Travel from Hyderabad to Other States Within India : హైదరాబాద్ నుంచి పర్యాటక, సందర్శనీయ స్థలాలకు ప్రత్యేక ప్యాకేజీలపై వెళ్లే వారి కంటే సొంతంగా ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో వారి వివరాలు అందుబాటులో ఉండటం లేదు. ఆన్లైన్లో పూర్తి వివరాలు ఉండటంతో నేరుగా ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దేశంలోని వందలాది పర్యాటక ప్రదేశాలతో పాటు చుట్టుపక్కల దేశాలకు రాష్ట్రం నుంచి భారీగా వెళ్తున్నారు.
అప్పట్లో స్థానికంగా ఉండే టూరిజం ఏజెన్సీల ద్వారా ప్యాకేజీలు బుక్ చేసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పర్యాటక ప్యాకేజీలు, ఆయా ప్రాంతాల వివరాలతో పాటు నగరం నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు విమానాలు, రైళ్లు అందుబాటులో ఉండటంతో సొంతంగానే బుక్ చేసుకుని వెళ్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని పర్యాటక, సందర్శనీయ స్థలాలకు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
విమాన ప్రయాణానికి ప్రాధాన్యం : పర్యాటక ప్రదేశాలు, అక్కడికి చేరుకోవడానికి మార్గాలు, వసతుల వివరాలు ఆన్లైన్లోనే తెలుసుకుంటున్నారు. వ్లాగర్లు, బ్లాగర్లు పూర్తి సమాచారం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రాంతాలకు ఫ్లైట్లు ఉండడంతో విమాన ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల పర్యాటక సంస్థలు లేదా ప్రైవేటు టూరిజం ఆపరేటర్ల ద్వారా అందుబాటులోని ప్యాకేజీలను ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. పిల్లలకు పరీక్షలు పూర్తికావడం, సెలవులు కలిసి రావడంతో తీసుకుని కొన్ని వారాలుగా నగరం నుంచి భారీగా దక్షిణ భారతంలోని కీలకమైన వేసవి విడిది ప్రదేశాలైన ఊటీ, కొడైకెనాల్, మున్నార్, కూర్గ్తో పాటు ఉత్తరాదిన చల్లటి ప్రదేశాలు, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తున్నారు.
దీంతో సమాచారం దొరకడం కష్టంగా మారింది : తాజాగా పహల్గాం దారుణ ఘటన జరిగిన నేపథ్యంలో రాష్ట్రం నుంచి కశ్మీర్కు వెళ్లి చిక్కుకున్న పర్యాటకుల వివరాలను తెలుసుకునేందుకు ఆ శాఖ ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. సొంత ఏర్పాట్లతో వెళ్లిన వారు స్వచ్ఛందంగా చెబితే తప్ప తెలిసే అవకాశం లేకుండా పోయిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నగరం నుంచి శ్రీనగర్కు నేరుగా విమానాలున్నాయి. అక్కడికి ఎక్కువగా పర్యాటకులు, వ్యాపారులు వెళ్తున్నారు. జనవరి నుంచి మే, ఆగస్టు నుంచి అక్టోబర్ సమయంలో జమ్మూకశ్మీర్కు వెళ్తున్నట్లు అంచనా.
ఒకే ట్రిప్లో "కూర్గ్ అందాలు, మైసూర్ భవనాల రాజసం" చూడొచ్చు - తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ!
నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం, రండి - జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు