ETV Bharat / state

విధులకు వెళ్తే 72 గంటల తర్వాతే ఇంటికి : లోకోపైలట్ల ప్రాబ్లమ్స్​ మీకు తెలుసా? - LOCO PILOT​ PROBLEMS

వేసవిలో వేడి, తీరికలేని పని గంటలు, ఇంటివద్ద విశ్రాంతి తక్కువ - ఇవి లోకోపైలట్ల సమస్యలు - ఇంకా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న లోకో పైలట్లు

Loco Pilot​ Problems
Loco Pilot​ Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 30, 2025 at 6:40 PM IST

4 Min Read

Loco Pilot​ Problems : రైలు నడిపేవారిని లోకోపైలట్లు అంటారు. వారికి వచ్చే జీతం చూసి అబ్బో ఎంత జీతం వస్తుందో అనుకుంటారు అంతా. కానీ వారి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో తెలిస్తే అంత ఇచ్చినా తప్పులేదు అనాల్సిందే. ఒక్కరోజు విధులకు వెళ్లారంటే 72 గంటలు పూర్తయ్యే వరకు ఇంటికి రారు. ఒకవేళ ఇంటికి వచ్చినా 16 గంటలలోపే విధులకు మళ్లీ రావాలని పిలుపు వచ్చేస్తుంది. దీంతో చాలా మంది కుటుంబాలకు దూరం అవుతూ, వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన వేగంతో అనేక సిగ్నళ్లను గమనిస్తూ, బోర్డర్​లో సిపాయిలాగా పని చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే రైలు ఇంజిన్​లో ఏమైనా మెరుగైన సౌకర్యాలు ఉంటాయా అంటే అది కూడా ఉండదు. కనీసం తాగడానికి నీరు లేకుండా 14 నుంచి 16 గంటలు పని చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు లోకోపైలట్​, గార్డ్​ పరిస్థితులను ఒకసారి చూద్దాం.

లోకోపైలట్​ రైలు ఇంజిన్​ సమస్యలు : రైలు ఇంజిన్​లో మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలని గతంలో రైల్వేశాఖ నిర్ణయించినా, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. మరోవైపు 13 గంటల ప్రయాణంలో కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే వెంట తీసుకెళ్లాలి. అయితే వేసవిలోనూ, నార్మల్​ టైంలోనూ ఎండల ధాటికి అది వేడెక్కుతుంది. అలాగే తీసుకెళ్లిన ఆహారం పరిస్థితి కూడా అంతే. ఇంజిన్​లో ఫ్యాన్​ సరిగా ఉండదు. గాలి లోకోపైలట్​కు తాకకుండా దాన్ని అమర్చుతారు. కొన్ని రైళ్లకే ఏసీ సౌకర్యం ఉంటుంది. కుర్చీలు కూడా సరైన రీతిలో ఉండవు. వెనక్కు నడుం వాల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. చాలా మంది లోకోపైలట్లు యుక్త వయసులోనే వెన్నుపూస, మెడకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

విశ్రాంతి తక్కువ : లోకో రన్నింగ్​ విభాగంలో పని చేస్తున్న లోకోపైలట్​, అసిస్టెంట్​ లోకోపైలట్లకు విశ్రాంతి తక్కువగా ఉండటంతో ఒత్తిడికి గురవ్వడమే కాకుండా చాలా సమస్యలు తెచ్చుకుంటున్నారు. విధుల్లో చేరిన సమయం నుంచి 13 నుంచి 15 గంటలు పని చేశాక అవుట్​ స్టేషన్​ బయటలో 8 గంటల విశ్రాంతిని ఇస్తారు. విశ్రాంతి గదిలో భోజనం చేసి నిద్రించాక రెండు గంటల ముందుగానే ఫోన్​ చేసి విధుల్లో చేరమని సమాచారం ఇస్తారు. 72 గంటలు ముగిశాక ఇంటి వద్ద కేవలం 16 గంటల విశ్రాంతి మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి, పగలు సైతం లెక్కిస్తారు. రాత్రి ఏ సమయంలో కాల్​ చేసినా విధులకు హాజరు కావాల్సిందే.

రెప్పవాల్చారో ప్రమాదమే : వేల ప్రయాణికుల ప్రాణాలు కేవలం లోకోపైలట్​ చేతిలోనే ఉంటాయి. గంటకు 120 కి.మీ వేగంతో రైలును నడుపుతూ ప్రతి 3 నుంచి 5 కి.మీలోపు సిగ్నళ్లను గమనిస్తూ, ప్రతి రైల్వే గేటులో సిబ్బందికి సిగ్నళ్లు ఇస్తూ ముందుకు వెళ్తారు. ఏ మాత్రం ఏమరుపాటు వహించినా ఎర్ర సిగ్నళ్లు దాటి ఉద్యోగాలను కోల్పోయిన వారు ఉన్నారు.

