Young Man Dies in Parsigutta Hyderabad : తన కళ్లెదుటే స్నేహితుడిని సొంత బావ ఇనుప రాడ్డుతో కొట్టి హత్యచేశాడు. ఈ ఘటనను చూసిన తనను బతకనిస్తాడా? అనే భయంతో మోహన్ కృష్ణ(30) అనే వ్యక్తి ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగనుండగా బౌద్ధనగర్లోని తన ఇంట్లో ఆదివారం (ఏప్రిల్ 27న) రాత్రి మోహన్కృష్ణ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బావ చేతిలో బావమరిది హత్య : తన కుమారుడి ఆత్మహత్యకు ఎలాంటి కారణం తెలియదని మృతుడి తల్లి లక్ష్మి పోలీసులకు చెప్పారు. వివిధ కోణాలు, అంశాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మోహన్కృష్ణ బలవన్మరణానికి కారణమైన కీలక విషయాన్ని తెలుసుకున్నారు.
బావ, బావమరుదుల ఆస్తీ తగాదాలు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముషీరాబాద్ బాకారం ప్రాంతానికి చెందిన శాంసన్ రాజు (38), పార్సీగుట్ట ప్రాంతవాసి లూథరస్ సొంత బావ, బావమరుదులు. శాంసన్ రాజును తన భార్య వదిలేసి, పిల్లలతో వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. రాంనగర్ చేపల మార్కెట్లో రోజువారీ పని చేసుకునే శాంసన్ రాజు కొన్నాళ్లు బావ లూథరస్ ఇంట్లోనే ఉన్నాడు. తాగుడుకు అలవాటు పడిన శాంసన్ రాజు, తన సోదరితో తరుచూ గొడవలు పెట్టుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పైగా శాంసన్ రాజు, లూథరస్ల మధ్య ఆస్థి తగాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదివారం పార్సీగుట్ట చౌరస్తాలోని బార్ ఎదురుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోని పైఅంతస్తులో శాంసన్ రాజు తన స్నేహితుడైన మోహన్ కృష్ణతో కలిసి మద్యం తాగుతుండగా, బావ లూథరస్ కూడా మరికొందరితో కలిసి అక్కడే తాగుతున్నాడు.
భయంతో ఆత్మహత్య : ఈ క్రమంలోనే మత్తులో ఉన్న శాంసన్ రాజు ఆస్తి విషయంలో తనను ఇబ్బందిపెడుతున్న బావ లూథరస్ను దూషించాడు. దీంతో కోపోద్రిక్తుడైన లూథరస్ ఇనుప రాడ్డుతో బావమరిది శాంసన్రాజుపై దాడి చేసి హతమార్చాడు. ఇదంతా అక్కడే ఉన్న మోహన్కృష్ణ కళ్లారా చూశాడు. ఊహించని ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ కేసులో సాక్షి పేరిట పోలీసులు తనను ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న అనుమానం, ఆందోళనతో పాటు బావమరిదినే చంపిన వ్యక్తి ఈ ఘటనను చూసిన తనను కచ్చితంగా ఏదో చేస్తాడన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.
కళ్లలో కారం చల్లి- కట్టేసి కత్తులతో పొడిచి హత్య!- మాజీ DGP మర్డర్ కేసులో కీలక విషయాలు