగ్నల్లను ఉపయోగించి ఫోన్లకు వీడియో, ఆడియో అండ్ టెక్స్ట్ మెసేజ్లను డైరెక్ట్గా అందిస్తుంది. అంటే D2M టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ప్రజలు టీవీ ప్రోగ్రామ్లు, స్పోర్ట్స్తో పాటు ఇతర కంటెంట్ను చూడొచ్చు. అంతేకాకుండా ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు ఎమర్జెన్సీ అలెర్ట్స్తోపాటు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించొచ్చు.
నాన్స్టాప్ గేమింగ్ పెర్ఫార్మెన్స్తో 'రియల్మీ GT 7'- గేమర్లకు ఇక పండగే!
నింగిలోకి దూసుకెళ్లిన ప్రాజెక్ట్ 'కైపర్' ఉపగ్రహాలు- ఇవి స్టార్లింక్కు గట్టి పోటీని ఇస్తాయా?
ప్రధాని 'మన్ కీ బాత్'లో SACHET యాప్ ప్రస్తావన- అసలేంటిది?- ఇది ఎందుకు?