ETV Bharat / state

'బావమరిదినే చంపేశాడు - నన్ను బతకనిస్తాడా' : భయంతో యువకుడి ఆత్మహత్య - YOUNG MAN DIES PARSIGUTTA

సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని యువకుడి ఆత్యహత్య - వారం రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగనుండగా ప్రాణాలు తీసుకున్న మోహన్‌ కృష్ణ (30) అనే వ్యక్తి - పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

MURDER IN HYDERABAD
YOUNG MAN DIES PARSIGUTTA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 30, 2025 at 3:41 PM IST

2 Min Read

Young Man Dies in Parsigutta Hyderabad : తన కళ్లెదుటే స్నేహితుడిని సొంత బావ ఇనుప రాడ్డుతో కొట్టి హత్యచేశాడు. ఈ ఘటనను చూసిన తనను బతకనిస్తాడా? అనే భయంతో మోహన్‌ కృష్ణ(30) అనే వ్యక్తి ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగనుండగా బౌద్ధనగర్‌లోని తన ఇంట్లో ఆదివారం (ఏప్రిల్ 27న) రాత్రి మోహన్‌కృష్ణ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బావ చేతిలో బావమరిది హత్య : తన కుమారుడి ఆత్మహత్యకు ఎలాంటి కారణం తెలియదని మృతుడి తల్లి లక్ష్మి పోలీసులకు చెప్పారు. వివిధ కోణాలు, అంశాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మోహన్‌కృష్ణ బలవన్మరణానికి కారణమైన కీలక విషయాన్ని తెలుసుకున్నారు.

బావ, బావమరుదుల ఆస్తీ తగాదాలు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముషీరాబాద్ బాకారం ప్రాంతానికి చెందిన శాంసన్ రాజు (38), పార్సీగుట్ట ప్రాంతవాసి లూథరస్ సొంత బావ, బావమరుదులు. శాంసన్ రాజును తన భార్య వదిలేసి, పిల్లలతో వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. రాంనగర్ చేపల మార్కెట్​లో రోజువారీ పని చేసుకునే శాంసన్ రాజు కొన్నాళ్లు బావ లూథరస్ ఇంట్లోనే ఉన్నాడు. తాగుడుకు అలవాటు పడిన శాంసన్ రాజు, తన సోదరితో తరుచూ గొడవలు పెట్టుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పైగా శాంసన్ రాజు, లూథరస్​ల మధ్య ఆస్థి తగాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదివారం పార్సీగుట్ట చౌరస్తాలోని బార్‌ ఎదురుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోని పైఅంతస్తులో శాంసన్​ రాజు తన స్నేహితుడైన మోహన్​ కృష్ణతో కలిసి మద్యం తాగుతుండగా, బావ లూథరస్​ కూడా మరికొందరితో కలిసి అక్కడే తాగుతున్నాడు.

భయంతో ఆత్మహత్య : ఈ క్రమంలోనే మత్తులో ఉన్న శాంసన్‌ రాజు ఆస్తి విషయంలో తనను ఇబ్బందిపెడుతున్న బావ లూథరస్​ను దూషించాడు. దీంతో కోపోద్రిక్తుడైన లూథరస్​ ఇనుప రాడ్డుతో బావమరిది శాంసన్​రాజుపై దాడి చేసి హతమార్చాడు. ఇదంతా అక్కడే ఉన్న మోహన్​కృష్ణ కళ్లారా చూశాడు. ఊహించని ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ కేసులో సాక్షి పేరిట పోలీసులు తనను ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న అనుమానం, ఆందోళనతో పాటు బావమరిదినే చంపిన వ్యక్తి ఈ ఘటనను చూసిన తనను కచ్చితంగా ఏదో చేస్తాడన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

కళ్లలో కారం చల్లి- కట్టేసి కత్తులతో పొడిచి హత్య!- మాజీ DGP మర్డర్ కేసులో కీలక విషయాలు

20 గుంటల భూమి కోసం - మరదలిని హతమార్చిన వదిన

Young Man Dies in Parsigutta Hyderabad : తన కళ్లెదుటే స్నేహితుడిని సొంత బావ ఇనుప రాడ్డుతో కొట్టి హత్యచేశాడు. ఈ ఘటనను చూసిన తనను బతకనిస్తాడా? అనే భయంతో మోహన్‌ కృష్ణ(30) అనే వ్యక్తి ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగనుండగా బౌద్ధనగర్‌లోని తన ఇంట్లో ఆదివారం (ఏప్రిల్ 27న) రాత్రి మోహన్‌కృష్ణ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బావ చేతిలో బావమరిది హత్య : తన కుమారుడి ఆత్మహత్యకు ఎలాంటి కారణం తెలియదని మృతుడి తల్లి లక్ష్మి పోలీసులకు చెప్పారు. వివిధ కోణాలు, అంశాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మోహన్‌కృష్ణ బలవన్మరణానికి కారణమైన కీలక విషయాన్ని తెలుసుకున్నారు.

బావ, బావమరుదుల ఆస్తీ తగాదాలు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముషీరాబాద్ బాకారం ప్రాంతానికి చెందిన శాంసన్ రాజు (38), పార్సీగుట్ట ప్రాంతవాసి లూథరస్ సొంత బావ, బావమరుదులు. శాంసన్ రాజును తన భార్య వదిలేసి, పిల్లలతో వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. రాంనగర్ చేపల మార్కెట్​లో రోజువారీ పని చేసుకునే శాంసన్ రాజు కొన్నాళ్లు బావ లూథరస్ ఇంట్లోనే ఉన్నాడు. తాగుడుకు అలవాటు పడిన శాంసన్ రాజు, తన సోదరితో తరుచూ గొడవలు పెట్టుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పైగా శాంసన్ రాజు, లూథరస్​ల మధ్య ఆస్థి తగాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదివారం పార్సీగుట్ట చౌరస్తాలోని బార్‌ ఎదురుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోని పైఅంతస్తులో శాంసన్​ రాజు తన స్నేహితుడైన మోహన్​ కృష్ణతో కలిసి మద్యం తాగుతుండగా, బావ లూథరస్​ కూడా మరికొందరితో కలిసి అక్కడే తాగుతున్నాడు.

భయంతో ఆత్మహత్య : ఈ క్రమంలోనే మత్తులో ఉన్న శాంసన్‌ రాజు ఆస్తి విషయంలో తనను ఇబ్బందిపెడుతున్న బావ లూథరస్​ను దూషించాడు. దీంతో కోపోద్రిక్తుడైన లూథరస్​ ఇనుప రాడ్డుతో బావమరిది శాంసన్​రాజుపై దాడి చేసి హతమార్చాడు. ఇదంతా అక్కడే ఉన్న మోహన్​కృష్ణ కళ్లారా చూశాడు. ఊహించని ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ కేసులో సాక్షి పేరిట పోలీసులు తనను ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న అనుమానం, ఆందోళనతో పాటు బావమరిదినే చంపిన వ్యక్తి ఈ ఘటనను చూసిన తనను కచ్చితంగా ఏదో చేస్తాడన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

కళ్లలో కారం చల్లి- కట్టేసి కత్తులతో పొడిచి హత్య!- మాజీ DGP మర్డర్ కేసులో కీలక విషయాలు

20 గుంటల భూమి కోసం - మరదలిని హతమార్చిన వదిన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.