Union Petroleum Minister On Refinery industry in AP : పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఆ అవకాశాలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని తెలిపారు.
ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు. ‘‘గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి ఎక్కువ నిల్వ చేస్తాం. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉంది’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
ఏపీలో విస్తరించనున్న లారెస్ ల్యాబ్స్ - రూ.5,000 కోట్లతో పెట్టుబడులు
‘టెస్లా’ కోసం భూములు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం - ఆ జిల్లాలో 500 ఎకరాలు పరిశీలన