ETV Bharat / state

ట్రేడింగ్​ పేరుతో మోసం-రూ. 12 కోట్లను కాజేసి పరార్​ - TRADING CHEATING IN YSR DISTRICT

వైఎస్సార్ జిల్లాలో షేర్ మార్కెట్ పేరిట ఓ వ్యక్తి ఘరానా మోసం-రూ. 10 లక్షలు ఇస్తే నెలకు రూ.40 వేలు ఇస్తానని నమ్మించి నట్టేట ముంచాడని గగ్గోలు పెడుతున్న బాధితులు

Trading Cheating In YSR District
Trading Cheating In YSR District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 7:47 PM IST

3 Min Read

Trading Cheating In YSR District:షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఓ వ్యక్తి తన తోటి మిత్రులను, తెలిసిన వారిని నమ్మించి మోసం చేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగు చూసింది. మా వద్ద దాదాపు రూ.12 కోట్లను వసూలు చేసి ఉడాయించాడని బాధితులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోనికి వెళ్తే

అసలేం జరిగిందంటే? కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. దాంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ ఒత్తిడి భరించలేక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు మృతి చెందారు. ఈ సమస్యపై తక్షణమే మంత్రులు లోకేశ్, అనిత స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ట్రేడింగ్​ పేరుతో మోసం:షేర్ మార్కెట్​లో పెట్టుబడి పెడుతున్నాను. రూ.10 లక్షలు ఇస్తే మీకు నెల నెలా వడ్డీ రూపంలో రూ.40 వేలను తిరిగి ఇస్తానని బాధితులను నమ్మించాడు. ప్రాంశరీ నోట్లు, అగ్రిమెంట్లు రాసి ఇచ్చాడు. రెండు మూడు నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చిన సోమశేఖర్ రెడ్డి ఆ తర్వాత స్పందించడం లేదని బాధితులు వాపోయారు.

నమ్మించి రూ.12 కోట్లు వసూలు: జగదీశ్వర్ రెడ్డి కుటుంబం రియల్ వెంచర్ వేయడానికి పోగు చేసుకున్న 4 కోట్ల రూపాయల డబ్బును కుటుంబ సభ్యులకు తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాడు. రెండు మూడు నెలల పాటు సక్రమంగా వడ్డీని జగదీశ్వర్ రెడ్డి బ్యాంకు ఖాతాలకు జమ చేశాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే షేర్ మార్కెట్ లో పెడతానని నమ్మించడంతో మరో నాలుగున్నర కోట్ల రూపాయలను ఇచ్చి మోసపోయానని బాధితుడు జగదీశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా జిల్లాలో దాదాపు 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు: బాధితులంతా రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వెనక కడపలోని కొందరు రాజకీయ నాయకుల అండ ఉందని బాధితులు అంటున్నారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

''షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మమ్మల్ని సోమశేఖర్ రెడ్డి మోసం చేశారు. నేను రియల్ వెంచర్ వేయడానికి పోగు చేసుకున్న 4 కోట్ల రూపాయల డబ్బును కుటుంబ సభ్యులకు తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాను. రెండు మూడు నెలల పాటు సక్రమంగా వడ్డీని బ్యాంకు ఖాతాలకు జమ చేశాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే షేర్ మార్కెట్ లో పెడతానని నమ్మించడంతో మరో నాలుగున్నర కోట్ల రూపాయలను ఇచ్చి మోసపోయాను. నాతో పాటు మరో 30 మంది వద్ద నుంచి రూ.12 కోట్లను దోచేశాడు. ప్రభుత్వం దీనిపై స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం''- జగదీశ్వర్‌రెడ్డి,బాధితుడు కడప

బంధువుల పేరిట లోన్లు - బ్యాంక్​ నుంచి ఫోన్లు - వెలుగుచూసిన రూ. 5 కోట్ల మోసం

ఉద్యోగాలు పేరుతో వైసీపీ మహిళా నేత లక్షలు లూటీ- ఒడిశాలో పట్టుకున్న పోలీసులు

Trading Cheating In YSR District:షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఓ వ్యక్తి తన తోటి మిత్రులను, తెలిసిన వారిని నమ్మించి మోసం చేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగు చూసింది. మా వద్ద దాదాపు రూ.12 కోట్లను వసూలు చేసి ఉడాయించాడని బాధితులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోనికి వెళ్తే

అసలేం జరిగిందంటే? కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. దాంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ ఒత్తిడి భరించలేక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు మృతి చెందారు. ఈ సమస్యపై తక్షణమే మంత్రులు లోకేశ్, అనిత స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ట్రేడింగ్​ పేరుతో మోసం:షేర్ మార్కెట్​లో పెట్టుబడి పెడుతున్నాను. రూ.10 లక్షలు ఇస్తే మీకు నెల నెలా వడ్డీ రూపంలో రూ.40 వేలను తిరిగి ఇస్తానని బాధితులను నమ్మించాడు. ప్రాంశరీ నోట్లు, అగ్రిమెంట్లు రాసి ఇచ్చాడు. రెండు మూడు నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చిన సోమశేఖర్ రెడ్డి ఆ తర్వాత స్పందించడం లేదని బాధితులు వాపోయారు.

నమ్మించి రూ.12 కోట్లు వసూలు: జగదీశ్వర్ రెడ్డి కుటుంబం రియల్ వెంచర్ వేయడానికి పోగు చేసుకున్న 4 కోట్ల రూపాయల డబ్బును కుటుంబ సభ్యులకు తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాడు. రెండు మూడు నెలల పాటు సక్రమంగా వడ్డీని జగదీశ్వర్ రెడ్డి బ్యాంకు ఖాతాలకు జమ చేశాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే షేర్ మార్కెట్ లో పెడతానని నమ్మించడంతో మరో నాలుగున్నర కోట్ల రూపాయలను ఇచ్చి మోసపోయానని బాధితుడు జగదీశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా జిల్లాలో దాదాపు 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు: బాధితులంతా రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వెనక కడపలోని కొందరు రాజకీయ నాయకుల అండ ఉందని బాధితులు అంటున్నారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

''షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మమ్మల్ని సోమశేఖర్ రెడ్డి మోసం చేశారు. నేను రియల్ వెంచర్ వేయడానికి పోగు చేసుకున్న 4 కోట్ల రూపాయల డబ్బును కుటుంబ సభ్యులకు తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాను. రెండు మూడు నెలల పాటు సక్రమంగా వడ్డీని బ్యాంకు ఖాతాలకు జమ చేశాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే షేర్ మార్కెట్ లో పెడతానని నమ్మించడంతో మరో నాలుగున్నర కోట్ల రూపాయలను ఇచ్చి మోసపోయాను. నాతో పాటు మరో 30 మంది వద్ద నుంచి రూ.12 కోట్లను దోచేశాడు. ప్రభుత్వం దీనిపై స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం''- జగదీశ్వర్‌రెడ్డి,బాధితుడు కడప

బంధువుల పేరిట లోన్లు - బ్యాంక్​ నుంచి ఫోన్లు - వెలుగుచూసిన రూ. 5 కోట్ల మోసం

ఉద్యోగాలు పేరుతో వైసీపీ మహిళా నేత లక్షలు లూటీ- ఒడిశాలో పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.