ETV Bharat / state

యశ్వంతపూర్​ రైలులో పొగలు - పరుగులు తీసిన ప్రయాణికులు - YESVANTPUR SUPERFAST EXPRESS

బీహార్​ నుంచి బెంగళూరు వెళ్తున్న యశ్వంతపూర్​ సూపర్ ఫాస్ట్​ రైలు - ఎస్-2 బోగీ వద్ద రన్నింగ్ రైలులో ఒక్కసారిగా నిప్పురవ్వలు

yesvantpur_superfast-express-at-chirala-railway-station
yesvantpur_superfast-express-at-chirala-railway-station (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 11, 2025 at 1:57 PM IST

1 Min Read

Yesvantpur Superfast Express at Chirala Railway Station : యశ్వంత్​పుర సూపర్​ఫాస్ట్​ రైలులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. చీరాల రైల్వేస్టేషన్ సమీపంలోని పేరాల రైల్వే గేట్ వద్ద బీహార్​ నుంచి బెంగళూరు వెళ్తున్న యశ్వంతపూర్​ సూపర్ ఫాస్ట్​ రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయింది. ఎస్-2 బోగీ వద్ద రన్నింగ్ రైలులో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి పొగ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ప్రయాణికులు చైన్​ లాగి ట్రైన్​ను ఆపారు. రైలు నుంచి దిగిన ప్రయాణికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే బ్రేక్​లు వేసే సమయంలో రైలు చక్రాలకు రాపిడి జరగడంతో నిప్పు రవ్వలు వచ్చాయని, ఇది సాధారణమేనని రైల్వే అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా రైలు నుంచి దిగిన ప్రయాణికులు పరుగులు తీస్తూ పట్టాలు దాటుతున్న సమయంలో పక్క ట్రాక్​పై మరో రైలు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Yesvantpur Superfast Express at Chirala Railway Station : యశ్వంత్​పుర సూపర్​ఫాస్ట్​ రైలులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. చీరాల రైల్వేస్టేషన్ సమీపంలోని పేరాల రైల్వే గేట్ వద్ద బీహార్​ నుంచి బెంగళూరు వెళ్తున్న యశ్వంతపూర్​ సూపర్ ఫాస్ట్​ రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయింది. ఎస్-2 బోగీ వద్ద రన్నింగ్ రైలులో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి పొగ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ప్రయాణికులు చైన్​ లాగి ట్రైన్​ను ఆపారు. రైలు నుంచి దిగిన ప్రయాణికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే బ్రేక్​లు వేసే సమయంలో రైలు చక్రాలకు రాపిడి జరగడంతో నిప్పు రవ్వలు వచ్చాయని, ఇది సాధారణమేనని రైల్వే అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా రైలు నుంచి దిగిన ప్రయాణికులు పరుగులు తీస్తూ పట్టాలు దాటుతున్న సమయంలో పక్క ట్రాక్​పై మరో రైలు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తుని రైలు దహనం కేసు - క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

వందే భారత్​ ట్రైన్​పై దాడి - ముగ్గురు యువకులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.