ETV Bharat / state

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్ - లడ్డూల కోసం ఇకపై క్యూ కట్టాల్సిన పని లేదు - TTD INTRODUCES KIOSK MACHINES

లడ్డూ విక్రయ కేంద్రంలో రద్దీ తగ్గించేందుకు కియోస్క్​ల ఏర్పాటు - తిరుమలలో ప్రయోగాత్మకంగా యంత్రాలు ఏర్పాటు చేసిన టీటీడీ

TTD Introduces Kiosk Machines For Laddus in Tirumala
TTD Introduces Kiosk Machines For Laddus in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 23, 2025 at 9:03 AM IST

2 Min Read

TTD Introduces Kiosk Machines For Laddus in Tirumala : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని టీటీడీ తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సరికొత్త విధానాన్ని ఆదివారం ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదును చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు కౌంటర్ల వద్ద రద్దీ పెరుగుతుంటుంది.

కియోస్క్​లతో లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం : ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్క్‌ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్‌ నంబర్‌ను కియోస్క్‌లో ఎంటర్​ చేసి, తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్‌లో ఉన్నవారికి ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు. దర్శన టికెట్లు లేనటువంటి భక్తులు తమ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.

ఆ సంఖ్యను 4కు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో 3 కియోస్క్​లను ఏర్పాటు చేశారు. తిరుమల వ్యాప్తంగా సీఆర్వో ఎంక్వైరీ సెంటర్, శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల(గెస్ట్​హౌస్​) వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను కూడా కియోస్క్‌ల ద్వారా పొందేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది.

TTD Introduces Kiosk Machines For Laddus in Tirumala : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని టీటీడీ తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సరికొత్త విధానాన్ని ఆదివారం ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదును చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు కౌంటర్ల వద్ద రద్దీ పెరుగుతుంటుంది.

కియోస్క్​లతో లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం : ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్క్‌ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్‌ నంబర్‌ను కియోస్క్‌లో ఎంటర్​ చేసి, తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్‌లో ఉన్నవారికి ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు. దర్శన టికెట్లు లేనటువంటి భక్తులు తమ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.

ఆ సంఖ్యను 4కు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో 3 కియోస్క్​లను ఏర్పాటు చేశారు. తిరుమల వ్యాప్తంగా సీఆర్వో ఎంక్వైరీ సెంటర్, శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల(గెస్ట్​హౌస్​) వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను కూడా కియోస్క్‌ల ద్వారా పొందేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది.

TTD Introduces Kiosk Machines For Laddus in Tirumala
లడ్డూ ప్రసాద విక్రయకేంద్రంలో కియోస్క్​లు (ETV Bharat)

శ్రీవారి భక్తులకు RTC ఉచిత ప్రయాణం - ప్రతి 4 నిమిషాలకో బస్సు

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక - దివ్యదర్శనం టోకెన్లు కొత్త కౌంటర్ల​లో ఇస్తున్నారు! - ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.