TTD Priority For Common Devotees In Summer: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు టీటీడీ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. వీలైనంత వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫారసు లేఖలు తగ్గించి సామాన్యులకు ప్రాధాన్యం కల్పించడం కొంతకాలంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వీఐపీ బ్రేక్ దర్శనాలు నాలుగు వేలు, శ్రీవాణి 1500, దాతలు, వర్చువల్ ఎస్ఈడీల దర్శనాలు దాదాపు ఐదు వేల వరకు టికెట్లను ఇస్తున్నారు.
వారి సిఫారసు లేఖలు రద్దు: దీంతో సామాన్య భక్తులు దర్శించుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయనున్నారని సమాచారం. కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
ఏడుకొండలు వేంకటేశ్వరస్వామి సొంతం - ఎలాంటి అపవిత్రతకు చోటు లేదు: చంద్రబాబు
దర్శనానికి 10 గంటలు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం శ్రీవారిని 65,569 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
మరో మైలురాయిని చేరుకున్న తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు - టీటీడీ ఛైర్మన్ హర్షం