ETV Bharat / state

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల - రిజల్ట్స్​ ఇలా చెక్​ చేసుకోండి! - AP SSC RESULTS 2025

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ - పదో తరగతి పరీక్షల్లో 4,98,585 మంది ఉత్తీర్ణత

AP SSC RESULTS 2025
AP SSC RESULTS 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 23, 2025 at 12:58 PM IST

1 Min Read

AP SSC RESULTS 2025 : ఆంధ్రప్రదేశ్​లో పదో తరగతి ఫలితాలు​ విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను ఆన్​లైన్​లో మంత్రి నారా లోకేశ్​ విడుదల చేశారు. కాగా పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరవ్వగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 81.14గా నమోదైంది. 93.90 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

బాలికలదే పైచేయి : పదో తరగతి పరీక్షల్లో బాలురు కంటే బాలికలే సత్తా చాటారు. బాలురు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్​ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనివారు నిరుత్సాహపడవద్దని ఆయన సూచించారు. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని లోకేశ్​ తెలిపారు.

రిజల్ట్స్​ చెక్​ చేసుకోండిలా : పదో తరగతి ఫలితాలను తెలుసుకునేందుకు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్​సైట్​లను సందర్శించి తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్, లీప్ యాప్‌లోనూ పదోతరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని మంత్రి లోకేశ్​ తెలిపారు. వాట్సప్‌ నెంబర్‌ 95523 00009కు హాయ్‌ మెసేజ్ పంపినా ఫలితాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు.

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్​ ఇక్కడ చెక్​ చేసుకోండి

AP SSC RESULTS 2025 : ఆంధ్రప్రదేశ్​లో పదో తరగతి ఫలితాలు​ విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను ఆన్​లైన్​లో మంత్రి నారా లోకేశ్​ విడుదల చేశారు. కాగా పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరవ్వగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 81.14గా నమోదైంది. 93.90 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

బాలికలదే పైచేయి : పదో తరగతి పరీక్షల్లో బాలురు కంటే బాలికలే సత్తా చాటారు. బాలురు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్​ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనివారు నిరుత్సాహపడవద్దని ఆయన సూచించారు. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని లోకేశ్​ తెలిపారు.

రిజల్ట్స్​ చెక్​ చేసుకోండిలా : పదో తరగతి ఫలితాలను తెలుసుకునేందుకు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్​సైట్​లను సందర్శించి తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్, లీప్ యాప్‌లోనూ పదోతరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని మంత్రి లోకేశ్​ తెలిపారు. వాట్సప్‌ నెంబర్‌ 95523 00009కు హాయ్‌ మెసేజ్ పంపినా ఫలితాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు.

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్​ ఇక్కడ చెక్​ చేసుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.