మనుషులు గాయపడినా, ఇంజిన్​లో లోపాలు ఉన్న ఆయనే గుర్తించాలి : రైలు కిందపడి మనిషి గాయపడితే లోకోపైలట్​ ఎంత రాత్రి సమయమైనా, వర్షం పడుతున్నా రైలును ఆపి అతడిని స్వయంగా మోసుకొని ఇంజిన్​ వద్దకు తీసుకొచ్చి ముందు వచ్చే స్టేషన్​లో స్టేషన్​ మాస్టర్​కు అప్పగించి చికిత్స అందించేలా చూడాల్సిన బాధ్యత లోకో పైలట్​దే. అలాగే రైలులో సాంకేతిక లోపంతో ఆగిపోయినప్పుడు డ్రైవరే తనకు తెలిసిన సాంకేతిక జ్ఞానంతో సరిచేసి రైలును ముందుకు నడపేలా చేయాలి.

లోకోపైలట్ల సమస్యకు పరిష్కారం : పని గంటలు తగ్గించి ఇంటివద్ద విశ్రాంతి పెంచాలని రైలు డ్రైవర్లు కోరుతున్నారు. కాజీపేట లోకో రన్నింగ్ విభాగంలో గతంలో 1000 మందికి పైగా లోకోపైలట్లు ఉండేవారు. ఇప్పుడు వారిలో కొందరిని విజయవాడకు తరలిస్తుండటంతో 540 మందే అక్కడ ఉన్నారు. కాజీపేటలో ఉండే పనికి 700 మంది వరకు సిబ్బంది అవసరం. ఇప్పుడు సిబ్బందిని పెంచాలని, హెడ్​క్వార్టర్లలో విశ్రాంతి ఇవ్వాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

గార్డుల పరిస్థితి కూడా ఇంతే : గూడ్సు రైలు వెనకాల ఉండే గార్డు పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక్కడే ఉంటారు. కనీసం అతని వద్ద పంకా అయినా ఉండదు. అడవి మధ్యలో ట్రైన్​ ఆగితే కనీసం తాను ఉండే గదికి తలుపు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. మాట్లాడే వారూ కనిపించరు. కొన్నిసార్లు దుండగులు దాడులు చేసి గార్డుల వద్ద ఉన్న నగదు, ఆభరణాలు ఎత్తుకుపోయిన సంఘటనలు ఎన్నో. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా ఆరుబయటకు వచ్చి ప్రతి పది నిమిషాలకొకసారి బయటకు వంగి లోకోపైలట్​కు జెండా ఊపుతూ ఉండాలి. వీరికి కూడా కనీసం నీరు, మరుగుదొడ్డి సౌకర్యం అనేది ఉండదు.

రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్న వృద్ధుడు.. చాకచక్యంగా కాపాడిన లోకో ఇన్​స్పెక్టర్​

రైలు పట్టాలపై హై వోల్టేజ్​ ​వైర్​- యశ్వంత్​పుర్ ఎక్స్​ప్రెస్​లో వేల మంది- లోకోపైలట్​ లక్కీగా! - High Voltage Wire On Train Track

Loco Pilot​ Problems : రైలు నడిపేవారిని లోకోపైలట్లు అంటారు. వారికి వచ్చే జీతం చూసి అబ్బో ఎంత జీతం వస్తుందో అనుకుంటారు అంతా. కానీ వారి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో తెలిస్తే అంత ఇచ్చినా తప్పులేదు అనాల్సిందే. ఒక్కరోజు విధులకు వెళ్లారంటే 72 గంటలు పూర్తయ్యే వరకు ఇంటికి రారు. ఒకవేళ ఇంటికి వచ్చినా 16 గంటలలోపే విధులకు మళ్లీ రావాలని పిలుపు వచ్చేస్తుంది. దీంతో చాలా మంది కుటుంబాలకు దూరం అవుతూ, వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన వేగంతో అనేక సిగ్నళ్లను గమనిస్తూ, బోర్డర్​లో సిపాయిలాగా పని చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే రైలు ఇంజిన్​లో ఏమైనా మెరుగైన సౌకర్యాలు ఉంటాయా అంటే అది కూడా ఉండదు. కనీసం తాగడానికి నీరు లేకుండా 14 నుంచి 16 గంటలు పని చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు లోకోపైలట్​, గార్డ్​ పరిస్థితులను ఒకసారి చూద్దాం.

లోకోపైలట్​ రైలు ఇంజిన్​ సమస్యలు : రైలు ఇంజిన్​లో మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలని గతంలో రైల్వేశాఖ నిర్ణయించినా, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. మరోవైపు 13 గంటల ప్రయాణంలో కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే వెంట తీసుకెళ్లాలి. అయితే వేసవిలోనూ, నార్మల్​ టైంలోనూ ఎండల ధాటికి అది వేడెక్కుతుంది. అలాగే తీసుకెళ్లిన ఆహారం పరిస్థితి కూడా అంతే. ఇంజిన్​లో ఫ్యాన్​ సరిగా ఉండదు. గాలి లోకోపైలట్​కు తాకకుండా దాన్ని అమర్చుతారు. కొన్ని రైళ్లకే ఏసీ సౌకర్యం ఉంటుంది. కుర్చీలు కూడా సరైన రీతిలో ఉండవు. వెనక్కు నడుం వాల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. చాలా మంది లోకోపైలట్లు యుక్త వయసులోనే వెన్నుపూస, మెడకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

విశ్రాంతి తక్కువ : లోకో రన్నింగ్​ విభాగంలో పని చేస్తున్న లోకోపైలట్​, అసిస్టెంట్​ లోకోపైలట్లకు విశ్రాంతి తక్కువగా ఉండటంతో ఒత్తిడికి గురవ్వడమే కాకుండా చాలా సమస్యలు తెచ్చుకుంటున్నారు. విధుల్లో చేరిన సమయం నుంచి 13 నుంచి 15 గంటలు పని చేశాక అవుట్​ స్టేషన్​ బయటలో 8 గంటల విశ్రాంతిని ఇస్తారు. విశ్రాంతి గదిలో భోజనం చేసి నిద్రించాక రెండు గంటల ముందుగానే ఫోన్​ చేసి విధుల్లో చేరమని సమాచారం ఇస్తారు. 72 గంటలు ముగిశాక ఇంటి వద్ద కేవలం 16 గంటల విశ్రాంతి మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి, పగలు సైతం లెక్కిస్తారు. రాత్రి ఏ సమయంలో కాల్​ చేసినా విధులకు హాజరు కావాల్సిందే.

రెప్పవాల్చారో ప్రమాదమే : వేల ప్రయాణికుల ప్రాణాలు కేవలం లోకోపైలట్​ చేతిలోనే ఉంటాయి. గంటకు 120 కి.మీ వేగంతో రైలును నడుపుతూ ప్రతి 3 నుంచి 5 కి.మీలోపు సిగ్నళ్లను గమనిస్తూ, ప్రతి రైల్వే గేటులో సిబ్బందికి సిగ్నళ్లు ఇస్తూ ముందుకు వెళ్తారు. ఏ మాత్రం ఏమరుపాటు వహించినా ఎర్ర సిగ్నళ్లు దాటి ఉద్యోగాలను కోల్పోయిన వారు ఉన్నారు.

మనుషులు గాయపడినా, ఇంజిన్​లో లోపాలు ఉన్న ఆయనే గుర్తించాలి : రైలు కిందపడి మనిషి గాయపడితే లోకోపైలట్​ ఎంత రాత్రి సమయమైనా, వర్షం పడుతున్నా రైలును ఆపి అతడిని స్వయంగా మోసుకొని ఇంజిన్​ వద్దకు తీసుకొచ్చి ముందు వచ్చే స్టేషన్​లో స్టేషన్​ మాస్టర్​కు అప్పగించి చికిత్స అందించేలా చూడాల్సిన బాధ్యత లోకో పైలట్​దే. అలాగే రైలులో సాంకేతిక లోపంతో ఆగిపోయినప్పుడు డ్రైవరే తనకు తెలిసిన సాంకేతిక జ్ఞానంతో సరిచేసి రైలును ముందుకు నడపేలా చేయాలి.

లోకోపైలట్ల సమస్యకు పరిష్కారం : పని గంటలు తగ్గించి ఇంటివద్ద విశ్రాంతి పెంచాలని రైలు డ్రైవర్లు కోరుతున్నారు. కాజీపేట లోకో రన్నింగ్ విభాగంలో గతంలో 1000 మందికి పైగా లోకోపైలట్లు ఉండేవారు. ఇప్పుడు వారిలో కొందరిని విజయవాడకు తరలిస్తుండటంతో 540 మందే అక్కడ ఉన్నారు. కాజీపేటలో ఉండే పనికి 700 మంది వరకు సిబ్బంది అవసరం. ఇప్పుడు సిబ్బందిని పెంచాలని, హెడ్​క్వార్టర్లలో విశ్రాంతి ఇవ్వాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

గార్డుల పరిస్థితి కూడా ఇంతే : గూడ్సు రైలు వెనకాల ఉండే గార్డు పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక్కడే ఉంటారు. కనీసం అతని వద్ద పంకా అయినా ఉండదు. అడవి మధ్యలో ట్రైన్​ ఆగితే కనీసం తాను ఉండే గదికి తలుపు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. మాట్లాడే వారూ కనిపించరు. కొన్నిసార్లు దుండగులు దాడులు చేసి గార్డుల వద్ద ఉన్న నగదు, ఆభరణాలు ఎత్తుకుపోయిన సంఘటనలు ఎన్నో. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా ఆరుబయటకు వచ్చి ప్రతి పది నిమిషాలకొకసారి బయటకు వంగి లోకోపైలట్​కు జెండా ఊపుతూ ఉండాలి. వీరికి కూడా కనీసం నీరు, మరుగుదొడ్డి సౌకర్యం అనేది ఉండదు.

రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్న వృద్ధుడు.. చాకచక్యంగా కాపాడిన లోకో ఇన్​స్పెక్టర్​

రైలు పట్టాలపై హై వోల్టేజ్​ ​వైర్​- యశ్వంత్​పుర్ ఎక్స్​ప్రెస్​లో వేల మంది- లోకోపైలట్​ లక్కీగా! - High Voltage Wire On Train Track

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.