ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై స్పందించిన మంత్రి పొన్నం - ఏమన్నారంటే? - TRANSPORT MINISTER ON RTC STRIKE

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం స్పందన - ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలన్న మంత్రి - పునరాలోచించాలని సూచన

Minister Ponnam on TGSRTC Strike
Minister Ponnam on TGSRTC Strike (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 30, 2025 at 8:45 PM IST

2 Min Read

Minister Ponnam on TGSRTC Strike : ఆర్టీసీ భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని, కార్మిక నేతలు సమ్మెపై పునరాలోచన చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తిరుమలగిరిలో సారథి పోర్టల్ ప్రారంభం, రవాణా శాఖ కార్యాలయం ఆధునీకరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణ అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు శాఖ మంత్రిగా తనను కార్మిక నేతలు కలవలేదన్నారు. డైరెక్ట్​గా లేబర్ కమిషన్​ను కలిసి నోటీస్ అందజేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిగా తనకు ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందని, కార్మిక సంఘాల నేతలతో సమాలోచనలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

పదేళ్లు ఆర్టీసీ ఆగమైందని తాము అధికారంలోకి వచ్చిన తరవాత అన్ని బకాయిలు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం నష్టాల నుంచి లాభాల బాటలో నడుస్తుందని సమ్మె చేస్తే తిరిగి నష్టాల్లోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడుపుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశంలో పరివాహన్ సారధి అనే పోర్టల్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, దేశంలో ఇప్పటికే 28 రాష్ట్రాలు సారధి పోర్టల్​ను అమలు చేస్తున్నాయన్నారు.

సారధి పోర్టల్​ గురించి తెలుసుకోండి : ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తరువాత సారధి పోర్టల్​పై నిర్ణయం తీసుకొని ప్రారంభించుకున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.. దేశ వ్యాప్తంగా రవాణా పరమైన మార్పులు నిర్ణయాలు, వాహనాల సమాచారం ,రవాణాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం సారధి పోర్టల్​తో తెలుసుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ప్రతి రోజు కనీసం 20 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వందలాది మంది ప్రమాదాల్లో వైకల్యం పొందుతున్నారని ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే రోడ్డు మాసోత్సవాలు ద్వారా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రాణాలు కాపాడేలా స్కూల్ స్థాయి నుండి కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాదాల రహిత తెలంగాణగా మారుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు.

డిమాండ్ల పరిష్కారానికి టీజీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె - ఎప్పటినుంచో తెలుసా?

నిరుద్యోగులకు సజ్జనార్ గుడ్​న్యూస్ - త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి

Minister Ponnam on TGSRTC Strike : ఆర్టీసీ భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని, కార్మిక నేతలు సమ్మెపై పునరాలోచన చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తిరుమలగిరిలో సారథి పోర్టల్ ప్రారంభం, రవాణా శాఖ కార్యాలయం ఆధునీకరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణ అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు శాఖ మంత్రిగా తనను కార్మిక నేతలు కలవలేదన్నారు. డైరెక్ట్​గా లేబర్ కమిషన్​ను కలిసి నోటీస్ అందజేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారుడిగా తనకు ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందని, కార్మిక సంఘాల నేతలతో సమాలోచనలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

పదేళ్లు ఆర్టీసీ ఆగమైందని తాము అధికారంలోకి వచ్చిన తరవాత అన్ని బకాయిలు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం నష్టాల నుంచి లాభాల బాటలో నడుస్తుందని సమ్మె చేస్తే తిరిగి నష్టాల్లోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడుపుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశంలో పరివాహన్ సారధి అనే పోర్టల్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, దేశంలో ఇప్పటికే 28 రాష్ట్రాలు సారధి పోర్టల్​ను అమలు చేస్తున్నాయన్నారు.

సారధి పోర్టల్​ గురించి తెలుసుకోండి : ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తరువాత సారధి పోర్టల్​పై నిర్ణయం తీసుకొని ప్రారంభించుకున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.. దేశ వ్యాప్తంగా రవాణా పరమైన మార్పులు నిర్ణయాలు, వాహనాల సమాచారం ,రవాణాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం సారధి పోర్టల్​తో తెలుసుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ప్రతి రోజు కనీసం 20 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వందలాది మంది ప్రమాదాల్లో వైకల్యం పొందుతున్నారని ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే రోడ్డు మాసోత్సవాలు ద్వారా రోడ్డు భద్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రాణాలు కాపాడేలా స్కూల్ స్థాయి నుండి కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాదాల రహిత తెలంగాణగా మారుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు.

డిమాండ్ల పరిష్కారానికి టీజీఎస్​ఆర్టీసీ కార్మికుల సమ్మె - ఎప్పటినుంచో తెలుసా?

నిరుద్యోగులకు సజ్జనార్ గుడ్​న్యూస్ - త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.