Vallabhaneni Vamsi Bail Petition : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. వాదనలు వినిపించేందుకు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో ఓ సారి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన ఎస్సీ, ఎస్టీ కోర్టు దానిని కొట్టేసింది. దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏమో! తెలియదు - కస్టడీలో వల్లభనేని వంశీ సమాధానాలు
వల్లభనేని వంశీకి మరో షాక్ - బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సీఐడీ కోర్టు